BCCI: బీసీసీఐకి బాంబే హైకోర్టు షాక్.. రద్దయిన ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీకి రూ. 538 కోట్లు చెల్లించాలని ఆదేశాలు!

- కొచ్చి టస్కర్స్ కేరళకు బీసీసీఐ రూ. 538 కోట్లు చెల్లించాలన్న బాంబే హైకోర్టు
- మధ్యవర్తిత్వ తీర్పును సమర్థించిన న్యాయస్థానం.. బీసీసీఐ అప్పీల్ తిరస్కరణ
- 2011లో ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలతో కొచ్చి ఫ్రాంచైజీ రద్దు
- 2015లోనే కొచ్చికి అనుకూలంగా మధ్యవర్తిత్వ తీర్పు.. దానిని సవాలు చేసిన బీసీసీఐ
- మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం తమ పరిధి పరిమితమని కోర్టు స్పష్టం
- ఒకే ఒక ఐపీఎల్ సీజన్ ఆడిన కొచ్చి టస్కర్స్
బీసీసీఐకి బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ మాజీ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళకు అనుకూలంగా వెలువడిన మధ్యవర్తిత్వ తీర్పును న్యాయస్థానం సమర్థించింది. ఈ మేరకు ఆ ఫ్రాంచైజీకి రూ. 538 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదం చాలా ఏళ్లుగా నడుస్తుండగా, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొచ్చి ఫ్రాంచైజీకి పెద్ద ఊరట లభించినట్లయింది.
కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీ ఐపీఎల్లో కేవలం ఒకే ఒక సీజన్ (2011) ఆడింది. ఒప్పందం ప్రకారం బ్యాంక్ గ్యారెంటీని సకాలంలో సమర్పించలేదన్న కారణంతో ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపిస్తూ 2011లో బీసీసీఐ ఈ ఫ్రాంచైజీని అర్ధాంతరంగా రద్దు చేసింది. దీనిపై కొచ్చి టస్కర్స్ యాజమాన్యం మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది.
2015లో ఆర్బిట్రేటర్ జస్టిస్ లహోటి నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ కొచ్చి టస్కర్స్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కేసీపీఎల్ (కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్)కు రూ. 384 కోట్లు, రెండెన్జ్వౌస్ స్పోర్ట్స్కు రూ. 153 కోట్లు, మొత్తంగా సుమారు రూ. 550 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును బీసీసీఐ బాంబే హైకోర్టులో సవాలు చేసింది.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు, మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం తమ పరిధి చాలా పరిమితమని స్పష్టం చేసింది. "మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 34 కింద ఈ కోర్టు పరిధి చాలా తక్కువ. వివాదం యొక్క మెరిట్స్లోకి వెళ్లడానికి బీసీసీఐ చేస్తున్న ప్రయత్నం, చట్టంలోని సెక్షన్ 34లో ఉన్న నిబంధనల పరిధికి విరుద్ధం" అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. దీంతో ఆర్బిట్రేషన్ తీర్పును సమర్థిస్తూ కొచ్చి టస్కర్స్కు రూ. 538 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది.
సుమారు రూ. 1,550 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ఫ్రాంచైజీ, వార్షిక చెల్లింపులో విఫలమవడంతో బీసీసీఐ 2011లో వారి ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక, కొచ్చి టస్కర్స్ కేరళ తాము ఆడిన ఏకైక 2011 ఐపీఎల్ సీజన్లో 10 జట్ల పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో ఆడిన 14 లీగ్ మ్యాచ్లలో ఆరు విజయాలు సాధించింది. బ్రాడ్ హాడ్జ్, మహేల జయవర్ధనే, బ్రెండన్ మెక్కల్లమ్, రవీంద్ర జడేజా వంటి ప్రముఖ ఆటగాళ్లు ఆ సీజన్లో కొచ్చి ఫ్రాంచైజీ తరఫున ఆడారు.
కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీ ఐపీఎల్లో కేవలం ఒకే ఒక సీజన్ (2011) ఆడింది. ఒప్పందం ప్రకారం బ్యాంక్ గ్యారెంటీని సకాలంలో సమర్పించలేదన్న కారణంతో ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపిస్తూ 2011లో బీసీసీఐ ఈ ఫ్రాంచైజీని అర్ధాంతరంగా రద్దు చేసింది. దీనిపై కొచ్చి టస్కర్స్ యాజమాన్యం మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది.
2015లో ఆర్బిట్రేటర్ జస్టిస్ లహోటి నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ కొచ్చి టస్కర్స్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కేసీపీఎల్ (కొచ్చి క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్)కు రూ. 384 కోట్లు, రెండెన్జ్వౌస్ స్పోర్ట్స్కు రూ. 153 కోట్లు, మొత్తంగా సుమారు రూ. 550 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును బీసీసీఐ బాంబే హైకోర్టులో సవాలు చేసింది.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు, మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం తమ పరిధి చాలా పరిమితమని స్పష్టం చేసింది. "మధ్యవర్తిత్వ చట్టంలోని సెక్షన్ 34 కింద ఈ కోర్టు పరిధి చాలా తక్కువ. వివాదం యొక్క మెరిట్స్లోకి వెళ్లడానికి బీసీసీఐ చేస్తున్న ప్రయత్నం, చట్టంలోని సెక్షన్ 34లో ఉన్న నిబంధనల పరిధికి విరుద్ధం" అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. దీంతో ఆర్బిట్రేషన్ తీర్పును సమర్థిస్తూ కొచ్చి టస్కర్స్కు రూ. 538 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది.
సుమారు రూ. 1,550 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ఫ్రాంచైజీ, వార్షిక చెల్లింపులో విఫలమవడంతో బీసీసీఐ 2011లో వారి ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక, కొచ్చి టస్కర్స్ కేరళ తాము ఆడిన ఏకైక 2011 ఐపీఎల్ సీజన్లో 10 జట్ల పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో ఆడిన 14 లీగ్ మ్యాచ్లలో ఆరు విజయాలు సాధించింది. బ్రాడ్ హాడ్జ్, మహేల జయవర్ధనే, బ్రెండన్ మెక్కల్లమ్, రవీంద్ర జడేజా వంటి ప్రముఖ ఆటగాళ్లు ఆ సీజన్లో కొచ్చి ఫ్రాంచైజీ తరఫున ఆడారు.