Mahua Moitra: జర్మనీలో మాజీ ఎంపీని పెళ్లాడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా!

- టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, బీజేడీ నేత పినాకి మిశ్రాల వివాహం
- జర్మనీలోని బెర్లిన్లో రహస్యంగా పెళ్లి వేడుక
- రెండు వారాల క్రితమే వివాహం జరిగినట్లు టీఎంసీ వర్గాల సమాచారం
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా, బిజూ జనతా దళ్ (బీజేడీ) సీనియర్ నేత, మాజీ ఎంపీ పినాకి మిశ్రాలను వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లి జర్మనీలో చాలా ప్రైవేట్గా జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై మహువా మొయిత్రా గానీ, పినాకి మిశ్రా గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మహువా మొయిత్రా, పినాకి మిశ్రాల వివాహం సుమారు 14 రోజుల క్రితం జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిందని తెలుస్తోంది. ఈ వార్తలపై స్పష్టత కోసం ఓ వార్తా సంస్థ ప్రతినిధి మహువా మొయిత్రాను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది.
మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఆమె 1974లో అసోంలో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేశారు. 2010లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరి, రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచిన ఆమె, 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
ఇక పినాకి మిశ్రా విషయానికొస్తే, ఆయన ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుంచి పలుమార్లు పార్లమెంట్కు ఎన్నికైన అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. 1959లో జన్మించిన ఆయన, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఢిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పినాకి మిశ్రా, 1996లో పూరీ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత బీజేడీలో చేరి, అనేక పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇరువురు ప్రముఖ ఎంపీలు, వేర్వేరు పార్టీలకు చెందినవారు కావడం, అలాగే వారి మధ్య వయసులో 15 ఏళ్ల వ్యత్యాసం ఉండటంతో ఈ వివాహంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పినాకి మిశ్రా వయసు 65 ఏళ్లు కాగా, మహువా మొయిత్రా వయసు 50 ఏళ్లు.
మహువా మొయిత్రా, పినాకి మిశ్రాల వివాహం సుమారు 14 రోజుల క్రితం జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిందని తెలుస్తోంది. ఈ వార్తలపై స్పష్టత కోసం ఓ వార్తా సంస్థ ప్రతినిధి మహువా మొయిత్రాను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదని పేర్కొంది.
మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఆమె 1974లో అసోంలో జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేశారు. 2010లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరి, రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచిన ఆమె, 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
ఇక పినాకి మిశ్రా విషయానికొస్తే, ఆయన ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుంచి పలుమార్లు పార్లమెంట్కు ఎన్నికైన అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త. 1959లో జన్మించిన ఆయన, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఢిల్లీలోని ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి చరిత్రలో డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పినాకి మిశ్రా, 1996లో పూరీ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత బీజేడీలో చేరి, అనేక పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఇరువురు ప్రముఖ ఎంపీలు, వేర్వేరు పార్టీలకు చెందినవారు కావడం, అలాగే వారి మధ్య వయసులో 15 ఏళ్ల వ్యత్యాసం ఉండటంతో ఈ వివాహంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పినాకి మిశ్రా వయసు 65 ఏళ్లు కాగా, మహువా మొయిత్రా వయసు 50 ఏళ్లు.
