Noshir Gowadia: అమెరికా బి-2 బాంబర్ తయారీలో మనవాడే కీలకం... కానీ చివరికి!

- అమెరికా బీ-2 స్టెల్త్ బాంబర్ల రూపకల్పనలో భారత సంతతి ఇంజనీర్ కీలక పాత్ర
- నోషిర్ గోవాడియా అనే ఇంజనీర్ చైనాకు రహస్య సైనిక సమాచారం లీక్
- చైనా ఈ టెక్నాలజీతో క్రూయిజ్ క్షిపణులు, స్టెల్త్ బాంబర్ అభివృద్ధి
- అమెరికా భద్రతకు ముప్పు కలిగించారన్న ఆరోపణలతో 32 ఏళ్ల జైలు శిక్ష
- రూ.91 లక్షల కోసం కీలక సమాచారం అమ్మకం
- జర్మనీ, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్లకు కూడా రహస్యాలు చేరవేత
అమెరికా వాయుసేన అమ్ములపొదిలోని అత్యాధునిక బి-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన భారత సంతతి ఏరోస్పేస్ ఇంజనీర్ నోషిర్ షెరియార్జీ గోవాడియా, దేశ రక్షణ రహస్యాలను చైనాకు అమ్మి అమెరికా భద్రతకు పెను ముప్పు తెచ్చారన్న అభియోగాలపై 32 ఏళ్ల కఠిన కారాగార శిక్షకు గురయ్యారు. ఈ వార్త అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. గోవాడియా అందించిన సాంకేతిక పరిజ్ఞానంతోనే చైనా తన క్రూయిజ్ క్షిపణుల కోసం స్టెల్త్ ఎగ్జాస్ట్ వ్యవస్థను, దీర్ఘ శ్రేణి హెచ్-20 స్టెల్త్ బాంబర్ను అభివృద్ధి చేసుకుందని అమెరికా ఆరోపించింది.
ముంబైలో 1944లో జన్మించిన గోవాడియా, 1960లలో అమెరికాకు వలస వెళ్లి నార్త్రప్ గ్రమ్మన్ కార్పొరేషన్లో డిజైన్ ఇంజనీర్గా చేరారు. బి-2 స్పిరిట్ బాంబర్లను రాడార్లకు, ఇన్ఫ్రారెడ్ స్కానర్లకు, కంటికి కూడా అంత సులభంగా చిక్కకుండా చేసే సాంకేతికత అభివృద్ధిలో ఆయనది కీలక పాత్ర. ముఖ్యంగా, వినూత్నమైన ఎగ్జాస్ట్ ఆకృతులు, రాడార్ తరంగాలను శోషించుకునే పదార్థాల రూపకల్పనలో ఆయన ప్రతిభ కనబరిచారు.
అయితే, 2003 నుంచి 2005 మధ్య కాలంలో గోవాడియా పలుమార్లు చైనాలో పర్యటించి, అక్కడి ఏరోనాటికల్ టెస్టింగ్ కేంద్రంలో క్షిపణి ఎగ్జాస్ట్ వ్యవస్థ, దాని ఉష్ణ సంకేతాలకు (హీట్ సిగ్నేచర్) సంబంధించిన లోపాలను గుర్తించి, వాటిని మెరుగుపరిచేందుకు ప్రజెంటేషన్లు, బ్రీఫింగ్లు ఇచ్చినట్లు అమెరికా వైమానిక దళం వెల్లడించింది. ఈ కీలక సమాచారాన్ని అందించినందుకు గాను గోవాడియా సుమారు 1,10,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.91 లక్షలు) అందుకున్నారని, ఆ డబ్బుతో హవాయిలోని తన విలాసవంతమైన ఇంటి తనఖాను చెల్లించారని నివేదికలు తెలిపాయి. జర్మనీ, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్లోని కొందరు వ్యక్తులకు కూడా గోవాడియా రహస్య డిజైన్ సమాచారాన్ని విక్రయించినట్లు ఆరోపణలున్నాయి.
2005లో గోవాడియా అరెస్టుతో సుదీర్ఘమైన విచారణ ప్రక్రియ మొదలైంది. 2010లో గూఢచర్యం, ఆయుధాల ఎగుమతి నియంత్రణ చట్టం ఉల్లంఘన సహా మొత్తం 17 ఫెడరల్ అభియోగాల్లో 14 అభియోగాల్లో ఆయన దోషిగా తేలారు. గోవాడియా చర్యల వల్ల అమెరికా జాతీయ భద్రతకు తీవ్ర విఘాతం కలిగిందని, అమెరికా సైనిక ఆధిపత్యానికి సవాలు విసిరేలా చైనాకు స్టెల్త్ టెక్నాలజీలు అందాయని ప్రాసిక్యూటర్లు వాదించారు.
గోవాడియా, 1968 నుంచి 1986 వరకు బీ-2 బాంబర్ల తయారీ సంస్థ నార్త్రప్ గ్రమ్మన్లో పనిచేశారు. ఆ తర్వాత కూడా కాంట్రాక్టర్గా వర్గీకృత ప్రభుత్వ పనులను కొనసాగించారు. అయితే, 1997లోనే ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేశారు. ఒకప్పుడు అమెరికా రక్షణ రంగానికి కీలక సేవలందించిన ఒక ప్రతిభావంతుడైన ఇంజనీర్, చివరికి ఆర్థిక ప్రలోభాలకు లొంగి దేశద్రోహిగా జైలు పాలుకావడం గమనార్హం.
ముంబైలో 1944లో జన్మించిన గోవాడియా, 1960లలో అమెరికాకు వలస వెళ్లి నార్త్రప్ గ్రమ్మన్ కార్పొరేషన్లో డిజైన్ ఇంజనీర్గా చేరారు. బి-2 స్పిరిట్ బాంబర్లను రాడార్లకు, ఇన్ఫ్రారెడ్ స్కానర్లకు, కంటికి కూడా అంత సులభంగా చిక్కకుండా చేసే సాంకేతికత అభివృద్ధిలో ఆయనది కీలక పాత్ర. ముఖ్యంగా, వినూత్నమైన ఎగ్జాస్ట్ ఆకృతులు, రాడార్ తరంగాలను శోషించుకునే పదార్థాల రూపకల్పనలో ఆయన ప్రతిభ కనబరిచారు.
అయితే, 2003 నుంచి 2005 మధ్య కాలంలో గోవాడియా పలుమార్లు చైనాలో పర్యటించి, అక్కడి ఏరోనాటికల్ టెస్టింగ్ కేంద్రంలో క్షిపణి ఎగ్జాస్ట్ వ్యవస్థ, దాని ఉష్ణ సంకేతాలకు (హీట్ సిగ్నేచర్) సంబంధించిన లోపాలను గుర్తించి, వాటిని మెరుగుపరిచేందుకు ప్రజెంటేషన్లు, బ్రీఫింగ్లు ఇచ్చినట్లు అమెరికా వైమానిక దళం వెల్లడించింది. ఈ కీలక సమాచారాన్ని అందించినందుకు గాను గోవాడియా సుమారు 1,10,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.91 లక్షలు) అందుకున్నారని, ఆ డబ్బుతో హవాయిలోని తన విలాసవంతమైన ఇంటి తనఖాను చెల్లించారని నివేదికలు తెలిపాయి. జర్మనీ, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్లోని కొందరు వ్యక్తులకు కూడా గోవాడియా రహస్య డిజైన్ సమాచారాన్ని విక్రయించినట్లు ఆరోపణలున్నాయి.
2005లో గోవాడియా అరెస్టుతో సుదీర్ఘమైన విచారణ ప్రక్రియ మొదలైంది. 2010లో గూఢచర్యం, ఆయుధాల ఎగుమతి నియంత్రణ చట్టం ఉల్లంఘన సహా మొత్తం 17 ఫెడరల్ అభియోగాల్లో 14 అభియోగాల్లో ఆయన దోషిగా తేలారు. గోవాడియా చర్యల వల్ల అమెరికా జాతీయ భద్రతకు తీవ్ర విఘాతం కలిగిందని, అమెరికా సైనిక ఆధిపత్యానికి సవాలు విసిరేలా చైనాకు స్టెల్త్ టెక్నాలజీలు అందాయని ప్రాసిక్యూటర్లు వాదించారు.
గోవాడియా, 1968 నుంచి 1986 వరకు బీ-2 బాంబర్ల తయారీ సంస్థ నార్త్రప్ గ్రమ్మన్లో పనిచేశారు. ఆ తర్వాత కూడా కాంట్రాక్టర్గా వర్గీకృత ప్రభుత్వ పనులను కొనసాగించారు. అయితే, 1997లోనే ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేశారు. ఒకప్పుడు అమెరికా రక్షణ రంగానికి కీలక సేవలందించిన ఒక ప్రతిభావంతుడైన ఇంజనీర్, చివరికి ఆర్థిక ప్రలోభాలకు లొంగి దేశద్రోహిగా జైలు పాలుకావడం గమనార్హం.