UP Gang Rape: యూపీలో దారుణం.. కారులో బాలికపై గ్యాంగ్ రేప్

- కదులుతున్న కారులో నుంచి తోసేయడంతో మరో యువతి మృతి
- లక్నోలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బాధితులను కారులో ఎక్కించుకున్న నిందితులు
- మార్గమధ్యలో బాలికపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు నిందితుల అరెస్ట్
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఓ యువతిని, మరో బాలికను కారులో తీసుకెళ్లిన దుండగులు.. మార్గమధ్యలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న యువతిని కదులుతున్న కారులోంచి బయటకు తోసేశారు. దీంతో ఆ యువతి తీవ్రగాయాలపాలై మరణించింది. ఈ దారుణ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం గ్రేటర్ నోయిడాకు చెందిన సందీప్, అమిత్, ఘజియాబాద్ కు చెందిన గౌరవ్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ యువతిని, మరో బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని, లక్నోలో దింపుతామని నమ్మించి తమ కారులో ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో బీర్ తాగుతూ యువతితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మీరట్ జిల్లా సమీపంలో యువతిని కారులోంచి బయటకు తోసివేశారు. తీవ్రగాయాలపాలైన ఆమె ఆ తర్వాత మరణించింది.
అనంతరం కారులోనే బాలికపై ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బులంద్షహర్ జిల్లాలోని ఖుర్జా వద్ద బాలిక తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు అలీగఢ్-బులంద్షహర్ హైవేపై నిందితుల కారును అడ్డగించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో గౌరవ్, సందీప్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లు, బుల్లెట్లు, ఖాళీ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనపై ఖుర్జా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం గ్రేటర్ నోయిడాకు చెందిన సందీప్, అమిత్, ఘజియాబాద్ కు చెందిన గౌరవ్ అనే ముగ్గురు వ్యక్తులు ఓ యువతిని, మరో బాలికను ఉద్యోగం ఇప్పిస్తామని, లక్నోలో దింపుతామని నమ్మించి తమ కారులో ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో బీర్ తాగుతూ యువతితో గొడవపడ్డారు. ఈ క్రమంలో మీరట్ జిల్లా సమీపంలో యువతిని కారులోంచి బయటకు తోసివేశారు. తీవ్రగాయాలపాలైన ఆమె ఆ తర్వాత మరణించింది.
అనంతరం కారులోనే బాలికపై ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బులంద్షహర్ జిల్లాలోని ఖుర్జా వద్ద బాలిక తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన పోలీసులు అలీగఢ్-బులంద్షహర్ హైవేపై నిందితుల కారును అడ్డగించారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో గౌరవ్, సందీప్ కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు పిస్టళ్లు, బుల్లెట్లు, ఖాళీ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనపై ఖుర్జా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.