Nara Lokesh: లోకేశ్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు

- టీడీపీలో లోకేశ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న డిమాండ్
- కార్యకర్తలు కోరుకుంటున్నారన్న ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు
- మహానాడులో చంద్రబాబు దృష్టికి ఈ అంశం
- పార్టీని మరో 40 ఏళ్లు నడిపించేందుకే ఈ ప్రతిపాదన
- లోకేశ్ కు పదవిపై మహానాడులో కార్యకర్తలదే నిర్ణయమన్న ఆనం
తెలుగుదేశం పార్టీలో యువనేత నారా లోకేశ్ కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరందుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేశ్ ను నియమించాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది. త్వరలో జరగనున్న మహానాడు వేదికగా ఈ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు పలువురు నేతలు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ విషయంపై మాట్లాడుతూ, కోట్లాదిమంది క్రియాశీల సభ్యులు, కార్యకర్తలు నారా లోకేశ్ ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. "కార్యకర్తల హృదయాల్లోంచి వస్తున్న ఈ ఆకాంక్షను మహానాడులో మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి కచ్చితంగా తీసుకెళతాం. పార్టీని మరో 40 సంవత్సరాల పాటు యువశక్తితో నింపి, 'విజన్ 2047' లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లోకేశ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై, నూటికి నూరు శాతం సీట్లు సాధించే దిశగా ఎన్డీయే కూటమి ముందుకు సాగుతుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువశక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
మరోవైపు, టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఇదే అంశంపై స్పందించారు. లోకేశ్ కు ఏ పదవి ఇవ్వాలనేది పూర్తిగా కార్యకర్తల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. "మా పార్టీలో పైనుంచి రుద్దే సంస్కృతి లేదు. కార్యకర్తలు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. లోకేశ్ ని కీలక పదవిలో చూడాలని కార్యకర్తలు భావిస్తే, అదే జరుగుతుంది. దీనికోసం వేచి చూడాలి, తొందరపడాల్సిన అవసరం లేదు" అని ఆనం వివరించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే తొలి మహానాడు చాలా ప్రత్యేకంగా, ఒక చరిత్ర సృష్టించేలా ఉంటుందని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. "తెలుగుదేశం పార్టీ మహానాడు ఎలా నిర్వహిస్తుందో ఇతర రాజకీయ పార్టీలు చూసి నేర్చుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీ లాంటిది. ఒక క్రమశిక్షణ, ఒక ఆర్గనైజేషన్, ఒక విజన్ ఎలా ఉండాలో చంద్రబాబు చేసి చూపిస్తారు. ఈసారి మహానాడులో కార్యకర్తల ఉత్సాహం రెట్టింపు స్థాయిలో ఉంటుంది" అని ఆయన అన్నారు. వైసీపీ గురించి మాట్లాడుతూ, "అది చచ్చిన పాము, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం అనవసరం. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి" అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఈ విషయంపై మాట్లాడుతూ, కోట్లాదిమంది క్రియాశీల సభ్యులు, కార్యకర్తలు నారా లోకేశ్ ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. "కార్యకర్తల హృదయాల్లోంచి వస్తున్న ఈ ఆకాంక్షను మహానాడులో మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి కచ్చితంగా తీసుకెళతాం. పార్టీని మరో 40 సంవత్సరాల పాటు యువశక్తితో నింపి, 'విజన్ 2047' లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. లోకేశ్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమై, నూటికి నూరు శాతం సీట్లు సాధించే దిశగా ఎన్డీయే కూటమి ముందుకు సాగుతుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యువశక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.
మరోవైపు, టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఇదే అంశంపై స్పందించారు. లోకేశ్ కు ఏ పదవి ఇవ్వాలనేది పూర్తిగా కార్యకర్తల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. "మా పార్టీలో పైనుంచి రుద్దే సంస్కృతి లేదు. కార్యకర్తలు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. లోకేశ్ ని కీలక పదవిలో చూడాలని కార్యకర్తలు భావిస్తే, అదే జరుగుతుంది. దీనికోసం వేచి చూడాలి, తొందరపడాల్సిన అవసరం లేదు" అని ఆనం వివరించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే తొలి మహానాడు చాలా ప్రత్యేకంగా, ఒక చరిత్ర సృష్టించేలా ఉంటుందని ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. "తెలుగుదేశం పార్టీ మహానాడు ఎలా నిర్వహిస్తుందో ఇతర రాజకీయ పార్టీలు చూసి నేర్చుకోవాలి. ఇది ఒక కేస్ స్టడీ లాంటిది. ఒక క్రమశిక్షణ, ఒక ఆర్గనైజేషన్, ఒక విజన్ ఎలా ఉండాలో చంద్రబాబు చేసి చూపిస్తారు. ఈసారి మహానాడులో కార్యకర్తల ఉత్సాహం రెట్టింపు స్థాయిలో ఉంటుంది" అని ఆయన అన్నారు. వైసీపీ గురించి మాట్లాడుతూ, "అది చచ్చిన పాము, దాని గురించి ఇప్పుడు మాట్లాడటం అనవసరం. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి" అని వ్యాఖ్యానించారు.