Gaurav Jaisingh: బహమాస్ టూర్ లో విషాదం.. భారత సంతతి విద్యార్థి మృతి

- స్నేహితులతో కలిసి ట్రిప్ కు వెళ్లిన ఇండియన్ అమెరికన్
- హోటల్ బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తూ కింద పడ్డ గౌరవ్
- ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి
అమెరికాలో చదువుకుంటున్న భారత సంతతి విద్యార్థి ఒకరు ప్రమాదవశాత్తూ బహమాస్ లో చనిపోయాడు. గౌరవ్ జైసింగ్ అనే ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదం చోటుచేసుకుంది. హోటల్ బాల్కనీలో పచార్లు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయాడు. తీవ్రగాయాలపాలైన జైసింగ్ ను అతడి స్నేహితులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే జైసింగ్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
మసాచు సెట్స్లోని బెంట్లీ యూనివర్సిటీలో జైసింగ్ చదువుతున్నాడు. ఈ వారంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తికావాల్సి ఉంది. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి బహమాస్ టూర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. బహమాస్లో వారు బస చేసిన హోటల్ బాల్కనీలో పచార్లు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాదకర సంఘటనపై బెంట్లీ యూనివర్సిటీ స్పందిస్తూ.. జైసింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. జైసింగ్ కుటుంబసభ్యులకు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.
మసాచు సెట్స్లోని బెంట్లీ యూనివర్సిటీలో జైసింగ్ చదువుతున్నాడు. ఈ వారంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తికావాల్సి ఉంది. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి బహమాస్ టూర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. బహమాస్లో వారు బస చేసిన హోటల్ బాల్కనీలో పచార్లు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విషాదకర సంఘటనపై బెంట్లీ యూనివర్సిటీ స్పందిస్తూ.. జైసింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. జైసింగ్ కుటుంబసభ్యులకు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.