Microsoft: మైక్రోసాఫ్ట్లో మళ్లీ లేఆఫ్స్ కలకలం.. 18 నెలల్లో నాలుగో అతిపెద్ద తొలగింపునకు రంగం సిద్ధం

- టెక్ రంగంలో దిగ్గజ సంస్థ నుంచి ఉద్యోగులకు మరో షాక్
- ఇప్పటికే పలుమార్లు లేఆఫ్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్
- సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు గతంలోనే చెప్పిన టెక్ కంపెనీ
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. వచ్చే వారం మరికొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గత 18 నెలల కాలంలో మైక్రోసాఫ్ట్ చేపట్టనున్న నాలుగో అతిపెద్ద ఉద్యోగాల కోత ఇదే కావడం గమనార్హం. ఈ పరిణామం టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా అనేక టెక్ కంపెనీలు ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి నూతన సాంకేతికతలపై దృష్టి సారించడం వంటి కారణాలతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ కూడా పలుమార్లు లేఆఫ్స్ ప్రకటించింది. వచ్చే వారం మరికొందరిని తొలగించనుంది. అయితే ఈ తొలగింపులు ఏయే విభాగాల్లో ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ వార్తలతో మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వరుస లేఆఫ్ లతో ఉద్యోగ భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ తొలగింపులపై మైక్రోసాఫ్ట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో చేపట్టిన తొలగింపుల సమయంలో మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని కంపెనీ యాజమాన్యం వెల్లడించిన సంగతి తెలిసిందే.
గత కొంతకాలంగా అనేక టెక్ కంపెనీలు ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి నూతన సాంకేతికతలపై దృష్టి సారించడం వంటి కారణాలతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ కూడా పలుమార్లు లేఆఫ్స్ ప్రకటించింది. వచ్చే వారం మరికొందరిని తొలగించనుంది. అయితే ఈ తొలగింపులు ఏయే విభాగాల్లో ఉంటాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ వార్తలతో మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. వరుస లేఆఫ్ లతో ఉద్యోగ భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ తొలగింపులపై మైక్రోసాఫ్ట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో చేపట్టిన తొలగింపుల సమయంలో మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని కంపెనీ యాజమాన్యం వెల్లడించిన సంగతి తెలిసిందే.