Narendra Modi: 'యోగాంధ్ర'తో ప్రపంచం ఏపీ వైపు చూస్తోంది... కూటమి నేతలను అభినందించిన మోదీ

- రేపు (జూన్ 21) విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం
- విశాఖ చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికిన చంద్రబాబు, పవన్, లోకేశ్
- ఏపీ నేతల సమష్టి కృషి ప్రశంసనీయమన్న ప్రధాని మోదీ
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న 'యోగాంధ్ర' కార్యక్రమం ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ భరత్లతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని, దీని ద్వారా ప్రపంచం ఏపీ వైపు చూసేలా చేశారని ప్రధాని మోదీ అభినందించారు. ఏపీ నేతల సమష్టి కృషి, పనితీరు అద్భుతంగా ఉన్నాయని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
అంతకుముందు, యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ప్రధాని నేరుగా ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని, అక్కడి నుంచి నౌకాదళ అతిథిగృహానికి వెళ్లారు. ఈ రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో నిర్వహించే భారీ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని యోగాసనాలు వేయనున్నారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం, ఉదయం 11:50 గంటలకు ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.



అంతకుముందు, యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ప్రధాని నేరుగా ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని, అక్కడి నుంచి నౌకాదళ అతిథిగృహానికి వెళ్లారు. ఈ రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో నిర్వహించే భారీ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని యోగాసనాలు వేయనున్నారు. కార్యక్రమాలు ముగిసిన అనంతరం, ఉదయం 11:50 గంటలకు ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.



