Mohsen Fakhrizadeh: ఏఐ సాయంతో 2020లో ఇరాన్ అణు శాస్త్రవేత్త హత్య.. మర్డర్ మిస్టరీ

- రిమోట్ కంట్రోల్డ్ రోబో స్నైపర్ పనే అంటున్న ఇరాన్
- అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫఖ్రిజాదే హత్య వెనుక మొస్సాద్!
- ఫేషియల్ రికగ్నిషన్ ఏఐ, శాటిలైట్ వ్యవస్థతో దుండగుల ఆపరేషన్
ఇటీవల ఇజ్రాయెల్ క్షిపణుల దాడిలో ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ మాజీ అధిపతి ఫెరిడౌన్ అబ్బాసీ మరణించడంతో 2020లో జరిగిన ఓ సంచలన హత్య ఘటన మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫఖ్రిజాదే హత్య. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.
ఫాంటమ్ సైంటిస్ట్ ఫఖ్రిజాదే
మొహసెన్ ఫఖ్రిజాదే చాలా సంవత్సరాల పాటు అత్యంత రహస్య వ్యక్తిగా మిగిలిపోయారు. 2000వ దశకం ప్రారంభంలో ఇరాన్ రహస్యంగా అణుబాంబును నిర్మించడానికి చేపట్టిన "ప్రాజెక్ట్ అమాద్" వెనుక ఈయనే ముఖ్య సూత్రధారి అని పాశ్చాత్య నిఘా వర్గాలు భావించాయి. ఆయన బహిరంగంగా ఎప్పుడూ కనిపించలేదు, ఆయన ఫోటోలు కూడా చాలా అరుదుగా లభ్యమయ్యేవి. పాశ్చాత్య నిఘా సంస్థలు, ఇజ్రాయెల్ అధికారులు ఫఖ్రిజాదేను "ఇరాన్ అణు కార్యక్రమ పితామహుడు"గా అభివర్ణించేవారు. 2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్కు చెందిన అణు దస్త్రాలను బహిర్గతం చేస్తూ, ఫఖ్రిజాదే పేరును ప్రస్తావించి "ఈ పేరు గుర్తుంచుకోండి" అని వ్యాఖ్యానించారు. అప్పటినుంచే ఆయనకు ముప్పు పొంచి ఉందని స్పష్టమైంది.
హత్య జరిగిందిలా..
2020 నవంబర్ 27న మొహసెన్ ఫఖ్రిజాదే తన భార్య, బాడీగార్డులతో కలిసి టెహ్రాన్కు తూర్పున ఉన్న అబ్సార్డ్ పట్టణంలోని తమ విల్లాకు కారులో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో, రోడ్డు పక్కన వదిలేసినట్లుగా ఉన్న ఓ పికప్ ట్రక్కులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 7.62 ఎంఎం ఎఫ్ఎన్ ఎంఏజీ మెషిన్ గన్ను అమర్చారు. దీనికి ఫేషియల్ రికగ్నిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ లింకులు, పేలుడు పదార్థాలు కూడా జోడించారు. ఫఖ్రిజాదే కాన్వాయ్ ఒక స్పీడ్ బంప్ వద్ద వేగాన్ని తగ్గించగానే, ఆ మెషిన్ గన్ ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించింది.
దాక్కునే ప్రయత్నం చేసినా..
మొదట కారు ముందు భాగంలో బుల్లెట్లు తగలగా, రెండో రౌండ్ కాల్పుల్లో విండ్షీల్డ్ పగిలి, ఫఖ్రిజాదే భుజంలోకి కనీసం ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయన కారు దిగి డోర్ వెనుక దాక్కునే ప్రయత్నం చేయగా, మరో మూడు బుల్లెట్లు ఆయన వెన్నెముకలోకి దూసుకెళ్లి అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ ఘటనలో ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. మొత్తం 15 బుల్లెట్లు పేలగా, నిమిషం లోపే ఈ ఆపరేషన్ పూర్తయిందని ఇరాన్ అధికారులు తెలిపారు. అనంతరం ఆ ట్రక్కు పేలిపోయింది, కానీ ఆయుధాన్ని పూర్తిగా ధ్వంసం చేయడంలో విఫలమైంది.
మొస్సాద్పై ఆరోపణలు
ఈ మొత్తం ఆపరేషన్, నిఘా నుంచి హత్య వరకు, ఇజ్రాయెల్ విదేశీ గూఢచార సంస్థ మొస్సాద్ పనేనని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ అధికారికంగా బాధ్యత వహించనప్పటికీ, మొస్సాద్ మాజీ చీఫ్ యోస్సీ కోహెన్ తర్వాత కాలంలో ఫఖ్రిజాదే సరైన లక్ష్యమేనని సూచనప్రాయంగా వ్యాఖ్యానించారు. నెలల తరబడి నిఘా పెట్టి, ఆయుధ భాగాలను రహస్యంగా ఇరాన్లోకి తరలించి, అక్కడే అమర్చి ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత ఇరాన్ మరింత కఠిన వైఖరి అవలంబించి యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.
ఫాంటమ్ సైంటిస్ట్ ఫఖ్రిజాదే
మొహసెన్ ఫఖ్రిజాదే చాలా సంవత్సరాల పాటు అత్యంత రహస్య వ్యక్తిగా మిగిలిపోయారు. 2000వ దశకం ప్రారంభంలో ఇరాన్ రహస్యంగా అణుబాంబును నిర్మించడానికి చేపట్టిన "ప్రాజెక్ట్ అమాద్" వెనుక ఈయనే ముఖ్య సూత్రధారి అని పాశ్చాత్య నిఘా వర్గాలు భావించాయి. ఆయన బహిరంగంగా ఎప్పుడూ కనిపించలేదు, ఆయన ఫోటోలు కూడా చాలా అరుదుగా లభ్యమయ్యేవి. పాశ్చాత్య నిఘా సంస్థలు, ఇజ్రాయెల్ అధికారులు ఫఖ్రిజాదేను "ఇరాన్ అణు కార్యక్రమ పితామహుడు"గా అభివర్ణించేవారు. 2018లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్కు చెందిన అణు దస్త్రాలను బహిర్గతం చేస్తూ, ఫఖ్రిజాదే పేరును ప్రస్తావించి "ఈ పేరు గుర్తుంచుకోండి" అని వ్యాఖ్యానించారు. అప్పటినుంచే ఆయనకు ముప్పు పొంచి ఉందని స్పష్టమైంది.
హత్య జరిగిందిలా..
2020 నవంబర్ 27న మొహసెన్ ఫఖ్రిజాదే తన భార్య, బాడీగార్డులతో కలిసి టెహ్రాన్కు తూర్పున ఉన్న అబ్సార్డ్ పట్టణంలోని తమ విల్లాకు కారులో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో, రోడ్డు పక్కన వదిలేసినట్లుగా ఉన్న ఓ పికప్ ట్రక్కులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 7.62 ఎంఎం ఎఫ్ఎన్ ఎంఏజీ మెషిన్ గన్ను అమర్చారు. దీనికి ఫేషియల్ రికగ్నిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ లింకులు, పేలుడు పదార్థాలు కూడా జోడించారు. ఫఖ్రిజాదే కాన్వాయ్ ఒక స్పీడ్ బంప్ వద్ద వేగాన్ని తగ్గించగానే, ఆ మెషిన్ గన్ ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించింది.
దాక్కునే ప్రయత్నం చేసినా..
మొదట కారు ముందు భాగంలో బుల్లెట్లు తగలగా, రెండో రౌండ్ కాల్పుల్లో విండ్షీల్డ్ పగిలి, ఫఖ్రిజాదే భుజంలోకి కనీసం ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయన కారు దిగి డోర్ వెనుక దాక్కునే ప్రయత్నం చేయగా, మరో మూడు బుల్లెట్లు ఆయన వెన్నెముకలోకి దూసుకెళ్లి అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ ఘటనలో ఆయన భార్యకు ఎలాంటి గాయాలు కాలేదు. మొత్తం 15 బుల్లెట్లు పేలగా, నిమిషం లోపే ఈ ఆపరేషన్ పూర్తయిందని ఇరాన్ అధికారులు తెలిపారు. అనంతరం ఆ ట్రక్కు పేలిపోయింది, కానీ ఆయుధాన్ని పూర్తిగా ధ్వంసం చేయడంలో విఫలమైంది.
మొస్సాద్పై ఆరోపణలు
ఈ మొత్తం ఆపరేషన్, నిఘా నుంచి హత్య వరకు, ఇజ్రాయెల్ విదేశీ గూఢచార సంస్థ మొస్సాద్ పనేనని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్ అధికారికంగా బాధ్యత వహించనప్పటికీ, మొస్సాద్ మాజీ చీఫ్ యోస్సీ కోహెన్ తర్వాత కాలంలో ఫఖ్రిజాదే సరైన లక్ష్యమేనని సూచనప్రాయంగా వ్యాఖ్యానించారు. నెలల తరబడి నిఘా పెట్టి, ఆయుధ భాగాలను రహస్యంగా ఇరాన్లోకి తరలించి, అక్కడే అమర్చి ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత ఇరాన్ మరింత కఠిన వైఖరి అవలంబించి యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.