Sonam Raghuvanshi: పోలీసులు అబద్ధం చెబుతున్నారు.. మా అమ్మాయి అమాయకురాలు: సోనమ్ తండ్రి

- హనీమూన్లో భర్త హత్య కేసులో భార్య సోనమ్ రఘువంశీ అరెస్ట్
- ప్రియుడితో కలిసి సోనమ్ ఈ హత్యకు ప్లాన్ చేసిందని పోలీసుల అనుమానం
- ఇప్పటికే మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు కిరాయి హంతకుల అరెస్ట్
- కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన దేవీసింగ్
మేఘాలయలో హనీమూన్కు వెళ్లిన భర్త రాజా రఘువంశీ దారుణ హత్యకు గురైన ఘటనలో పది రోజుల అనంతరం ఆయన భార్య సోనమ్ రఘువంశీ (24)ని ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. అయితే, తన కుమార్తెపై మోపిన సుపారీ హత్య ఆరోపణలను సోనమ్ తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టుకథలు అల్లుతున్నారని, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
నా కుమార్తె అమాయకురాలు
సోనమ్ అరెస్ట్ అయిన కొన్ని గంటలకే ఆమె తండ్రి దేవీసింగ్ మీడియాతో మాట్లాడుతూ "నా కుమార్తె అమాయకురాలు. ఆమెపై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను ఇలాంటి పని చేయదు. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వారి వివాహం జరిగింది. మేఘాలయ ప్రభుత్వం మొదటి నుంచి అబద్ధాలు చెబుతోంది" అని ఆరోపించారు.
గత రాత్రి సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఒక రోడ్డు పక్కన ఉన్న ధాబాకు చేరుకుని, తన సోదరుడికి ఫోన్ చేసిందని, ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లారని సింగ్ తెలిపారు. "ఆమెను మేఘాలయలో అరెస్ట్ చేయలేదు. తనే ఘాజీపూర్కు వచ్చింది. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. నా కూతురు తన భర్తను ఎందుకు చంపుతుంది? మేఘాలయ పోలీసులు కట్టుకథలు చెబుతున్నారు" అని ఆయన ఆరోపించారు. ప్రస్తుత దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన దేవీసింగ్ సీబీఐ విచారణ కోరుతూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్టు తెలిపారు. "సీబీఐ విచారణ ప్రారంభమైతే, ఆ మేఘాలయ పోలీస్ స్టేషన్లోని అధికారులంతా జైలుపాలవుతారు" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మే 23న అదృశ్యం
మేఘాలయలోని సోహ్రా (చిరపుంజి)లో ఒక లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైన దాదాపు పది రోజుల తర్వాత సోనమ్ రఘువంశీ ఈ ఉదయం ఘాజీపూర్లో లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ జంట గత నెల హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లగా, మే 23 నుంచి కనిపించకుండా పోయారు.
"సోనమ్ రఘువంశీ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లా నందగంజ్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల సురక్షిత కస్టడీలో ఉన్నారు. ఆమెను మేఘాలయకు తరలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు అనుసరిస్తున్నాం" అని మేఘాలయ పోలీసులు అధికారిక ప్రకటనలో తెలిపారు.
సోనమ్కు మరో వ్యక్తితో సంబంధం
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. సోనమ్ రఘువంశీకి రాజ్ కుష్వాహా అనే మరో వ్యక్తితో సంబంధం ఉందని, అతడితో కలిసి తన భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపణలున్నాయి. విహారయాత్ర పేరుతో మధ్యప్రదేశ్ నుంచి కిరాయి హంతకులను నియమించుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు.
ఈ జంట చివరిసారిగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులతో కనిపించారని ఒక టూరిస్ట్ గైడ్ చెప్పడంతో కేసు కీలక మలుపు తిరిగింది. జూన్ 2న రాజా మృతదేహం కుళ్లిన స్థితిలో ఒక లోయలో లభ్యమైంది. వారు అద్దెకు తీసుకున్న స్కూటర్ తాళం చెవితో సహా సోహ్రారిమ్లో వదిలేసి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.
మేఘాలయ డీజీపీ ఇదాషిషా నోంగ్రాంగ్ మాట్లాడుతూ భర్త హత్యకు కుట్ర పన్నడంలో సోనమ్ రఘువంశీ చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ఈ నేరం చేయడానికి సోనమ్ కిరాయి హంతకులను నియమించుకున్నారని నోంగ్రాంగ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు అనుమానిత కిరాయి హంతకులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసులో మరిన్ని విషయాలు దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉంది.
నా కుమార్తె అమాయకురాలు
సోనమ్ అరెస్ట్ అయిన కొన్ని గంటలకే ఆమె తండ్రి దేవీసింగ్ మీడియాతో మాట్లాడుతూ "నా కుమార్తె అమాయకురాలు. ఆమెపై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను ఇలాంటి పని చేయదు. ఇరు కుటుంబాల అంగీకారంతోనే వారి వివాహం జరిగింది. మేఘాలయ ప్రభుత్వం మొదటి నుంచి అబద్ధాలు చెబుతోంది" అని ఆరోపించారు.
గత రాత్రి సోనమ్ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఒక రోడ్డు పక్కన ఉన్న ధాబాకు చేరుకుని, తన సోదరుడికి ఫోన్ చేసిందని, ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లారని సింగ్ తెలిపారు. "ఆమెను మేఘాలయలో అరెస్ట్ చేయలేదు. తనే ఘాజీపూర్కు వచ్చింది. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. నా కూతురు తన భర్తను ఎందుకు చంపుతుంది? మేఘాలయ పోలీసులు కట్టుకథలు చెబుతున్నారు" అని ఆయన ఆరోపించారు. ప్రస్తుత దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన దేవీసింగ్ సీబీఐ విచారణ కోరుతూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్టు తెలిపారు. "సీబీఐ విచారణ ప్రారంభమైతే, ఆ మేఘాలయ పోలీస్ స్టేషన్లోని అధికారులంతా జైలుపాలవుతారు" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మే 23న అదృశ్యం
మేఘాలయలోని సోహ్రా (చిరపుంజి)లో ఒక లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైన దాదాపు పది రోజుల తర్వాత సోనమ్ రఘువంశీ ఈ ఉదయం ఘాజీపూర్లో లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ జంట గత నెల హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లగా, మే 23 నుంచి కనిపించకుండా పోయారు.
"సోనమ్ రఘువంశీ ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లా నందగంజ్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల సురక్షిత కస్టడీలో ఉన్నారు. ఆమెను మేఘాలయకు తరలించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు అనుసరిస్తున్నాం" అని మేఘాలయ పోలీసులు అధికారిక ప్రకటనలో తెలిపారు.
సోనమ్కు మరో వ్యక్తితో సంబంధం
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. సోనమ్ రఘువంశీకి రాజ్ కుష్వాహా అనే మరో వ్యక్తితో సంబంధం ఉందని, అతడితో కలిసి తన భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపణలున్నాయి. విహారయాత్ర పేరుతో మధ్యప్రదేశ్ నుంచి కిరాయి హంతకులను నియమించుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు.
ఈ జంట చివరిసారిగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులతో కనిపించారని ఒక టూరిస్ట్ గైడ్ చెప్పడంతో కేసు కీలక మలుపు తిరిగింది. జూన్ 2న రాజా మృతదేహం కుళ్లిన స్థితిలో ఒక లోయలో లభ్యమైంది. వారు అద్దెకు తీసుకున్న స్కూటర్ తాళం చెవితో సహా సోహ్రారిమ్లో వదిలేసి ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.
మేఘాలయ డీజీపీ ఇదాషిషా నోంగ్రాంగ్ మాట్లాడుతూ భర్త హత్యకు కుట్ర పన్నడంలో సోనమ్ రఘువంశీ చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ఈ నేరం చేయడానికి సోనమ్ కిరాయి హంతకులను నియమించుకున్నారని నోంగ్రాంగ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు అనుమానిత కిరాయి హంతకులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ కేసులో మరిన్ని విషయాలు దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉంది.