Nara Lokesh: ఇతరులు పాలసీలు చూసిన చోట ఆయన అవకాశాలు చూశారు: మంత్రి నారా లోకేశ్

- అనంతపురం జిల్లాలో రెన్యూ పవర్ భారీ ప్రాజెక్టుకు భూమిపూజ
- రూ.22 వేల కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం
- మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం
- ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు
- ఏపీని క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ను పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గం, బేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ ఏర్పాటు చేయనున్న రూ.22 వేల కోట్ల విలువైన భారీ హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతితో పాటు వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "రెన్యూ పవర్ ప్రాజెక్టుకు మనం వేస్తున్న పునాదిరాయి, భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి వంటిది. రూ.22 వేల కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు కేవలం గ్రిడ్లకు శక్తినివ్వడమే కాకుండా, నిరుద్యోగ యువత ఆశయాలకు ఊతమిస్తుంది" అని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కేవలం పరిశ్రమ కాదని, అదొక ఉద్యమమని, భవిష్యత్ తరాలకు ఇదొక వారధి అని ఆయన అభివర్ణించారు.
"రెన్యూ పవర్ వారి పునరుత్పాదక ఇంధన సముదాయ ప్రారంభోత్సవం... సాహసోపేతమైన నిర్ణయానికి, స్థిరమైన ప్రగతికి చిహ్నం. ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రూ.22వేల కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ రేపటి వెలుగుకు దారి చూపుతుంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు... ఇది ఒక ఉద్యమం. ఈ రోజు మన కలలకు, భవిష్యత్ తరాలకు వారధి లాంటిది. భూమిపై సూర్యకాంతి, స్వచ్ఛమైన, అమూల్యమైన గాలి లభిస్తున్నపుడు భావితరం కోసం మరోగ్రహం కోసం ఎందుకు ఆలోచించాలి? శిలాజ ఇంధనాల నుండి భవిష్యత్ ఇంధనాల వినియోగం కోసం మేం ముందడుగు వేస్తున్నాం. భావితరాల కోసం ఒక ఉన్నత లక్ష్యంతో పని చేస్తున్నాం" అని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత వల్లే ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోందని లోకేశ్ కొనియాడారు. "ఇతరులు పాలసీలు చూసిన చోట ఆయన అవకాశాలను చూశారు. చంద్రబాబు గారి మార్గదర్శకత్వంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ భారతదేశ హరిత విప్లవానికి బ్లూప్రింట్గా మారింది" అని ప్రశంసించారు. కేవలం 8 నెలల వ్యవధిలోనే టాటా పవర్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, వేదాంత సెరెంటికా, సెయిల్ ఇండస్ట్రీస్, బ్రూక్ఫీల్డ్ వంటి క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించగలిగామని గుర్తుచేశారు.
ప్రాజెక్టు వివరాలు – ఉపాధి అవకాశాలు
అనంతపురంలో రెన్యూ సంస్థ నెలకొల్పనున్న ఈ పునరుత్పాదక ఇంధన కాంప్లెక్స్ను రెండు దశల్లో నిర్మించనున్నారు. తొలిదశలో రూ.7 వేల కోట్ల పెట్టుబడితో 587 మెగావాట్ల సౌర, 250 మెగావాట్ల పవన, 415 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద రూ.22 వేల కోట్ల పెట్టుబడితో 1800 మెగావాట్ల సౌర, 1 గిగావాట్ పవన, 2000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను వివిధ దశల్లో నెలకొల్పుతారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
తిరిగి వస్తున్న పరిశ్రమలు – ప్రభుత్వ లక్ష్యాలు
ఐదేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగం పునరుజ్జీవనం పొందుతోందని మంత్రి లోకేష్ అన్నారు. "గత ప్రభుత్వ హయాంలో పారిపోయిన కంపెనీలన్నీ మళ్లీ ప్రజాప్రభుత్వంలో తిరిగి వస్తున్నాయి. చంద్రబాబు బ్రాండ్ వల్లే రెన్యూ వంటి సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి," అని పేర్కొన్నారు. 2029 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని తెలిపారు. వచ్చే నెలలోనే మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలనే లక్ష్యంతోనే ఇటువంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ఇక్కడ తయారయ్యే విద్యుత్ రాష్ట్రంతో పాటు దేశ అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు.
రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకువెళుతోందని, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఉన్నాయని కొనియాడారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి, సీఎం చంద్రబాబు విజన్ తోడైందని, ఏపీలో ఏర్పాటు చేస్తున్న ఈ కాంప్లెక్స్ దేశంలోనే అతిపెద్దదని పేర్కొన్నారు. స్థానిక రైతులు సహకరించాలని ఆయన కోరారు.
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రాకతో స్థానిక రైతులకు ఎకరాకు రూ.35 వేల వరకు కౌలు లభిస్తుందని, వారి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "రెన్యూ పవర్ ప్రాజెక్టుకు మనం వేస్తున్న పునాదిరాయి, భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి వంటిది. రూ.22 వేల కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు కేవలం గ్రిడ్లకు శక్తినివ్వడమే కాకుండా, నిరుద్యోగ యువత ఆశయాలకు ఊతమిస్తుంది" అని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కేవలం పరిశ్రమ కాదని, అదొక ఉద్యమమని, భవిష్యత్ తరాలకు ఇదొక వారధి అని ఆయన అభివర్ణించారు.
"రెన్యూ పవర్ వారి పునరుత్పాదక ఇంధన సముదాయ ప్రారంభోత్సవం... సాహసోపేతమైన నిర్ణయానికి, స్థిరమైన ప్రగతికి చిహ్నం. ఈ చారిత్రాత్మక క్షణంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రూ.22వేల కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ రేపటి వెలుగుకు దారి చూపుతుంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కేవలం పరిశ్రమ మాత్రమే కాదు... ఇది ఒక ఉద్యమం. ఈ రోజు మన కలలకు, భవిష్యత్ తరాలకు వారధి లాంటిది. భూమిపై సూర్యకాంతి, స్వచ్ఛమైన, అమూల్యమైన గాలి లభిస్తున్నపుడు భావితరం కోసం మరోగ్రహం కోసం ఎందుకు ఆలోచించాలి? శిలాజ ఇంధనాల నుండి భవిష్యత్ ఇంధనాల వినియోగం కోసం మేం ముందడుగు వేస్తున్నాం. భావితరాల కోసం ఒక ఉన్నత లక్ష్యంతో పని చేస్తున్నాం" అని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత వల్లే ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ రంగంలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తోందని లోకేశ్ కొనియాడారు. "ఇతరులు పాలసీలు చూసిన చోట ఆయన అవకాశాలను చూశారు. చంద్రబాబు గారి మార్గదర్శకత్వంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీ భారతదేశ హరిత విప్లవానికి బ్లూప్రింట్గా మారింది" అని ప్రశంసించారు. కేవలం 8 నెలల వ్యవధిలోనే టాటా పవర్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, వేదాంత సెరెంటికా, సెయిల్ ఇండస్ట్రీస్, బ్రూక్ఫీల్డ్ వంటి క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించగలిగామని గుర్తుచేశారు.
ప్రాజెక్టు వివరాలు – ఉపాధి అవకాశాలు
అనంతపురంలో రెన్యూ సంస్థ నెలకొల్పనున్న ఈ పునరుత్పాదక ఇంధన కాంప్లెక్స్ను రెండు దశల్లో నిర్మించనున్నారు. తొలిదశలో రూ.7 వేల కోట్ల పెట్టుబడితో 587 మెగావాట్ల సౌర, 250 మెగావాట్ల పవన, 415 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను ఏర్పాటు చేస్తారు. మొత్తం మీద రూ.22 వేల కోట్ల పెట్టుబడితో 1800 మెగావాట్ల సౌర, 1 గిగావాట్ పవన, 2000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను వివిధ దశల్లో నెలకొల్పుతారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
తిరిగి వస్తున్న పరిశ్రమలు – ప్రభుత్వ లక్ష్యాలు
ఐదేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగం పునరుజ్జీవనం పొందుతోందని మంత్రి లోకేష్ అన్నారు. "గత ప్రభుత్వ హయాంలో పారిపోయిన కంపెనీలన్నీ మళ్లీ ప్రజాప్రభుత్వంలో తిరిగి వస్తున్నాయి. చంద్రబాబు బ్రాండ్ వల్లే రెన్యూ వంటి సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి," అని పేర్కొన్నారు. 2029 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని తెలిపారు. వచ్చే నెలలోనే మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలనే లక్ష్యంతోనే ఇటువంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నామని, ఇక్కడ తయారయ్యే విద్యుత్ రాష్ట్రంతో పాటు దేశ అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు.
రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకువెళుతోందని, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఉన్నాయని కొనియాడారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి, సీఎం చంద్రబాబు విజన్ తోడైందని, ఏపీలో ఏర్పాటు చేస్తున్న ఈ కాంప్లెక్స్ దేశంలోనే అతిపెద్దదని పేర్కొన్నారు. స్థానిక రైతులు సహకరించాలని ఆయన కోరారు.
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రాకతో స్థానిక రైతులకు ఎకరాకు రూ.35 వేల వరకు కౌలు లభిస్తుందని, వారి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.