Shashi Tharoor: శశిథరూర్పై వేటేద్దామా? వద్దా?.. డైలమాలో కాంగ్రెస్

- సొంత పార్టీపై థరూర్ అసంతృప్తి
- కేంద్రంతో సఖ్యతపై కాంగ్రెస్లో ఆందోళన
- కాంగ్రెస్కు మింగుడుపడని థరూర్ వ్యవహారం
- థరూర్ వైఖరిపై కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ వ్యవహారం ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా సొంత పార్టీ విధానాలపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వం అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించడం హస్తం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్పై విషం చిమ్ముతున్న పాకిస్థాన్ను అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ఏడు దౌత్య బృందాల్లో ఒకదానికి థరూర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో థరూర్కు విభేదాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్కు తెలియకుండానే ఎంపిక?
ఈ దౌత్య బృందాల ఏర్పాటులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అన్ని పార్టీల నుంచి సభ్యుల పేర్లను ఆహ్వానించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ పేరును ప్రతిపాదించకపోయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయన్ను నేరుగా ఎంపిక చేయడంపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమను సంప్రదించకుండా, పార్టీ సిఫార్సు లేకుండా థరూర్ను ఎంపిక చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్నది ఆ పార్టీ నేతల అనుమానం. థరూర్ కూడా కేంద్రం అప్పగించిన బాధ్యతను వెంటనే అంగీకరించడం, కనీసం పార్టీ ప్రస్తావన తీసుకురాకపోవడం కాంగ్రెస్కు రుచించలేదని సమాచారం.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటన సందర్భంగా ఒకే వేదికపై థరూర్, మోదీ కనిపించడం, ఆ కార్యక్రమంలో మోదీ.. ‘ఈ రోజు శశి థరూర్ ఇక్కడ ఉన్నారు. ఈ ప్రోగ్రాం కొంతమందికి నిద్ర లేని రాత్రిని మిగులుస్తుంది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గతంలో ఓ కేంద్ర మంత్రితో థరూర్ సెల్ఫీ దిగినప్పుడు కూడా ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని థరూర్ ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి.
కాంగ్రెస్ మల్లగుల్లాలు
శశి థరూర్ పార్టీలోనే కొనసాగుతూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ వ్యవహారశైలి పార్టీకి నష్టం కలిగించకముందే ఆయనపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయనపై వేటు వేయాలా లేక వేచిచూసే ధోరణి అవలంబించాలా అనే విషయంలో పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల్లో కేంద్రానికి కాంగ్రెస్ మద్దతు పలికింది. ఇలాంటి సమయంలో థరూర్ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి వెళుతున్న తరుణంలో ఆయనపై చర్యలు తీసుకుంటే, అది బీజేపీకి అనవసరంగా ఆయుధం అందించినట్లు అవుతుందని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతానికి ఆయన భవిష్యత్ కార్యాచరణను గమనిస్తూ, తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి థరూర్ వ్యవహారం మరో తలనొప్పిగా మారిందనడంలో సందేహం లేదు.
కాంగ్రెస్కు తెలియకుండానే ఎంపిక?
ఈ దౌత్య బృందాల ఏర్పాటులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అన్ని పార్టీల నుంచి సభ్యుల పేర్లను ఆహ్వానించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ పేరును ప్రతిపాదించకపోయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయన్ను నేరుగా ఎంపిక చేయడంపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమను సంప్రదించకుండా, పార్టీ సిఫార్సు లేకుండా థరూర్ను ఎంపిక చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్నది ఆ పార్టీ నేతల అనుమానం. థరూర్ కూడా కేంద్రం అప్పగించిన బాధ్యతను వెంటనే అంగీకరించడం, కనీసం పార్టీ ప్రస్తావన తీసుకురాకపోవడం కాంగ్రెస్కు రుచించలేదని సమాచారం.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటన సందర్భంగా ఒకే వేదికపై థరూర్, మోదీ కనిపించడం, ఆ కార్యక్రమంలో మోదీ.. ‘ఈ రోజు శశి థరూర్ ఇక్కడ ఉన్నారు. ఈ ప్రోగ్రాం కొంతమందికి నిద్ర లేని రాత్రిని మిగులుస్తుంది’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గతంలో ఓ కేంద్ర మంత్రితో థరూర్ సెల్ఫీ దిగినప్పుడు కూడా ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని థరూర్ ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి.
కాంగ్రెస్ మల్లగుల్లాలు
శశి థరూర్ పార్టీలోనే కొనసాగుతూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ వ్యవహారశైలి పార్టీకి నష్టం కలిగించకముందే ఆయనపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆయనపై వేటు వేయాలా లేక వేచిచూసే ధోరణి అవలంబించాలా అనే విషయంలో పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల్లో కేంద్రానికి కాంగ్రెస్ మద్దతు పలికింది. ఇలాంటి సమయంలో థరూర్ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి వెళుతున్న తరుణంలో ఆయనపై చర్యలు తీసుకుంటే, అది బీజేపీకి అనవసరంగా ఆయుధం అందించినట్లు అవుతుందని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతానికి ఆయన భవిష్యత్ కార్యాచరణను గమనిస్తూ, తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని కొందరు సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి థరూర్ వ్యవహారం మరో తలనొప్పిగా మారిందనడంలో సందేహం లేదు.