Maruthi: థియేటర్ వద్ద కటౌట్.. నాన్నను తలుచుకుని దర్శకుడు మారుతి ఎమోషనల్ పోస్ట్

- దర్శకుడు మారుతి 'ఎక్స్'లో భావోద్వేగ పోస్ట్
- మచిలీపట్నంలో తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న వైనం
- పాన్ ఇండియా స్టార్ పక్కన తన కటౌట్ చూసి ఆనందం
- దివంగత తండ్రిని తలచుకుని ఉద్వేగానికి లోనైన మారుతి
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు మారుతి దాసరి సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన సొంతూరు మచిలీపట్నంలో తాను కలలుగన్న చోటనే తన కటౌట్ వెలవడం చూసి చిన్ననాటి జ్ఞాపకాలను, తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఓ ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సినీ అభిమానులను, నెటిజన్లను కదిలిస్తోంది.
మారుతి తన బాల్యం గడిపిన మచిలీపట్నంలోని సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్ థియేటర్) వద్దకు వెళ్లినప్పటి అనుభూతిని పంచుకున్నారు. "మచిలీపట్నం - సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్). ఇక్కడే నాన్నగారికి ఒకప్పుడు ఒక చిన్న అరటిపండు దుకాణం ఉండేది. ఈ థియేటర్లో విడుదలైన అన్ని హీరోల సినిమాలకు బ్యానర్లు రాసేవాడిని. 'ఒక్కసారైనా నా పేరు చూడాలి ఇక్కడ' అని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన నా కటౌట్ పెట్టారు. నాన్న ఉంటే గర్వపడేవారు" అంటూ తన చిన్ననాటి కోరికను గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం అదే థియేటర్ వద్ద, ఒక పాన్ ఇండియా స్టార్ సినిమా బ్యానర్ పక్కన తన కటౌట్ కూడా ఉండటాన్ని చూసి మారుతి తీవ్ర ఆనందానికి, ఉద్వేగానికి లోనయ్యారు. తన కల నెరవేరిన తీరును వివరించారు. ఈ విజయాన్ని చూసి తన తండ్రి ఎంతగానో గర్వపడేవారని చెబుతూ, "మా నాన్న ఈ రోజు చాలా గర్వంగా ఉండేవాడు. నిన్ను మిస్ అవుతున్నాను నాన్నా" అంటూ దివంగత తండ్రిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు.
ఇక, మారుతి పోస్ట్ ఆయన అభిమానులనే కాకుండా, పరిశ్రమ వర్గాలను కూడా ఆకట్టుకుంది. పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని, మూలాలను మరిచిపోకూడదని ఆయన ప్రస్థానం మరోసారి నిరూపిస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.
కాగా, ఇవాళ ఉదయం 10.52 గంటలకు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాజాసాబ్ టీజర్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ టీజర్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ మూవీలో రెబల్ స్టార్ పక్కన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే.
మారుతి తన బాల్యం గడిపిన మచిలీపట్నంలోని సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్ థియేటర్) వద్దకు వెళ్లినప్పటి అనుభూతిని పంచుకున్నారు. "మచిలీపట్నం - సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్). ఇక్కడే నాన్నగారికి ఒకప్పుడు ఒక చిన్న అరటిపండు దుకాణం ఉండేది. ఈ థియేటర్లో విడుదలైన అన్ని హీరోల సినిమాలకు బ్యానర్లు రాసేవాడిని. 'ఒక్కసారైనా నా పేరు చూడాలి ఇక్కడ' అని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన నా కటౌట్ పెట్టారు. నాన్న ఉంటే గర్వపడేవారు" అంటూ తన చిన్ననాటి కోరికను గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం అదే థియేటర్ వద్ద, ఒక పాన్ ఇండియా స్టార్ సినిమా బ్యానర్ పక్కన తన కటౌట్ కూడా ఉండటాన్ని చూసి మారుతి తీవ్ర ఆనందానికి, ఉద్వేగానికి లోనయ్యారు. తన కల నెరవేరిన తీరును వివరించారు. ఈ విజయాన్ని చూసి తన తండ్రి ఎంతగానో గర్వపడేవారని చెబుతూ, "మా నాన్న ఈ రోజు చాలా గర్వంగా ఉండేవాడు. నిన్ను మిస్ అవుతున్నాను నాన్నా" అంటూ దివంగత తండ్రిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు.
ఇక, మారుతి పోస్ట్ ఆయన అభిమానులనే కాకుండా, పరిశ్రమ వర్గాలను కూడా ఆకట్టుకుంది. పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని, మూలాలను మరిచిపోకూడదని ఆయన ప్రస్థానం మరోసారి నిరూపిస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.
కాగా, ఇవాళ ఉదయం 10.52 గంటలకు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాజాసాబ్ టీజర్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ టీజర్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ మూవీలో రెబల్ స్టార్ పక్కన మాళవిక మోహన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే.