Maharashtra Schools: మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీ మూడో భాష: కొత్త నిబంధనపై వివాదం

- హిందీ తప్పనిసరి కాదు, కానీ డిఫాల్ట్
- వేరే భాష కావాలంటే క్లాస్ లో కనీసం 20 మంది ఆ భాషను ఎంచుకోవాలి
- ఈ నిబంధనపై విద్యావేత్తల ఆందోళన
మహారాష్ట్రలోని పాఠశాలల్లో హిందీని మూడో భాషగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం సవరించిన నోటిఫికేషన్ ను నిన్న జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. గత ఏప్రిల్లో మరాఠీ,ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో హిందీని తప్పనిసరి మూడో భాషగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ప్రతిపక్షాలు, మరాఠీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం నిలిపివేసింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం, హిందీ "తప్పనిసరి" కానప్పటికీ, "సాధారణంగా" బోధించే మూడో భాషగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు కోరుకుంటే ఇతర భాషలను ఎంచుకోవచ్చని, అయితే ఒక తరగతిలో కనీసం 20 మంది విద్యార్థులు మరో భాషను ఎంచుకుంటేనే ఆ సబ్జెక్టును అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ భాషకు ఉపాధ్యాయులు లభించకపోతే ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తారని తెలిపింది. మరాఠీ మాత్రం రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగుతుంది.
ఈ 20 మంది విద్యార్థుల నిబంధనపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువ సంఖ్య అని, హిందీయేతర భాషలను ఎంచుకోకుండా విద్యార్థులను నిరుత్సాహపరిచే ప్రయత్నమని మహారాష్ట్ర మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక విద్యామండలి మాజీ ఛైర్పర్సన్ వసంత్ కల్పాండే ఆరోపించారు. మరాఠీ, హిందీ భాషల లిపి ఒకేలా ఉండటంతో చిన్న పిల్లలకు రెండూ నేర్చుకోవడం కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఈ త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నారు.
తాజా నోటిఫికేషన్ ప్రకారం, హిందీ "తప్పనిసరి" కానప్పటికీ, "సాధారణంగా" బోధించే మూడో భాషగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. విద్యార్థులు కోరుకుంటే ఇతర భాషలను ఎంచుకోవచ్చని, అయితే ఒక తరగతిలో కనీసం 20 మంది విద్యార్థులు మరో భాషను ఎంచుకుంటేనే ఆ సబ్జెక్టును అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ భాషకు ఉపాధ్యాయులు లభించకపోతే ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తారని తెలిపింది. మరాఠీ మాత్రం రాష్ట్రంలోని విద్యార్థులందరికీ తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగుతుంది.
ఈ 20 మంది విద్యార్థుల నిబంధనపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువ సంఖ్య అని, హిందీయేతర భాషలను ఎంచుకోకుండా విద్యార్థులను నిరుత్సాహపరిచే ప్రయత్నమని మహారాష్ట్ర మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక విద్యామండలి మాజీ ఛైర్పర్సన్ వసంత్ కల్పాండే ఆరోపించారు. మరాఠీ, హిందీ భాషల లిపి ఒకేలా ఉండటంతో చిన్న పిల్లలకు రెండూ నేర్చుకోవడం కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఈ త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నారు.