IPL 2025: రికార్డు సృష్టించిన ఐపీఎల్‌-2025

IPL 2025 Sets Record for Most 200 Plus Team Scores
  • ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు 200+ టీమ్ స్కోర్లు న‌మోదైన సీజ‌న్‌గా 2025
  • ఈ 18వ ఎడిష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆయా జ‌ట్ల స్కోరు 42 సార్లు 200 దాటిన వైనం
  • 2024లో 41, 2023లో 37, 2022లో 18, 2018లో 15 సార్లు 200+ స్కోర్లు న‌మోదు
ల‌క్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో శుక్ర‌వారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ), స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 231 ప‌రుగుల భారీ స్కోర్ న‌మోదు చేసింది. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సార్లు 200+ టీమ్ స్కోర్లు న‌మోదైన సీజ‌న్‌గా 2025 నిలిచింది. 

ఈ 18వ ఎడిష‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆయా జ‌ట్ల స్కోరు 42 సార్లు 200 దాటింది. అంత‌కుముందు 2024లో 41, 2023లో 37, 2022లో 18, 2018లో 15 సార్లు 200+ స్కోర్లు న‌మోద‌య్యాయి. ఇక‌, ఈ సీజ‌న్‌లో మ‌రికొన్ని మ్యాచ్‌లు జ‌ర‌గాల్సి ఉన్నందున ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కాగా, ఈ ఎడిష‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) అత్య‌ధికంగా 200 ప్ల‌స్ స్కోర్లు న‌మోదు చేసిన టీమ్‌గా అగ్ర‌స్థానంలో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆ జీటీ 7 సార్లు 200+ స్కోర్లు చేయ‌డం విశేషం. 

ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)-6, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ), రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) చెరో ఐదుసార్లు, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌), ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) త‌లో 4సార్లు,  రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)-3 సార్లు 200+ స్కోర్లు చేశాయి. 

కాగా, నిన్న‌టి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ 42 ప‌రుగుల తేడాతో బెంగ‌ళూరును ఓడించింది. 232 ప‌రుగుల భారీ ల‌క్ష్య ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన ఆర్‌సీబీ 189 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఇక ఇప్ప‌టికే ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధించిన ఆర్‌సీబీ ఈ ఓట‌మితో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానానికి ప‌డిపోయింది. గుజ‌రాత్ 18 పాయింట్లతో ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.  
IPL 2025
Indian Premier League
SRH
RCB
Sunrisers Hyderabad
Royal Challengers Bangalore
GT
Gujarat Titans
Cricket
T20

More Telugu News