Sushant Singh Rajput: నేడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 5వ వర్థంతి.. ఇన్ స్టాలో సోదరి భావోద్వేగ పోస్ట్

- సుశాంత్ స్వచ్ఛతకు నిలువెత్తు రూపమన్న శ్వేతా సింగ్
- ఐదేళ్ళయినా మరువలేని సుశాంత్.. కొనసాగుతున్న న్యాయపోరాటం
- ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిపై నమ్మకం కోల్పోవద్దని అభిమానులకు సూచన
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. 2020 జూన్ 14న ఆయన మరణవార్త యావత్ సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సందర్భంగా ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన సోదరుడిని స్మరించుకుంటూ ఇన్ స్టాగ్రామ్లో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు పురోగతిపై కీలక సమాచారం పంచుకున్నారు.
"ఈ రోజు అన్నయ్య 5వ వర్థంతి. 2020 జూన్ 14న అతను మరణించినప్పటి నుంచి చాలా జరిగాయి. ఇప్పుడు సీబీఐ కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది, దానిని పొందే ప్రక్రియలో ఉన్నాం" అని శ్వేత తన పోస్టులో తెలిపారు. ఏది ఏమైనప్పటికీ, దేవుడిపై, మంచితనంపై నమ్మకాన్ని కోల్పోవద్దని ఆమె అభిమానులను కోరారు. సుశాంత్ ఎప్పుడూ స్వచ్ఛతకు, జీవితం పట్ల అంతులేని ఉత్సాహానికి, నేర్చుకోవాలనే తపనకు, అందరినీ సమానంగా చూసే ప్రేమ హృదయానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలిచాడని గుర్తుచేశారు. "అతని చిరునవ్వు, కళ్ళలోని అమాయకత్వం ఎవరి హృదయాన్నైనా ప్రేమతో కదిలించగలవు. అదే మన సుశాంత్" అని ఆమె పేర్కొన్నారు.
అభిమానులను ఉద్దేశిస్తూ, "అన్నయ్య ఎక్కడికీ పోలేదు, నమ్మండి... అతను మీలో, నాలో, మనందరిలో ఉన్నాడు. మనం పూర్తి మనసుతో ప్రేమించిన ప్రతిసారీ, జీవితం పట్ల పిల్లల అమాయకత్వం చూపిన ప్రతిసారీ, మరింత నేర్చుకోవాలనే ఆసక్తి చూపిన ప్రతిసారీ, మనం అతన్ని బ్రతికిస్తున్నాం. అన్నయ్య పేరును ఎలాంటి ప్రతికూల భావాలను వ్యాప్తి చేయడానికి ఎప్పుడూ ఉపయోగించవద్దు... అది అతనికి నచ్చదు" అని శ్వేత విజ్ఞప్తి చేశారు. సుశాంత్ వారసత్వం కొనసాగుతుందని, ఎంతో మంది హృదయాలను, మనసులను ప్రభావితం చేశాడని ఆమె తెలిపారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020 జూన్ 14న తన నివాసంలో ఉరివేసుకుని మరణించినట్లు వార్తలు వచ్చాయి. పోస్ట్మార్టం నివేదికలో కూడా ఊపిరాడకపోవడం వల్లే మరణం సంభవించిందని తేలింది. ఈ కేసు మొదట ఆత్మహత్యగా పరిగణించారు. ఆ తర్వాత సీబీఐకి అప్పగించారని శ్వేతా సింగ్ గుర్తుచేశారు.
"ఈ రోజు అన్నయ్య 5వ వర్థంతి. 2020 జూన్ 14న అతను మరణించినప్పటి నుంచి చాలా జరిగాయి. ఇప్పుడు సీబీఐ కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది, దానిని పొందే ప్రక్రియలో ఉన్నాం" అని శ్వేత తన పోస్టులో తెలిపారు. ఏది ఏమైనప్పటికీ, దేవుడిపై, మంచితనంపై నమ్మకాన్ని కోల్పోవద్దని ఆమె అభిమానులను కోరారు. సుశాంత్ ఎప్పుడూ స్వచ్ఛతకు, జీవితం పట్ల అంతులేని ఉత్సాహానికి, నేర్చుకోవాలనే తపనకు, అందరినీ సమానంగా చూసే ప్రేమ హృదయానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలిచాడని గుర్తుచేశారు. "అతని చిరునవ్వు, కళ్ళలోని అమాయకత్వం ఎవరి హృదయాన్నైనా ప్రేమతో కదిలించగలవు. అదే మన సుశాంత్" అని ఆమె పేర్కొన్నారు.
అభిమానులను ఉద్దేశిస్తూ, "అన్నయ్య ఎక్కడికీ పోలేదు, నమ్మండి... అతను మీలో, నాలో, మనందరిలో ఉన్నాడు. మనం పూర్తి మనసుతో ప్రేమించిన ప్రతిసారీ, జీవితం పట్ల పిల్లల అమాయకత్వం చూపిన ప్రతిసారీ, మరింత నేర్చుకోవాలనే ఆసక్తి చూపిన ప్రతిసారీ, మనం అతన్ని బ్రతికిస్తున్నాం. అన్నయ్య పేరును ఎలాంటి ప్రతికూల భావాలను వ్యాప్తి చేయడానికి ఎప్పుడూ ఉపయోగించవద్దు... అది అతనికి నచ్చదు" అని శ్వేత విజ్ఞప్తి చేశారు. సుశాంత్ వారసత్వం కొనసాగుతుందని, ఎంతో మంది హృదయాలను, మనసులను ప్రభావితం చేశాడని ఆమె తెలిపారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ 2020 జూన్ 14న తన నివాసంలో ఉరివేసుకుని మరణించినట్లు వార్తలు వచ్చాయి. పోస్ట్మార్టం నివేదికలో కూడా ఊపిరాడకపోవడం వల్లే మరణం సంభవించిందని తేలింది. ఈ కేసు మొదట ఆత్మహత్యగా పరిగణించారు. ఆ తర్వాత సీబీఐకి అప్పగించారని శ్వేతా సింగ్ గుర్తుచేశారు.