Turkey Earthquake: టర్కీలో భూకంపం... అంకారా నగరంలో ప్రకంపనలు

- టర్కీలో గురువారం 5.1 తీవ్రతతో భూకంపం.
- కులుకు 14 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం.
- రాజధాని అంకారాలోనూ ప్రకంపనల ప్రభావం.
- గతంలో ఓసారి టర్కీని భారీ భూకంపం కుదిపేసిన వైనం
టర్కీలో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 3:46 గంటలకు భూమి కంపించినట్టు స్వతంత్ర శాస్త్రీయ సంస్థ ఈఎంఎస్సి (EMSC) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. కులు నగరానికి ఈశాన్యంగా 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
ఈ భూకంప ప్రభావం టర్కీ రాజధాని అంకారా వ్యాప్తంగా స్పష్టంగా కనిపించగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో తక్షణమే ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా, గ్రీస్లోని ఫ్రై సమీపంలో బుధవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:51 గంటలకు, 78 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలియజేసింది. ఈ భూకంప ప్రకంపనలు ఈజిప్టు రాజధాని కైరో వరకు, అలాగే ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్లలో కూడా ప్రకంపనలు వచ్చాయి.
గతేడాది ఫిబ్రవరి 2023లో టర్కీ, సిరియాలను భారీ భూకంపాలు కుదిపేసిన సంగతి విదితమే. తొలుత 7.8 తీవ్రతతో, ఆ తర్వాత 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించాయి. వీటికి తోడు అనేక శక్తివంతమైన ప్రకంపనలు రావడంతో వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘోర విపత్తులో టర్కీలో 59,000 మంది, సిరియాలో 8,000 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా భూకంపంతో ఆనాటి భయానక దృశ్యాలు మరోసారి స్థానికుల మదిలో మెదిలాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ భూకంప ప్రభావం టర్కీ రాజధాని అంకారా వ్యాప్తంగా స్పష్టంగా కనిపించగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ఘటనలో తక్షణమే ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇదిలా ఉండగా, గ్రీస్లోని ఫ్రై సమీపంలో బుధవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:51 గంటలకు, 78 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలియజేసింది. ఈ భూకంప ప్రకంపనలు ఈజిప్టు రాజధాని కైరో వరకు, అలాగే ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్లలో కూడా ప్రకంపనలు వచ్చాయి.
గతేడాది ఫిబ్రవరి 2023లో టర్కీ, సిరియాలను భారీ భూకంపాలు కుదిపేసిన సంగతి విదితమే. తొలుత 7.8 తీవ్రతతో, ఆ తర్వాత 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించాయి. వీటికి తోడు అనేక శక్తివంతమైన ప్రకంపనలు రావడంతో వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘోర విపత్తులో టర్కీలో 59,000 మంది, సిరియాలో 8,000 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా భూకంపంతో ఆనాటి భయానక దృశ్యాలు మరోసారి స్థానికుల మదిలో మెదిలాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.