Etela Rajender: తెలంగాణ జీడీపీతో పోలిస్తే తక్కువ ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది: ఈటల రాజేందర్

- తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ అణచివేసిందని ఈటల ఆరోపణ
- తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని వ్యాఖ్య
- కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలన నిరంకుశంగా సాగిందన్న ఈటల
- అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
- రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా
ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ జీడీపీ, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, ఏపీ అన్ని రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ మాత్రం వెలవెలబోతోందని బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'పెద్దన్న' అంటూ ప్రశంసించి, రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత విమర్శలు చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
సోమవారం హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసిందని, చివరికి తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందని బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావం కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేశాయని ఈటల గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బీజేపీ అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందించిందని తెలిపారు. అయితే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాటు నిరంకుశ పాలన సాగించారని విమర్శించారు.
అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని, బీఆర్ఎస్ పార్టీపై నెపం మోపి కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తోందని ఈటల ఆరోపించారు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కల్లలు చేశాయని ఈటల విమర్శించారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను గట్టెక్కించడం తమతోనే సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో తాను ఎందుకు కలుస్తానని ప్రశ్నించిన ఈటల, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒక్క అవినీతి, అక్రమాలపైనైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందా? అని ప్రశ్నించారు.
సోమవారం హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అణచివేసిందని, చివరికి తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిందని బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావం కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన నివాళులర్పించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేశాయని ఈటల గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బీజేపీ అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందించిందని తెలిపారు. అయితే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాటు నిరంకుశ పాలన సాగించారని విమర్శించారు.
అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని, బీఆర్ఎస్ పార్టీపై నెపం మోపి కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తోందని ఈటల ఆరోపించారు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కల్లలు చేశాయని ఈటల విమర్శించారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను గట్టెక్కించడం తమతోనే సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో తాను ఎందుకు కలుస్తానని ప్రశ్నించిన ఈటల, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఒక్క అవినీతి, అక్రమాలపైనైనా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందా? అని ప్రశ్నించారు.