Joe Biden: బైడెన్కు తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్... ఎముకలకు పాకిన వ్యాధి

- అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్
- వ్యాధి ఎముకలకు పాకినట్టు వైద్యుల వెల్లడి
- చికిత్సా విధానాలపై బైడెన్ కుటుంబ సభ్యుల సమీక్ష
- అధ్యక్షుడు ట్రంప్, కమలా హ్యారిస్, ఒబామా తదితరుల పరామర్శ
- గతంలో క్యాన్సర్పై బైడెన్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు అత్యంత తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ఆదివారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ వార్త అమెరికా రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది.
గత వారం నుంచి మూత్ర సంబంధిత సమస్యలు ఎక్కువ కావడంతో పాటు, ప్రోస్టేట్ గ్రంథిలో ఒక కణితిని గుర్తించిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల అనంతరం గత శుక్రవారం జో బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వ్యాధి తీవ్రతను సూచించే గ్లీసన్ స్కోర్ 9 (గ్రేడ్ గ్రూప్ 5) గా ఉందని, క్యాన్సర్ కణాలు ఎముకలకు కూడా విస్తరించాయని (మెటాస్టాసిస్) ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, ఈ క్యాన్సర్ హార్మోన్లకు స్పందించే తత్వం కలిగి ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని, దీనివల్ల సమర్థవంతమైన చికిత్స అందించేందుకు వీలుంటుందని వైద్యులు భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు వైద్య నిపుణులతో కలిసి అందుబాటులో ఉన్న చికిత్సా మార్గాలపై సమీక్ష జరుపుతున్నారని కార్యాలయం వివరించింది.
82 ఏళ్ల బైడెన్ ఈ ఏడాది ఆరంభంలో అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. బైడెన్ అనారోగ్య వార్త తెలియగానే రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు స్పందించారు. "జో బైడెన్ అనారోగ్య నిర్ధారణ గురించి విని నేను, మెలానియా విచారం వ్యక్తం చేస్తున్నాం. జిల్, కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. జో త్వరగా, విజయవంతంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం" అని ట్రూత్ సోషల్ మాధ్యమంలో ట్రంప్ పోస్ట్ చేశారు. బైడెన్ త్వరగా కోలుకోవాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకాంక్షించారు.
బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కమలా హ్యారిస్ కూడా స్పందిస్తూ "జో ఒక యోధుడు. ఈ సవాలును కూడా ఆయన ఎప్పటిలాగే ధైర్యంగా ఎదుర్కొంటారని నాకు తెలుసు" అని 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డెమోక్రటిక్ పార్టీ చట్టసభ సభ్యుడు రో ఖన్నా కూడా స్పందిస్తూ "ఇటీవల నిర్ధారణ అయిన క్యాన్సర్ను ఓడించడానికి జో బైడెన్, ఆయన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన, జిల్ ఎప్పుడూ పోరాట యోధులే. ఈ సవాలును కూడా వారు ధైర్యంగా, హుందాగా ఎదుర్కొంటారని నాకు నమ్మకం ఉంది" అని 'ఎక్స్' లో పేర్కొన్నారు.
గతంలో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఆయన ఆరోగ్యం, మానసిక చురుకుదనంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. చాలా మంది డెమోక్రాట్లు కూడా ఆశ్చర్యం, నిరాశ వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కాగా, బైడెన్ కుమారుడు బ్యూ బైడెన్ 2015లో క్యాన్సర్తో మరణించిన విషయం విదితమే. అప్పటి నుంచి బైడెన్, మొదట ఉపాధ్యక్షుడిగా బరాక్ ఒబామా హయాంలో, ఆ తర్వాత 2021 నుంచి అధ్యక్షుడిగా క్యాన్సర్ నివారణకు 'మూన్షాట్' కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన స్వయంగా క్యాన్సర్ బారిన పడటం విచారకరం.
గత వారం నుంచి మూత్ర సంబంధిత సమస్యలు ఎక్కువ కావడంతో పాటు, ప్రోస్టేట్ గ్రంథిలో ఒక కణితిని గుర్తించిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల అనంతరం గత శుక్రవారం జో బైడెన్కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వ్యాధి తీవ్రతను సూచించే గ్లీసన్ స్కోర్ 9 (గ్రేడ్ గ్రూప్ 5) గా ఉందని, క్యాన్సర్ కణాలు ఎముకలకు కూడా విస్తరించాయని (మెటాస్టాసిస్) ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, ఈ క్యాన్సర్ హార్మోన్లకు స్పందించే తత్వం కలిగి ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని, దీనివల్ల సమర్థవంతమైన చికిత్స అందించేందుకు వీలుంటుందని వైద్యులు భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మాజీ అధ్యక్షుడు బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు వైద్య నిపుణులతో కలిసి అందుబాటులో ఉన్న చికిత్సా మార్గాలపై సమీక్ష జరుపుతున్నారని కార్యాలయం వివరించింది.
82 ఏళ్ల బైడెన్ ఈ ఏడాది ఆరంభంలో అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. బైడెన్ అనారోగ్య వార్త తెలియగానే రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు స్పందించారు. "జో బైడెన్ అనారోగ్య నిర్ధారణ గురించి విని నేను, మెలానియా విచారం వ్యక్తం చేస్తున్నాం. జిల్, కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. జో త్వరగా, విజయవంతంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం" అని ట్రూత్ సోషల్ మాధ్యమంలో ట్రంప్ పోస్ట్ చేశారు. బైడెన్ త్వరగా కోలుకోవాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకాంక్షించారు.
బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కమలా హ్యారిస్ కూడా స్పందిస్తూ "జో ఒక యోధుడు. ఈ సవాలును కూడా ఆయన ఎప్పటిలాగే ధైర్యంగా ఎదుర్కొంటారని నాకు తెలుసు" అని 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం బైడెన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డెమోక్రటిక్ పార్టీ చట్టసభ సభ్యుడు రో ఖన్నా కూడా స్పందిస్తూ "ఇటీవల నిర్ధారణ అయిన క్యాన్సర్ను ఓడించడానికి జో బైడెన్, ఆయన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన, జిల్ ఎప్పుడూ పోరాట యోధులే. ఈ సవాలును కూడా వారు ధైర్యంగా, హుందాగా ఎదుర్కొంటారని నాకు నమ్మకం ఉంది" అని 'ఎక్స్' లో పేర్కొన్నారు.
గతంలో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఆయన ఆరోగ్యం, మానసిక చురుకుదనంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. చాలా మంది డెమోక్రాట్లు కూడా ఆశ్చర్యం, నిరాశ వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కాగా, బైడెన్ కుమారుడు బ్యూ బైడెన్ 2015లో క్యాన్సర్తో మరణించిన విషయం విదితమే. అప్పటి నుంచి బైడెన్, మొదట ఉపాధ్యక్షుడిగా బరాక్ ఒబామా హయాంలో, ఆ తర్వాత 2021 నుంచి అధ్యక్షుడిగా క్యాన్సర్ నివారణకు 'మూన్షాట్' కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన స్వయంగా క్యాన్సర్ బారిన పడటం విచారకరం.