NTR: ఎన్టీఆర్ స్ఫూర్తి అజరామరం... ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు

- మెల్బోర్న్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహణ
- వేడుకకు హాజరైన సోమిరెడ్డి, నందమూరి రామకృష్ణ, టి.డి.జనార్ధన్, నారా రోహిత్
- ఎన్టీఆర్ సేవలు, సిద్ధాంతాలను కొనియాడిన వక్తలు
- 2024 ఎన్నికల్లో టీడీపీ గెలుపులో ఎన్నారైల కృషికి ప్రశంసలు
- గత ప్రభుత్వ పాలనపై సోమిరెడ్డి విమర్శలు, ప్రస్తుత ప్రభుత్వంపై విశ్వాసం
- ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు, ముందుచూపును వివరించిన టి.డి.జనార్ధన్
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ‘ఎన్నారై తెలుగుదేశం, స్థానిక తెలుగు సాంస్కృతిక సంస్థ’ల ఆధ్వర్యంలో శనివారం నాడు నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాది మంది ప్రవాస భారతీయులు, ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. స్థానిక కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎన్టీఆర్, బాలకృష్ణ చిత్రాల పాటలతో కళాకారులు ఆహూతులను అలరించారు. ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాటకు రూప అనే నృత్యకారిణి చేసిన నృత్య ప్రదర్శన సభికులను మంత్రముగ్ధులను చేసింది.
ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరిలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నందమూరి రామకృష్ణ, బోడే ప్రసాద్, నారా రోహిత్, అశ్విన్ అట్లూరి తదితరులు పాల్గొన్నారు.
ఆయన వచ్చాకే...!: నందమూరి రామకృష్ణ
అన్న ఎన్టీఆర్ తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారని నందమూరి రామకృష్ణ అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ కార్యాలయాలపై తెలుగులో బోర్డులు వెలిశాయని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తి తెలుగుదేశం పార్టీకి ఎల్లప్పుడూ ఉంటుందని, ఆయన బాటలోనే నారా చంద్రబాబునాయుడు పయనిస్తున్నారని తెలిపారు. తెలుగువాడు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ అక్కడుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అవకాశం: సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి గెలుపునకు ఎన్నారైలు చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. 2019-24 మధ్య రాష్ట్రంలో అవినీతి, రాక్షస పాలన సాగిందని ఆయన ఆరోపించారు. తనపై 18 కేసులు పెట్టి జైలుకు పంపారని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు గట్టిగా పోరాడినా వారు కేసులు పెట్టలేదని గుర్తుచేశారు.
జగన్ హయాంలో మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టారని, నాసిరకం బ్రాండ్లతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనే 68 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు లోకేష్ బాబు అండగా ఉన్నారని అన్నారు. లోకేష్ పనితీరు చూసి, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయన కుటుంబాన్ని ఆహ్వానించి రెండు గంటల పాటు గడిపారంటే, లోకేష్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సోమిరెడ్డి వివరించారు.
సినిమాలైనా, రాజకీయాలైనా ఆయనకు ఆయనే సాటి: టీడీ జనార్దన్
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ మాట్లాడుతూ, సినిమాలు అయినా, రాజకీయాలు అయినా అన్న ఎన్టీఆర్కు ఆయనే సాటి అని అన్నారు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఎన్టీఆర్ ధరించినన్ని వైవిధ్యభరిత పాత్రలు మరెవ్వరూ ధరించలేదని పేర్కొన్నారు. నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారని గుర్తుచేశారు. రాయలసీమలో కరవు వచ్చినప్పుడు, తోటి కళాకారులతో నాటకాలు వేసి, జోలెపట్టి విరాళాలు సేకరించి ఆదుకున్నారని తెలిపారు. ఆ క్రమంలో నిర్మాత ఆగ్రహానికి గురైనా, సొంత సంస్థ స్థాపించి సినిమాలు తీసిన ధీరుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. చైనాతో యుద్ధం, దివిసీమ తుపాను వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచిన మానవతావాది అని అన్నారు.
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు వంటి పథకాలు చరిత్ర సృష్టించాయని తెలిపారు. మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు కల్పించారని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు దేశంలోనే తొలిసారిగా సంక్షేమ పెన్షన్లు అందించారని వివరించారు. నదుల అనుసంధానం గురించి దేశంలోనే మొదట ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఆయన పాలసీలు, పథకాలు నేటికీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రజలు చెల్లించే పన్నులకు ధర్మకర్తగా వ్యవహరించారని జనార్దన్ పేర్కొన్నారు.
తన లాంటి ఎంతో మంది యువతకు ఎన్టీఆర్ రాజకీయ జన్మనిచ్చారని, ఆయన రుణం తీర్చుకోవడానికే ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ ద్వారా ఆయన భావజాలాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్ లకు, మెల్బోర్న్ ఎన్నారై తెలుగుదేశం పార్టీకి, తెలుగు సంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరిలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్ధన్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, నందమూరి రామకృష్ణ, బోడే ప్రసాద్, నారా రోహిత్, అశ్విన్ అట్లూరి తదితరులు పాల్గొన్నారు.
ఆయన వచ్చాకే...!: నందమూరి రామకృష్ణ
అన్న ఎన్టీఆర్ తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారని నందమూరి రామకృష్ణ అన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ కార్యాలయాలపై తెలుగులో బోర్డులు వెలిశాయని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తి తెలుగుదేశం పార్టీకి ఎల్లప్పుడూ ఉంటుందని, ఆయన బాటలోనే నారా చంద్రబాబునాయుడు పయనిస్తున్నారని తెలిపారు. తెలుగువాడు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ అక్కడుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అవకాశం: సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని అన్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి గెలుపునకు ఎన్నారైలు చేసిన కృషి ప్రశంసనీయమని కొనియాడారు. 2019-24 మధ్య రాష్ట్రంలో అవినీతి, రాక్షస పాలన సాగిందని ఆయన ఆరోపించారు. తనపై 18 కేసులు పెట్టి జైలుకు పంపారని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు గట్టిగా పోరాడినా వారు కేసులు పెట్టలేదని గుర్తుచేశారు.
జగన్ హయాంలో మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టారని, నాసిరకం బ్రాండ్లతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోనే 68 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు లోకేష్ బాబు అండగా ఉన్నారని అన్నారు. లోకేష్ పనితీరు చూసి, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయన కుటుంబాన్ని ఆహ్వానించి రెండు గంటల పాటు గడిపారంటే, లోకేష్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సోమిరెడ్డి వివరించారు.
సినిమాలైనా, రాజకీయాలైనా ఆయనకు ఆయనే సాటి: టీడీ జనార్దన్
ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ మాట్లాడుతూ, సినిమాలు అయినా, రాజకీయాలు అయినా అన్న ఎన్టీఆర్కు ఆయనే సాటి అని అన్నారు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఎన్టీఆర్ ధరించినన్ని వైవిధ్యభరిత పాత్రలు మరెవ్వరూ ధరించలేదని పేర్కొన్నారు. నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణంలోనూ పాలుపంచుకున్నారని గుర్తుచేశారు. రాయలసీమలో కరవు వచ్చినప్పుడు, తోటి కళాకారులతో నాటకాలు వేసి, జోలెపట్టి విరాళాలు సేకరించి ఆదుకున్నారని తెలిపారు. ఆ క్రమంలో నిర్మాత ఆగ్రహానికి గురైనా, సొంత సంస్థ స్థాపించి సినిమాలు తీసిన ధీరుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. చైనాతో యుద్ధం, దివిసీమ తుపాను వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచిన మానవతావాది అని అన్నారు.
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు వంటి పథకాలు చరిత్ర సృష్టించాయని తెలిపారు. మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు కల్పించారని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు దేశంలోనే తొలిసారిగా సంక్షేమ పెన్షన్లు అందించారని వివరించారు. నదుల అనుసంధానం గురించి దేశంలోనే మొదట ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగుగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఆయన పాలసీలు, పథకాలు నేటికీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రజలు చెల్లించే పన్నులకు ధర్మకర్తగా వ్యవహరించారని జనార్దన్ పేర్కొన్నారు.
తన లాంటి ఎంతో మంది యువతకు ఎన్టీఆర్ రాజకీయ జన్మనిచ్చారని, ఆయన రుణం తీర్చుకోవడానికే ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ ద్వారా ఆయన భావజాలాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్ లకు, మెల్బోర్న్ ఎన్నారై తెలుగుదేశం పార్టీకి, తెలుగు సంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.