Budumuru Nagaraju: తెలంగాణ సీఎం ఓఎస్డీని అంటూ బడా కంపెనీలకు బెదిరింపులు.. ఏపీకి చెందిన మాజీ క్రికెటర్ అరెస్టు

- సీఎం ఓఎస్డీనంటూ బెదిరించిన కేసులో మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్
- ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్
- రియల్ ఎస్టేట్ కంపెనీలకూ వాట్సాప్ సందేశాలు
- సీఎం ఓఎస్డీ పేరుతో నకిలీ ఈ-మెయిల్ ఐడీ సృష్టి
- శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు
ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలక అధికారి పేరు చెప్పి బెదిరింపులకు, వసూళ్లకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజు పలువురు వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా, పొలాకి మండలం, యవ్వారిపేటకు చెందిన బుడుమూరు నాగరాజు, తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) అని పరిచయం చేసుకుంటూ పలు మోసాలకు ఒడిగట్టినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ప్రముఖ రవాణా సేవల సంస్థ ర్యాపిడో, పాల ఉత్పత్తుల సంస్థ కంట్రీ డిలైట్ మేనేజింగ్ డైరెక్టర్లకు ఫోన్లు చేసి, నాగరాజు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లకు కూడా సీఎం ఓఎస్డీ పేరుతో వాట్సాప్ ద్వారా సందేశాలు పంపి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో మరింత నమ్మకం కలిగించేందుకు, నాగరాజు ఏకంగా సీఎం ఓఎస్డీ పేరుతో ఒక నకిలీ ఈ-మెయిల్ ఐడీని కూడా సృష్టించినట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అందిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, పక్కా సమాచారంతో శ్రీకాకుళంలో నాగరాజును అరెస్టు చేశారు. అనంతరం అతడిని హైదరాబాద్కు తరలించి, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు సైబర్ క్రైమ్ అధికారులు తెలియజేశారు.
బుడుమూరు నాగరాజుకు గతంలోనూ నేర చరిత్ర ఉంది. గతంలో అతడు కోడెల శివరాంపై కొన్ని తప్పుడు కేసులు పెట్టి, ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. అంతేకాకుండా, 2023లో శ్రీకాకుళం ప్రాంతంలో సుమారు 22 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన కేసులోనూ నాగరాజు నిందితుడిగా ఉన్నాడు.
శ్రీకాకుళం జిల్లా, పొలాకి మండలం, యవ్వారిపేటకు చెందిన బుడుమూరు నాగరాజు, తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) అని పరిచయం చేసుకుంటూ పలు మోసాలకు ఒడిగట్టినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ప్రముఖ రవాణా సేవల సంస్థ ర్యాపిడో, పాల ఉత్పత్తుల సంస్థ కంట్రీ డిలైట్ మేనేజింగ్ డైరెక్టర్లకు ఫోన్లు చేసి, నాగరాజు డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్లకు కూడా సీఎం ఓఎస్డీ పేరుతో వాట్సాప్ ద్వారా సందేశాలు పంపి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో మరింత నమ్మకం కలిగించేందుకు, నాగరాజు ఏకంగా సీఎం ఓఎస్డీ పేరుతో ఒక నకిలీ ఈ-మెయిల్ ఐడీని కూడా సృష్టించినట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అందిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, పక్కా సమాచారంతో శ్రీకాకుళంలో నాగరాజును అరెస్టు చేశారు. అనంతరం అతడిని హైదరాబాద్కు తరలించి, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు సైబర్ క్రైమ్ అధికారులు తెలియజేశారు.
బుడుమూరు నాగరాజుకు గతంలోనూ నేర చరిత్ర ఉంది. గతంలో అతడు కోడెల శివరాంపై కొన్ని తప్పుడు కేసులు పెట్టి, ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. అంతేకాకుండా, 2023లో శ్రీకాకుళం ప్రాంతంలో సుమారు 22 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన కేసులోనూ నాగరాజు నిందితుడిగా ఉన్నాడు.