Nara Rohit: 'పుష్ప'లో షెకావత్ రోల్ కోసం మొదట అనుకున్నది ఎవరినో తెలుసా...?

- పుష్ప’ ఛాన్స్ మిస్: ఆసక్తికర విషయం చెప్పిన నారా రోహిత్
- ఈ విషయాన్ని ‘భైరవం’ సినిమా ప్రచారంలో వెల్లడించిన వైనం
- కొవిడ్ సమయంలో మీసాలతో తన లుక్ను కూడా సిద్ధం చేశారన్న హీరో
- పాన్ ఇండియా సినిమా కావడంతో ఇతర భాషా నటులకు అవకాశం
- అందుకే ఆ పాత్ర ఫహద్ ఫాజిల్కు దక్కిందని తెలిపిన రోహిత్
అల్లు అర్జున్ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం పుష్ప. ఇందులో ప్రతినాయకుడు భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పోషించాడు. ఈ పాత్ర అతడికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అయితే, ఈ పాత్ర కోసం మొదట చిత్ర బృందం ఎవరిని సంప్రదించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం దర్శకుడు సుకుమార్ తొలుత అనుకున్నది నారా రోహిత్ ని అట. ఈ విషయాన్ని నారా రోహిత్ స్వయంగా వెల్లడించాడు.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన బ్లాక్బస్టర్ చిత్రం 'పుష్ప'లో కీలకమైన ఎస్పీ భన్వర్సింగ్ షెకావత్ పాత్ర కోసం చిత్రబృందం తొలుత తననే సంప్రదించిందని తెలిపాడు. ప్రస్తుతం నారా రోహిత్ నటిస్తున్న 'భైరవం' సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడాడు.
ఈ విషయంపై నారా రోహిత్ మాట్లాడుతూ, "కొవిడ్ సమయంలో నాది మీసాలతో ఉన్న ఒక ఫొటోను సిద్ధం చేసి నాకు పంపించారు. నిర్మాత కూడా ఆ పాత్ర గురించి నాతో మాట్లాడారు. ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ గారు కూడా నాతో చర్చించారు. అయితే, 'పుష్ప' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతో, అన్ని భాషల నటీనటులు సినిమాలో ఉండాలని భావించారు. అందుకే ఆ పాత్రకు ఫహద్ ఫాజిల్ను తీసుకున్నారు" అని వివరించారు. ఈ వార్తతో నారా రోహిత్ అభిమానులు ఒక మంచి పాత్రను ఆయన కోల్పోయారని సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం 'భైరవం' చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్లతో పాటు నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన బ్లాక్బస్టర్ చిత్రం 'పుష్ప'లో కీలకమైన ఎస్పీ భన్వర్సింగ్ షెకావత్ పాత్ర కోసం చిత్రబృందం తొలుత తననే సంప్రదించిందని తెలిపాడు. ప్రస్తుతం నారా రోహిత్ నటిస్తున్న 'భైరవం' సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడాడు.
ఈ విషయంపై నారా రోహిత్ మాట్లాడుతూ, "కొవిడ్ సమయంలో నాది మీసాలతో ఉన్న ఒక ఫొటోను సిద్ధం చేసి నాకు పంపించారు. నిర్మాత కూడా ఆ పాత్ర గురించి నాతో మాట్లాడారు. ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ గారు కూడా నాతో చర్చించారు. అయితే, 'పుష్ప' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఉద్దేశంతో, అన్ని భాషల నటీనటులు సినిమాలో ఉండాలని భావించారు. అందుకే ఆ పాత్రకు ఫహద్ ఫాజిల్ను తీసుకున్నారు" అని వివరించారు. ఈ వార్తతో నారా రోహిత్ అభిమానులు ఒక మంచి పాత్రను ఆయన కోల్పోయారని సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం 'భైరవం' చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్లతో పాటు నారా రోహిత్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.