Renuka Chowdhury: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రేణుక ఫైర్

- ఉగ్రవాదంపై పోరాటం అందరి విజయమన్న రేణుకా చౌదరి
- ఉగ్రవాద సూత్రధారి స్థావరం కూల్చేస్తానన్న ప్రధాని హామీపై ప్రశ్నలు
- సాయుధ బలగాలు, సరిహద్దు ప్రజల వల్లే గట్టి సమాధానమన్న కాంగ్రెస్ ఎంపీ
- రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత క్రెడిట్ తీసుకోవద్దని ప్రధానికి సూచన
ఉగ్రవాదంపై పోరాటం అనేది ఏ ఒక్క వ్యక్తి సాధించిన విజయం కాదని, అది ప్రతి భారతీయుడి సమష్టి కృషి ఫలితమని కాంగ్రెస్ నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలు రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఉగ్రవాద సూత్రధారి స్థావరాన్ని తానే కూల్చివేస్తానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి విషయాల్లో వ్యక్తిగత ఘనతను ఆపాదించుకోవద్దని హితవు పలికారు.
"ఇది ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు. ఇది ప్రతి భారతీయుడి సమష్టి విజయం. దయచేసి రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత క్రెడిట్ తీసుకోవద్దు" అని రేణుకా చౌదరి అన్నారు. ఉగ్రవాద నిర్మూలన అందరి బాధ్యత అని నొక్కి చెప్పారు.
ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ "ఈ హామీ మీ ఒక్కరిదే ఎలా అవుతుంది? పహల్గామ్ దాడి గురించి మీకు ముందే తెలుసా? మన సాయుధ బలగాలు తగిన రీతిలో సమాధానం ఇచ్చాయి. ఆ ఘనత వారికే దక్కాలి. నిరంతర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులకు సెల్యూట్ చేయాలి" అని రేణుకా చౌదరి పేర్కొన్నారు.
బుధవారం కాన్పూర్లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉగ్రవాద విషయంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల మధ్య భారత్ ఎలాంటి తేడా చూపదని హెచ్చరించారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, ఏ సంస్థకు చెందినవారైనా వారిని బాధ్యులను చేసి శిక్షిస్తామని స్పష్టం చేశారు. "కాన్పురియా భాషలో సూటిగా చెప్పాలంటే శత్రువు ఎక్కడున్నా వేటాడి పట్టుకుంటాం (దుష్మన్ కహీ భీ హో హోంక్ దియా జాయేగా)" అని మోదీ హెచ్చరించారు.
"ఇది ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు. ఇది ప్రతి భారతీయుడి సమష్టి విజయం. దయచేసి రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత క్రెడిట్ తీసుకోవద్దు" అని రేణుకా చౌదరి అన్నారు. ఉగ్రవాద నిర్మూలన అందరి బాధ్యత అని నొక్కి చెప్పారు.
ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ "ఈ హామీ మీ ఒక్కరిదే ఎలా అవుతుంది? పహల్గామ్ దాడి గురించి మీకు ముందే తెలుసా? మన సాయుధ బలగాలు తగిన రీతిలో సమాధానం ఇచ్చాయి. ఆ ఘనత వారికే దక్కాలి. నిరంతర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులకు సెల్యూట్ చేయాలి" అని రేణుకా చౌదరి పేర్కొన్నారు.
బుధవారం కాన్పూర్లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉగ్రవాద విషయంలో ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల మధ్య భారత్ ఎలాంటి తేడా చూపదని హెచ్చరించారు. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, ఏ సంస్థకు చెందినవారైనా వారిని బాధ్యులను చేసి శిక్షిస్తామని స్పష్టం చేశారు. "కాన్పురియా భాషలో సూటిగా చెప్పాలంటే శత్రువు ఎక్కడున్నా వేటాడి పట్టుకుంటాం (దుష్మన్ కహీ భీ హో హోంక్ దియా జాయేగా)" అని మోదీ హెచ్చరించారు.