Mossad: ఇజ్రాయెల్ 'మొసాద్' కేంద్ర కార్యాలయంపై ఇరాన్ బాంబుల మోత!

- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఘర్షణ
- ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ బాంబు దాడి
- గ్లిలాట్లోని ఇజ్రాయెల్ సైనిక ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్పైనా క్షిపణి ప్రయోగం
- మధ్యవర్తుల ద్వారా చర్చలకు సిద్ధమంటూనే దాడులు కొనసాగిస్తున్న ఇరాన్
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా పర్యటన అర్ధాంతరంగా ముగింపు
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇజ్రాయెల్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ బాంబులతో దాడి చేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడి జరిగిందని సదరు మీడియా పేర్కొంది. అంతేకాకుండా, గ్లిలాట్లోని ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ను కూడా క్షిపణితో లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది.
ఇజ్రాయెల్ దాడుల వెనుక మొసాద్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్లోని అణు స్థావరాల వివరాలు, కీలక శాస్త్రవేత్తలు, అధికారుల నివాసాల సమాచారాన్ని మొసాద్ ఇజ్రాయెల్కు చేరవేసిందని చెబుతున్నారు. ఇరాన్లోకి భారీగా డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ చేపట్టిన కోవర్ట్ ఆపరేషన్ వెనుక కూడా మొసాద్ హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ దాడికి పాల్పడింది. రాత్రి సమయాల్లోనే ఇరాన్ ఈ క్షిపణి దాడులు నిర్వహిస్తోంది.
ఒకవైపు దాడులు కొనసాగిస్తూనే, మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్, అమెరికాలకు సంకేతాలు పంపుతోంది. అయితే, దాడులను మాత్రం ఆపడం లేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ యుద్ధ వాతావరణంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇజ్రాయెల్ దాడుల వెనుక మొసాద్ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్లోని అణు స్థావరాల వివరాలు, కీలక శాస్త్రవేత్తలు, అధికారుల నివాసాల సమాచారాన్ని మొసాద్ ఇజ్రాయెల్కు చేరవేసిందని చెబుతున్నారు. ఇరాన్లోకి భారీగా డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ చేపట్టిన కోవర్ట్ ఆపరేషన్ వెనుక కూడా మొసాద్ హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఈ దాడికి పాల్పడింది. రాత్రి సమయాల్లోనే ఇరాన్ ఈ క్షిపణి దాడులు నిర్వహిస్తోంది.
ఒకవైపు దాడులు కొనసాగిస్తూనే, మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్, అమెరికాలకు సంకేతాలు పంపుతోంది. అయితే, దాడులను మాత్రం ఆపడం లేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ యుద్ధ వాతావరణంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.