Pakistan International Airlines: పాక్ విమానాలకు భారత గగనతలంలో మరో నెల నో ఎంట్రీ

- పాకిస్థాన్ విమానాలపై భారత గగనతలంలో నిషేధం పొడిగింపు
- జూన్ 23 వరకు కొనసాగనున్న ఆంక్షలు
- పాక్ సైనిక విమానాలకు కూడా వర్తించనున్న నిషేధం
భారత గగనతలంపై పాకిస్థాన్కు చెందిన విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది. భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా భారత్ ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఎయిర్ మెన్ కు ప్రత్యేక నోటీసు (నోటమ్) జారీ చేసింది.
తాజా ఆదేశాల ప్రకారం, జూన్ 23వ తేదీ వరకు పాకిస్థాన్లో రిజిస్టర్ అయిన విమానాలు, పాకిస్థానీ ఎయిర్లైన్స్ యాజమాన్యంలోనివి, లీజుకు తీసుకున్నవి లేదా ఆపరేట్ చేస్తున్న విమానాలు, అలాగే పాక్ సైనిక విమానాలు కూడా భారత గగనతలంలోకి ప్రవేశించరాదని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లే పాకిస్థాన్ విమానాలు ఇప్పుడు భారత్ను చుట్టి ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చులు కూడా అధికమవుతాయి.
జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్థాన్ సంబంధిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ భూభాగంలో 'ఆపరేషన్ సిందూర్' పేరిట దాడులు చేసి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏప్రిల్ నెలాఖరులో ఇరు దేశాలు పరస్పరం తమ గగనతలాలపై ఆంక్షలు విధిస్తూ తొలిసారిగా నోటీసులు జారీ చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఇరుదేశాలు మరోసారి పొడిగించాయి.
తాజా ఆదేశాల ప్రకారం, జూన్ 23వ తేదీ వరకు పాకిస్థాన్లో రిజిస్టర్ అయిన విమానాలు, పాకిస్థానీ ఎయిర్లైన్స్ యాజమాన్యంలోనివి, లీజుకు తీసుకున్నవి లేదా ఆపరేట్ చేస్తున్న విమానాలు, అలాగే పాక్ సైనిక విమానాలు కూడా భారత గగనతలంలోకి ప్రవేశించరాదని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లే పాకిస్థాన్ విమానాలు ఇప్పుడు భారత్ను చుట్టి ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, విమానయాన సంస్థలకు నిర్వహణ ఖర్చులు కూడా అధికమవుతాయి.
జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్థాన్ సంబంధిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ భూభాగంలో 'ఆపరేషన్ సిందూర్' పేరిట దాడులు చేసి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఏప్రిల్ నెలాఖరులో ఇరు దేశాలు పరస్పరం తమ గగనతలాలపై ఆంక్షలు విధిస్తూ తొలిసారిగా నోటీసులు జారీ చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఇరుదేశాలు మరోసారి పొడిగించాయి.