Narendra Modi: నేడు అహ్మదాబాద్ కు వెళుతున్న మోదీ... విమాన ప్రమాద స్థలిని పరిశీలించనున్న పీఎం

- అహ్మదాబాద్ లో నిన్న కుప్పకూలిన ఎయిరిండియా విమానం
- దుర్ఘటనలో విమానంలోని 241 మంది మృతి
- మృతుల కుటుంబాలను పరామర్శించనున్న ప్రధాని మోదీ
అహ్మదాబాద్ లో నిన్న పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఒకరు మినహా 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో ప్రయాణికులు, కింద ఉన్నవారితో కలిపి 265 మంది మరణించారు. ఈ హృదయ విదారక ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
ఈ భయానక ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకే ఒక్క ప్రయాణికుడు స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా, మిగిలిన 241 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) కూడా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి.
ఈ భయానక ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకే ఒక్క ప్రయాణికుడు స్వల్ప గాయాలతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా, మిగిలిన 241 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) కూడా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రానున్నాయి.