Dhulipalla: లోకేశ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి: ఎమ్మెల్యే ధూళిపాళ్ల

- టీడీపీలో యువనేత నారా లోకేశ్కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ
- పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేశ్ను నియమించాలని పార్టీ శ్రేణుల డిమాండ్
- తాజాగా మహానాడు వేదికగా ఈ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన ధూళిపాళ్ల
గత కొంతకాలంగా టీడీపీలో యువనేత నారా లోకేశ్కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేశ్ను నియమించాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది.
ఈ క్రమంలో ప్రస్తుతం కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా ఈ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల తీసుకెళ్లారు. లోకేశ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయమై గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేసినట్లు చంద్రబాబుతో ఎమ్మెల్యే తెలియజేశారు.
ఇక, ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరో టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఇదే అంశాన్ని మహానాడులో మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి కచ్చితంగా తీసుకెళతామని ఇప్పటికే ప్రకటించారు. ఈ సందర్భంగా యువశక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని జీవీ ఆంజనేయులు తెలిపారు.
ఈ క్రమంలో ప్రస్తుతం కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా ఈ అంశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే ధూళిపాళ్ల తీసుకెళ్లారు. లోకేశ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయమై గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేసినట్లు చంద్రబాబుతో ఎమ్మెల్యే తెలియజేశారు.
ఇక, ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరో టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఇదే అంశాన్ని మహానాడులో మా అధినేత చంద్రబాబు గారి దృష్టికి కచ్చితంగా తీసుకెళతామని ఇప్పటికే ప్రకటించారు. ఈ సందర్భంగా యువశక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని జీవీ ఆంజనేయులు తెలిపారు.