Mukesh Ambani: రూ.151 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ... ఎవరికంటే!

- ముంబయి ఐసీటీకి ముఖేశ్ అంబానీ రూ.151 కోట్లు అందజేత
- ప్రొఫెసర్ ఎంఎం శర్మ పుస్తకావిష్కరణలో ప్రకటన
- గురువుకు ఇచ్చే గురుదక్షిణగా ఈ విరాళం అన్న అంబానీ
- 1970లో ఐసీటీ (అప్పటి యూడీసీటీ) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అంబానీ
- ప్రొఫెసర్ శర్మను 'గురు ఆఫ్ భారత్' అని కొనియాడిన వైనం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తాను విద్యనభ్యసించిన ముంబయిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ)కి ఏకంగా రూ.151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని సంస్థ అభివృద్ధికి ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు.
విఖ్యాత రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ముఖేశ్ అంబానీ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విరాళం తన గురువు ప్రొఫెసర్ శర్మకు ఇచ్చే గురుదక్షిణ అని పేర్కొన్నారు.
ముఖేశ్ అంబానీ 1970వ సంవత్సరంలో ఐసీటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు. ఆ రోజుల్లో ఈ సంస్థను యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (యూడీసీటీ)గా పిలిచేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. సుమారు మూడు గంటలకు పైగా ఐసీటీ ప్రాంగణంలో గడిపిన అంబానీ, యూడీసీటీలో తన విద్యార్థి దశ జ్ఞాపకాలను, ప్రొఫెసర్ శర్మతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
ప్రొఫెసర్ శర్మ దార్శనికత వల్లే భారత ఆర్థిక వ్యవస్థలో కీలక సంస్కరణలకు బీజం పడిందని అంబానీ అభిప్రాయపడ్డారు. "భారత పరిశ్రమను లైసెన్స్ పర్మిట్ రాజ్ కబంధ హస్తాల నుంచి విడిపిస్తేనే దేశం పారిశ్రామికంగా పురోగమిస్తుందని, ప్రపంచ దేశాలతో పోటీ పడగలదని ప్రొఫెసర్ శర్మ బలంగా నమ్మేవారు. ఈ విషయాన్ని అప్పటి పాలకులకు అర్థమయ్యేలా చెప్పడంలో ఆయన విజయం సాధించారు," అని అంబానీ వివరించారు. తన తండ్రి, రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరూబాయ్ అంబానీ కూడా దేశ పారిశ్రామిక ప్రగతి కోసం ఎలా తపించేవారో, అదే ఆకాంక్ష ప్రొఫెసర్ శర్మలో కూడా కనిపించేదని ఆయన అన్నారు. ప్రొఫెసర్ శర్మను ‘గురు ఆఫ్ భారత్’గా అభివర్ణిస్తూ, ఆయన సేవలకు గుర్తింపుగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ సభాముఖంగా తెలిపారు.
విఖ్యాత రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ముఖేశ్ అంబానీ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విరాళం తన గురువు ప్రొఫెసర్ శర్మకు ఇచ్చే గురుదక్షిణ అని పేర్కొన్నారు.
ముఖేశ్ అంబానీ 1970వ సంవత్సరంలో ఐసీటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రులయ్యారు. ఆ రోజుల్లో ఈ సంస్థను యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (యూడీసీటీ)గా పిలిచేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. సుమారు మూడు గంటలకు పైగా ఐసీటీ ప్రాంగణంలో గడిపిన అంబానీ, యూడీసీటీలో తన విద్యార్థి దశ జ్ఞాపకాలను, ప్రొఫెసర్ శర్మతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
ప్రొఫెసర్ శర్మ దార్శనికత వల్లే భారత ఆర్థిక వ్యవస్థలో కీలక సంస్కరణలకు బీజం పడిందని అంబానీ అభిప్రాయపడ్డారు. "భారత పరిశ్రమను లైసెన్స్ పర్మిట్ రాజ్ కబంధ హస్తాల నుంచి విడిపిస్తేనే దేశం పారిశ్రామికంగా పురోగమిస్తుందని, ప్రపంచ దేశాలతో పోటీ పడగలదని ప్రొఫెసర్ శర్మ బలంగా నమ్మేవారు. ఈ విషయాన్ని అప్పటి పాలకులకు అర్థమయ్యేలా చెప్పడంలో ఆయన విజయం సాధించారు," అని అంబానీ వివరించారు. తన తండ్రి, రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరూబాయ్ అంబానీ కూడా దేశ పారిశ్రామిక ప్రగతి కోసం ఎలా తపించేవారో, అదే ఆకాంక్ష ప్రొఫెసర్ శర్మలో కూడా కనిపించేదని ఆయన అన్నారు. ప్రొఫెసర్ శర్మను ‘గురు ఆఫ్ భారత్’గా అభివర్ణిస్తూ, ఆయన సేవలకు గుర్తింపుగా ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ సభాముఖంగా తెలిపారు.