VVR Krishnam Raju: అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు... కృష్ణంరాజుకు రిమాండ్

- కృష్ణంరాజుకు జూన్ 26 వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు
- సాక్షి టీవీ లైవ్ షోలో అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు
- ఇప్పటికే రిమాండ్ లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు
రాజధాని అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరుపరచగా, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
సాక్షి టీవీ ఛానల్లో ఈ నెల 6వ తేదీన ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’ అనే చర్చా కార్యక్రమంలో వీవీఆర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి మహిళల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. ఆ వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, అత్యంత హేయంగా ఉన్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు కూడా అందాయి.
ఈ క్రమంలో, అమరావతి జేఏసీ దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొన్నారు. కాగా, ఇదే కేసులో రెండో నిందితుడిగా (ఏ2) ఉన్న సాక్షి టీవీ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న విషయం విదితమే. తాజా పరిణామంతో ఈ కేసులో ఇద్దరు పాత్రికేయులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లయింది. ఈ ఘటన మీడియా వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సాక్షి టీవీ ఛానల్లో ఈ నెల 6వ తేదీన ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’ అనే చర్చా కార్యక్రమంలో వీవీఆర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి మహిళల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. ఆ వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, అత్యంత హేయంగా ఉన్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు కూడా అందాయి.
ఈ క్రమంలో, అమరావతి జేఏసీ దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా (ఏ1) పేర్కొన్నారు. కాగా, ఇదే కేసులో రెండో నిందితుడిగా (ఏ2) ఉన్న సాక్షి టీవీ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న విషయం విదితమే. తాజా పరిణామంతో ఈ కేసులో ఇద్దరు పాత్రికేయులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లయింది. ఈ ఘటన మీడియా వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.