Justice AS Oka: తల్లి మరణించిన మరుసటి రోజే విధులకు.. 11 తీర్పులు వెలువరించిన జస్టిస్ ఓకా

- పదవీ విరమణ రోజు జస్టిస్ ఏఎస్ ఓకా కీలక వ్యాఖ్యలు
- న్యాయమూర్తి దృఢంగా ఉండాలని, ఎవరినీ నొప్పించడానికి వెనుకాడకూడదని ఉద్ఘాటన
- రాజ్యాంగ సూత్రాల పరిరక్షణే తన ప్రయత్నమని వెల్లడి
- తల్లి మరణించిన మరుసటి రోజే చివరి పనిదినానికి హాజరైన జస్టిస్ ఓకా
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఓకా తన చివరి పనిదినమైన శుక్రవారం ఏకంగా 11 తీర్పులు వెలువరించి వృత్తి పట్ల తన అంకితభావాన్ని చాటుకున్నారు. మాతృవియోగంలో ఉన్నప్పటికీ ఆయన విధులకు హాజరై ఈ తీర్పులు ఇవ్వడం గమనార్హం. జస్టిస్ ఓకా శనివారం (మే 24న) పదవీ విరమణ చేయనున్నారు.
థానేలో తన తల్లి మరణించిన మరుసటి రోజే జస్టిస్ ఓకా విధులకు హాజరయ్యారు. ఆయన ముంబై వెళ్లి తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం వెంటనే ఢిల్లీకి తిరిగి వచ్చి, శుక్రవారం సుప్రీంకోర్టుకు హాజరై 11 కేసులలో తీర్పులు వెలువరించారు. ఆ తర్వాత, ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్తో కలిసి లాంఛనప్రాయ ధర్మాసనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ధర్మాసనం వద్ద ఆయన మాట్లాడుతూ, "రాజ్యాంగ సూత్రాలను నిలబెట్టే ప్రయత్నంలో నేను కొంతమంది న్యాయవాదులను బాధపెట్టి ఉండవచ్చు. కానీ ఒక న్యాయమూర్తి చాలా దృఢంగా, కఠినంగా ఉండాలి. న్యాయం కోసం ఎవరినైనా నొప్పించాల్సి వచ్చినా వెనుకాడకూడదు" అని అన్నారు.
1960 మే 25న జన్మించిన జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి వి.పి. టిప్నిస్ ఛాంబర్స్లో చేరి 1985లో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ బాంబే నుంచి పట్టభద్రుడైన ఆయన, 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2005లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. బాంబే హైకోర్టులో సుదీర్ఘకాలం సేవలందించిన అనంతరం, 2019లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి 2021లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నతస్థాయికి చేరుకున్నారు.
థానేలో తన తల్లి మరణించిన మరుసటి రోజే జస్టిస్ ఓకా విధులకు హాజరయ్యారు. ఆయన ముంబై వెళ్లి తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం వెంటనే ఢిల్లీకి తిరిగి వచ్చి, శుక్రవారం సుప్రీంకోర్టుకు హాజరై 11 కేసులలో తీర్పులు వెలువరించారు. ఆ తర్వాత, ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్తో కలిసి లాంఛనప్రాయ ధర్మాసనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ధర్మాసనం వద్ద ఆయన మాట్లాడుతూ, "రాజ్యాంగ సూత్రాలను నిలబెట్టే ప్రయత్నంలో నేను కొంతమంది న్యాయవాదులను బాధపెట్టి ఉండవచ్చు. కానీ ఒక న్యాయమూర్తి చాలా దృఢంగా, కఠినంగా ఉండాలి. న్యాయం కోసం ఎవరినైనా నొప్పించాల్సి వచ్చినా వెనుకాడకూడదు" అని అన్నారు.
1960 మే 25న జన్మించిన జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి వి.పి. టిప్నిస్ ఛాంబర్స్లో చేరి 1985లో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. యూనివర్సిటీ ఆఫ్ బాంబే నుంచి పట్టభద్రుడైన ఆయన, 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2005లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. బాంబే హైకోర్టులో సుదీర్ఘకాలం సేవలందించిన అనంతరం, 2019లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి 2021లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నతస్థాయికి చేరుకున్నారు.