Narendra Modi: ఇది బాహుబలి రైలు ఇంజిన్!

Narendra Modi to Dedicate Bahubali Train Engine to Nation
  • ఈ నెల చివరి వారంలో గుజరాత్‌లో పర్యటించనన్న ప్రధాని మోదీ
  • దాహోద్‌లో దేశంలో మొట్టమొదటి 9000 హెచ్ పీ లోకో మోటివ్ ఇంజన్ (బాహుబలి) ని జాతికి అంకితం చేయనున్న మోదీ
  • మేకిన్ ఇండియాలో భాగంగా దాహోద్‌లో రూ.20వేల కోట్ల వ్యయంతో పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేసిన రైల్వే ఉత్పత్తి యూనిట్ 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల చివరి వారంలో గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాహోద్‌లో దేశంలోనే మొట్టమొదటి 9000 హెచ్‌పీ లోకోమోటివ్ ఇంజిన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా దాహోద్‌లో రూ.20 వేల కోట్ల వ్యయంతో రైల్వే ఉత్పత్తి యూనిట్‌ను పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేశారు.

ఈ రైలు కర్మాగారంలో రాబోయే పదేళ్లలో దాదాపు 1,200 ఇంజిన్లను తయారు చేయనున్నారు. వీటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ప్రస్తుతం ఈ రైలు కర్మాగారంలో నాలుగు ఇంజిన్లు తయారవుతున్నాయి.

ఈ బాహుబలి లోకోమోటివ్ ఇంజిన్ ఏకంగా 4,600 టన్నుల గూడ్స్‌ను తీసుకువెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌లో మొదటిసారిగా లోకో పైలెట్ల కోసం ఏసీ, టాయిలెట్ సౌకర్యం కల్పించారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక వ్యవస్థ కూడా ఈ ఇంజిన్‌లో ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, మహారాష్ట్రలోని పూణేలలో ఉన్న డిపోలలో ఇంజిన్ నిర్వహణ జరుగుతుంది. 
Narendra Modi
Gujarat
9000 HP Locomotive Engine
Make in India
Dahod Railway Factory
Railway Production Unit
Locomotive Export
Freight Train
Indian Railways

More Telugu News