Buttu Devanand: హైకోర్టుల్లో న్యాయమూర్తుల బదిలీలు.. ఏపీకి జస్టిస్ దేవానంద్, తెలంగాణకు ముగ్గురు జడ్జీలు

- మద్రాస్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు జస్టిస్ బట్టు దేవానంద్ బదిలీ
- తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ సుజయ్ పాల్ కలకత్తా హైకోర్టుకు బదిలీ
- జస్టిస్ అభిషేక్రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత తిరిగి తెలంగాణ హైకోర్టుకు
- ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో పలు మార్పులకు కొలీజియం ప్రతిపాదనలు
న్యాయవ్యవస్థలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్ బట్టు దేవానంద్ను తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఇదే సమయంలో, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్తో పాటు, గతంలో ఇతర రాష్ట్రాలకు బదిలీ అయిన ముగ్గురు న్యాయమూర్తులను తిరిగి తెలంగాణ హైకోర్టుకు తీసుకురావాలని ప్రతిపాదించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలో తొలిసారిగా సమావేశమైన కొలీజియం మొత్తం 10 రాష్ట్రాల హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తుల బదిలీలకు ఆమోదం తెలిపింది.
జస్టిస్ బట్టు దేవానంద్ 2020 జనవరి 13న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2023 ఏప్రిల్ 10న అక్కడ విధుల్లో చేరారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో ఆయన మళ్లీ ఏపీ హైకోర్టుకు రానున్నారు. 1966 ఏప్రిల్ 14న గుడివాడలో జన్మించిన జస్టిస్ దేవానంద్.. ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1989 జులై 6న న్యాయవాదిగా నమోదు చేసుకుని విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.
ఇక తెలంగాణ హైకోర్టు విషయానికొస్తే, ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సుజయ్ పాల్ను కోల్కతా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ సుజయ్ పాల్ 2024 మార్చి 26న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. అంతకుముందు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ అలోక్ ఆరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత 2025 జనవరి 21 నుంచి జస్టిస్ సుజయ్ పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణకు తిరిగి వస్తున్న న్యాయమూర్తులు
గతంలో కర్ణాటక, పాట్నా హైకోర్టులకు బదిలీ అయిన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ చిల్లకూరు సుమలత మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ కానున్నారు.
జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్రెడ్డి: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో 1967 నవంబర్ 7న జన్మించారు. ఉస్మానియా లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది, 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ కేసుల్లో నిపుణులైన ఆయన పలు ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి, 2023 మే 15న పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి తెలంగాణకు వస్తున్నారు.
జస్టిస్ కన్నెగంటి లలిత: బాపట్ల జిల్లా జమ్ములపాలెంలో జన్మించారు. 1994లో న్యాయవాదిగా నమోదై, సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, పన్నులు, సర్వీసు వంటి పలు రంగాల్లో ప్రాక్టీస్ చేశారు. టీటీడీ, దేవాదాయ శాఖ, పలు విశ్వవిద్యాలయాలకు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 2020 మే 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, 2021 నవంబర్ 15న తెలంగాణ హైకోర్టుకు, ఆ తర్వాత 2023 జులై 28న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ హైకోర్టుకు వస్తున్నారు.
జస్టిస్ చిల్లకూరు సుమలత: నెల్లూరులో 1972 ఫిబ్రవరి 5న జన్మించారు. 1995లో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికై కర్నూలు, మదనపల్లె, అనంతపురం, గుంటూరులలో సేవలందించారు. జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా కూడా పనిచేశారు. 2021 అక్టోబర్ 14న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి 2023 నవంబర్ 23న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాజాగా కొలీజియం సిఫార్సుతో తిరిగి తెలంగాణ హైకోర్టుకు రానున్నారు.
జస్టిస్ బట్టు దేవానంద్ 2020 జనవరి 13న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2023 ఏప్రిల్ 10న అక్కడ విధుల్లో చేరారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో ఆయన మళ్లీ ఏపీ హైకోర్టుకు రానున్నారు. 1966 ఏప్రిల్ 14న గుడివాడలో జన్మించిన జస్టిస్ దేవానంద్.. ఆంధ్రా యూనివర్సిటీ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1989 జులై 6న న్యాయవాదిగా నమోదు చేసుకుని విశాఖపట్నం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.
ఇక తెలంగాణ హైకోర్టు విషయానికొస్తే, ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సుజయ్ పాల్ను కోల్కతా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ సుజయ్ పాల్ 2024 మార్చి 26న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. అంతకుముందు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ అలోక్ ఆరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత 2025 జనవరి 21 నుంచి జస్టిస్ సుజయ్ పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణకు తిరిగి వస్తున్న న్యాయమూర్తులు
గతంలో కర్ణాటక, పాట్నా హైకోర్టులకు బదిలీ అయిన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ చిల్లకూరు సుమలత మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ కానున్నారు.
జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్రెడ్డి: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో 1967 నవంబర్ 7న జన్మించారు. ఉస్మానియా లా కాలేజీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది, 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ కేసుల్లో నిపుణులైన ఆయన పలు ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2019 ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి, 2023 మే 15న పాట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి తెలంగాణకు వస్తున్నారు.
జస్టిస్ కన్నెగంటి లలిత: బాపట్ల జిల్లా జమ్ములపాలెంలో జన్మించారు. 1994లో న్యాయవాదిగా నమోదై, సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, పన్నులు, సర్వీసు వంటి పలు రంగాల్లో ప్రాక్టీస్ చేశారు. టీటీడీ, దేవాదాయ శాఖ, పలు విశ్వవిద్యాలయాలకు స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరించారు. 2020 మే 2న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, 2021 నవంబర్ 15న తెలంగాణ హైకోర్టుకు, ఆ తర్వాత 2023 జులై 28న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ హైకోర్టుకు వస్తున్నారు.
జస్టిస్ చిల్లకూరు సుమలత: నెల్లూరులో 1972 ఫిబ్రవరి 5న జన్మించారు. 1995లో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికై కర్నూలు, మదనపల్లె, అనంతపురం, గుంటూరులలో సేవలందించారు. జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా కూడా పనిచేశారు. 2021 అక్టోబర్ 14న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి 2023 నవంబర్ 23న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాజాగా కొలీజియం సిఫార్సుతో తిరిగి తెలంగాణ హైకోర్టుకు రానున్నారు.