Maharashtra: హృదయవిదారక ఘటన.. ప్లాస్టిక్ సంచిలో మృతశిశువు.. బస్సులో 90 కిలోమీటర్లు ప్రయాణం!

- మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో ఘటన
- అంబులెన్స్ సమయానికి రాక గర్భంలోనే శిశువు మృతి
- శిశువు మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో తరలించిన వైనం
- 90 కిలోమీటర్లు ప్రయాణించిన నిస్సహాయ కుటుంబం
- ఆరోగ్య వ్యవస్థ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వైద్య సేవల లోపం ఓ పసికందు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఆ శిశువు మృతదేహాన్ని ఓ నిరుపేద కుటుంబం ప్లాస్టిక్ సంచిలో 90 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాల్సిన అత్యంత దయనీయ పరిస్థితి దాపురించింది. ఈ హృదయ విదారక ఘటన మోఖాడ తాలూకాలో చోటుచేసుకుంది. ఈ నెల 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మోఖాడకు చెందిన గర్భిణి అవిత సఖారాం కవర్కు ఈ నెల 11న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అత్యవసర అంబులెన్స్ సేవలకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ, మధ్యాహ్నం వరకు ఎటువంటి అంబులెన్స్ అందుబాటులోకి రాలేదు. చేసేదేమీలేక వారు సొంతంగా ఓ ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకుని ఆమెను ఖొడాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అయితే, అక్కడ కూడా సరైన చికిత్స అందడంలో ఆలస్యం జరగడంతో పరిస్థితి విషమించిందని భావించిన వైద్యులు ఆమెను నాసిక్లోని ఓ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దురదృష్టవశాత్తూ నాసిక్ ఆసుపత్రికి చేరుకోకముందే గర్భంలోనే శిశువు మృతి చెందింది. అక్కడ అవిత మృత శిశువుకు జన్మనిచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు మృత శిశువును తరలించేందుకు కూడా ఆసుపత్రి యాజమాన్యం అంబులెన్స్ సమకూర్చలేదు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో మరణించిన తమ పసికందును ఓ ప్లాస్టిక్ సంచిలో వేసుకుని సుమారు 90 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఈ దుస్థితి పాల్ఘర్లోని జవహర్-మోఖాడ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ ఎంత దయనీయంగా ఉందో మరోసారి బహిర్గతం చేసింది.
మరోవైపు పాల్ఘర్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయంపై స్పందిస్తూ, గర్భిణి ఆరోగ్యంపై తాము పర్యవేక్షణ జరుపుతున్నామని, గర్భంలోనే శిశువు మరణించిన విషయం తమకు తెలుసునని తెలిపారు. అయితే, మృత శిశువును కుటుంబ సభ్యులు ప్లాస్టిక్ సంచిలో తరలించారన్న విషయం తమ దృష్టికి రాలేదని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మోఖాడకు చెందిన గర్భిణి అవిత సఖారాం కవర్కు ఈ నెల 11న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అత్యవసర అంబులెన్స్ సేవలకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ, మధ్యాహ్నం వరకు ఎటువంటి అంబులెన్స్ అందుబాటులోకి రాలేదు. చేసేదేమీలేక వారు సొంతంగా ఓ ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకుని ఆమెను ఖొడాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అయితే, అక్కడ కూడా సరైన చికిత్స అందడంలో ఆలస్యం జరగడంతో పరిస్థితి విషమించిందని భావించిన వైద్యులు ఆమెను నాసిక్లోని ఓ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దురదృష్టవశాత్తూ నాసిక్ ఆసుపత్రికి చేరుకోకముందే గర్భంలోనే శిశువు మృతి చెందింది. అక్కడ అవిత మృత శిశువుకు జన్మనిచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు మృత శిశువును తరలించేందుకు కూడా ఆసుపత్రి యాజమాన్యం అంబులెన్స్ సమకూర్చలేదు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో మరణించిన తమ పసికందును ఓ ప్లాస్టిక్ సంచిలో వేసుకుని సుమారు 90 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఈ దుస్థితి పాల్ఘర్లోని జవహర్-మోఖాడ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ ఎంత దయనీయంగా ఉందో మరోసారి బహిర్గతం చేసింది.
మరోవైపు పాల్ఘర్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయంపై స్పందిస్తూ, గర్భిణి ఆరోగ్యంపై తాము పర్యవేక్షణ జరుపుతున్నామని, గర్భంలోనే శిశువు మరణించిన విషయం తమకు తెలుసునని తెలిపారు. అయితే, మృత శిశువును కుటుంబ సభ్యులు ప్లాస్టిక్ సంచిలో తరలించారన్న విషయం తమ దృష్టికి రాలేదని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.