Bangalore Metro Clicks: బెంగళూరు మెట్రోలో ప్రయాణించే మహిళల ఫొటోలు అప్లోడ్ చేసిన కేసు.. వ్యక్తి అరెస్టు

- బెంగళూరు మెట్రోలో మహిళల ఫోటోల వ్యవహారం
- అనుమతి లేకుండా చిత్రాలు తీసి ఇన్స్టాలో పోస్ట్
- బుధవారం ఎఫ్ఐఆర్, శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెంగళూరు నగర మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళల ఫోటోలను రహస్యంగా తీసి, వాటిని ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, 'బెంగళూరు మెట్రో క్లిక్స్' పేరుతో నడుస్తున్న ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మెట్రో రైళ్లు, ప్లాట్ఫారాలపై ఉన్న మహిళల ఫోటోలు, వీడియోలు అనేకం దర్శనమిచ్చాయి. ఈ ఖాతాను 5,000 మందికి పైగా అనుసరిస్తున్నారు. అయితే, ఈ ఫోటోలు తీస్తున్న విషయం ఆయా మహిళలకు తెలియదని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై 'ఎక్స్' వేదికగా ఒక వినియోగదారుడు బెంగళూరు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందించిన పోలీసులు బుధవారం ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం, శుక్రవారం నాడు సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత, ఆ ఖాతాలోని ఫోటోలన్నీ తొలగించబడ్డాయి. ఆ తర్వాత ఆ ఖాతాను ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా తొలగించారు.
ఈ ఘటనపై దక్షిణ విభాగం డీసీపీ లోకేశ్ బి జగలాసర్ స్పందిస్తూ, "బెంగళూరు మెట్రోలో ప్రయాణించే మహిళల చిత్రాలు, వీడియోలను వారికి తెలియకుండా, వారి అనుమతి లేకుండా అప్లోడ్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పేజీకి సంబంధించిన వారిపై బనశంకరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం" అని మీడియాకు తెలిపారు.
వివరాల్లోకి వెళితే, 'బెంగళూరు మెట్రో క్లిక్స్' పేరుతో నడుస్తున్న ఒక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మెట్రో రైళ్లు, ప్లాట్ఫారాలపై ఉన్న మహిళల ఫోటోలు, వీడియోలు అనేకం దర్శనమిచ్చాయి. ఈ ఖాతాను 5,000 మందికి పైగా అనుసరిస్తున్నారు. అయితే, ఈ ఫోటోలు తీస్తున్న విషయం ఆయా మహిళలకు తెలియదని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై 'ఎక్స్' వేదికగా ఒక వినియోగదారుడు బెంగళూరు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందించిన పోలీసులు బుధవారం ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం, శుక్రవారం నాడు సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత, ఆ ఖాతాలోని ఫోటోలన్నీ తొలగించబడ్డాయి. ఆ తర్వాత ఆ ఖాతాను ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా తొలగించారు.
ఈ ఘటనపై దక్షిణ విభాగం డీసీపీ లోకేశ్ బి జగలాసర్ స్పందిస్తూ, "బెంగళూరు మెట్రోలో ప్రయాణించే మహిళల చిత్రాలు, వీడియోలను వారికి తెలియకుండా, వారి అనుమతి లేకుండా అప్లోడ్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ పేజీకి సంబంధించిన వారిపై బనశంకరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం" అని మీడియాకు తెలిపారు.