Rajeev Shukla: రాజకీయం చేయొద్దు.. తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యలు

- బెంగళూరులో ఆర్సీబీ ఐపీఎల్ గెలుపు సంబరాల్లో అపశ్రుతి
- చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట
- ఘటనలో 11 మంది మృతి
- కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ తదితర విపక్షాల ఫైర్
- దీన్ని రాజకీయం చేయొద్దని, బాధితులకు సాయం చేస్తామని రాజీవ్ శుక్లా ప్రకటన
ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతిచెందారు. ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ తదితర పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా స్పందించారు. దీన్ని రాజకీయం చేయొద్దని సూచించారు."ఇలాంటి ఘటనలు ఏ రాష్ట్రంలోనైనా జరగవచ్చు, దీనికి అధికార పార్టీని నిందించకూడదు. ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదు. ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇలా జరిగినా వారిని తప్పుపట్టకూడదు. జనం చాలా ఎక్కువగా వచ్చారు. నేను ఫ్రాంచైజీతో మాట్లాడాను, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని వారు కూడా ఊహించలేదు. ఈ ఘటన హఠాత్తుగా జరిగింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి," అని ఆయన విలేకరులతో అన్నారు. తొక్కిసలాట లేదా అలాంటి పరిస్థితులను నివారించేందుకే ప్రభుత్వం రోడ్షోను నిలిపివేసిందని, అయితే స్టేడియం వెలుపల తొక్కిసలాట జరుగుతుందని ఊహించలేదని ఆయన తెలిపారు. నష్ట నివారణ చర్యల్లో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా జనతాదళ్ (సెక్యులర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రణాళికా లోపం, ప్రజల భద్రత విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్ష నేతలు ఆరోపించారు.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతూ, "సరైన ప్రణాళిక లేకపోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే ఈ ఘోర విషాదానికి ప్రధాన కారణం" అని విమర్శించారు. ఈ విపత్తుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. "బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ సంబరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రజలు దురదృష్టవశాత్తు మరణించడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంబరాలు ప్రారంభం కాకముందే అమాయకుల ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని తాము ఊహించలేకపోయామని, మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ దురదృష్టకర సంఘటనపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ తదితర పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా స్పందించారు. దీన్ని రాజకీయం చేయొద్దని సూచించారు."ఇలాంటి ఘటనలు ఏ రాష్ట్రంలోనైనా జరగవచ్చు, దీనికి అధికార పార్టీని నిందించకూడదు. ఈ విషయాన్ని రాజకీయం చేయకూడదు. ఒకవేళ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇలా జరిగినా వారిని తప్పుపట్టకూడదు. జనం చాలా ఎక్కువగా వచ్చారు. నేను ఫ్రాంచైజీతో మాట్లాడాను, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని వారు కూడా ఊహించలేదు. ఈ ఘటన హఠాత్తుగా జరిగింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి," అని ఆయన విలేకరులతో అన్నారు. తొక్కిసలాట లేదా అలాంటి పరిస్థితులను నివారించేందుకే ప్రభుత్వం రోడ్షోను నిలిపివేసిందని, అయితే స్టేడియం వెలుపల తొక్కిసలాట జరుగుతుందని ఊహించలేదని ఆయన తెలిపారు. నష్ట నివారణ చర్యల్లో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా జనతాదళ్ (సెక్యులర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రణాళికా లోపం, ప్రజల భద్రత విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్ష నేతలు ఆరోపించారు.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతూ, "సరైన ప్రణాళిక లేకపోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమే ఈ ఘోర విషాదానికి ప్రధాన కారణం" అని విమర్శించారు. ఈ విపత్తుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. "బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవ సంబరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రజలు దురదృష్టవశాత్తు మరణించడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంబరాలు ప్రారంభం కాకముందే అమాయకుల ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని తాము ఊహించలేకపోయామని, మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ దురదృష్టకర సంఘటనపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.