Shubhanshu Shukla: నింగిలోకి వెళుతున్న శుభాంశు శుక్లా... స్పేస్ క్రాఫ్ట్ లోపల నుంచి తొలి ఫొటో ఇదిగో

- నలభై ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారతీయుడు
- రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయుడు
- యాక్సియమ్-4 మిషన్లో భాగంగా పక్షం రోజుల పాటు యాత్ర
భారతదేశ అంతరిక్ష యాత్ర చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించబడనుంది. సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం, భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. శుభాన్షు శుక్లా, మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి స్పేస్ఎక్స్ వ్యోమనౌకలో ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు అంతరిక్షయానం ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన తొలి దృశ్యాలు ఇప్పటికే టీవీ తెరలపై ప్రసారమవుతున్నాయి. వ్యోమనౌకలో పూర్తి సన్నద్ధతతో ఉన్న శుక్లా, ఇతర సిబ్బంది కనిపిస్తున్నారు.
ఈ ప్రయోగాన్ని అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి చేపట్టనున్నారు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపైకి వెళ్లిన అపోలో 11 మిషన్ను కూడా ఇదే ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించడం విశేషం. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్, క్రూ డ్రాగన్ వ్యోమనౌకను నింగిలోకి మోసుకెళ్లనుంది. 1984లో సోవియట్ యూనియన్ మిషన్లో భాగంగా వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత, ఆ ఘనత సాధించనున్న రెండో భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. భారత వాయుసేన పైలట్ అయిన శుక్లా, ఈ యాత్ర కోసం పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు నెలరోజులకు పైగా క్వారంటైన్లో ఉన్నారు.
యాక్సియమ్-4 మిషన్ గా పిలుస్తున్న ఈ యాత్రలో గ్రూప్ కెప్టెన్ శుక్లాతో పాటు పోలాండ్కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కి-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు మిషన్ స్పెషలిస్టులుగా వ్యవహరించనుండగా, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ కమాండర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ నలుగురు సభ్యుల బృందం తమ పక్షం రోజుల (రెండు వారాలు) యాత్రలో మొత్తం 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. వీటిలో ఏడు ప్రయోగాలను భారతీయ పరిశోధకులు ప్రతిపాదించడం గమనార్హం.
వాస్తవానికి ఈ యాక్సియమ్-4 ప్రయోగం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. వాతావరణ సమస్యలు, సాంకేతిక లోపాలు వంటి వివిధ కారణాల వల్ల ప్రయోగ తేదీలు ఆరు సార్లు వాయిదా పడ్డాయి. నాసా ప్రకటించిన ఆరవ వాయిదా అయిన జూన్ 25న (ఈరోజు) ఎట్టకేలకు ఈ ప్రయోగం జరగుతోంది.
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, గ్రూప్ కెప్టెన్ శుక్లా తన భావాలను పంచుకున్నారు. "నేను కేవలం పరికరాలను, ఉపకరణాలను మాత్రమే కాదు, వందకోట్ల మంది భారతీయుల ఆశలు, కలలను కూడా మోసుకెళ్తున్నాను" అని ఆయన అన్నారు. ఈ మాటలు భారత ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతున్నాయి.
ఈ ప్రయోగాన్ని అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి చేపట్టనున్నారు. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపైకి వెళ్లిన అపోలో 11 మిషన్ను కూడా ఇదే ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించడం విశేషం. స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్, క్రూ డ్రాగన్ వ్యోమనౌకను నింగిలోకి మోసుకెళ్లనుంది. 1984లో సోవియట్ యూనియన్ మిషన్లో భాగంగా వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత, ఆ ఘనత సాధించనున్న రెండో భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. భారత వాయుసేన పైలట్ అయిన శుక్లా, ఈ యాత్ర కోసం పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు నెలరోజులకు పైగా క్వారంటైన్లో ఉన్నారు.
యాక్సియమ్-4 మిషన్ గా పిలుస్తున్న ఈ యాత్రలో గ్రూప్ కెప్టెన్ శుక్లాతో పాటు పోలాండ్కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కి-విస్నివ్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కాపు మిషన్ స్పెషలిస్టులుగా వ్యవహరించనుండగా, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ కమాండర్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ నలుగురు సభ్యుల బృందం తమ పక్షం రోజుల (రెండు వారాలు) యాత్రలో మొత్తం 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. వీటిలో ఏడు ప్రయోగాలను భారతీయ పరిశోధకులు ప్రతిపాదించడం గమనార్హం.
వాస్తవానికి ఈ యాక్సియమ్-4 ప్రయోగం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. వాతావరణ సమస్యలు, సాంకేతిక లోపాలు వంటి వివిధ కారణాల వల్ల ప్రయోగ తేదీలు ఆరు సార్లు వాయిదా పడ్డాయి. నాసా ప్రకటించిన ఆరవ వాయిదా అయిన జూన్ 25న (ఈరోజు) ఎట్టకేలకు ఈ ప్రయోగం జరగుతోంది.
ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, గ్రూప్ కెప్టెన్ శుక్లా తన భావాలను పంచుకున్నారు. "నేను కేవలం పరికరాలను, ఉపకరణాలను మాత్రమే కాదు, వందకోట్ల మంది భారతీయుల ఆశలు, కలలను కూడా మోసుకెళ్తున్నాను" అని ఆయన అన్నారు. ఈ మాటలు భారత ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతున్నాయి.