Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ: ప్రపంచ సాంకేతిక పటంలో ఏపీకి కీలక స్థానం!

- అమరావతిని గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు
- జూన్ 30న విజయవాడలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జాతీయ వర్క్షాప్
- 2026 జనవరికి అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు లక్ష్యం
- ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యం
- దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటుకు ఐబీఎం సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని అంతర్జాతీయ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా క్వాంటం టెక్నాలజీలపై జాతీయ స్థాయి వర్క్షాప్ను అమరావతి క్వాంటం వ్యాలీ ఆధ్వర్యంలో నిర్వహించనుంది. ఈ నెల 30న విజయవాడలో జరగనున్న ఈ కీలక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. దీనికి సన్నాహకంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖ విజయవాడలో కర్టైన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీని పూర్తిస్థాయిలో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా క్వాంటం కంప్యూటింగ్, సంబంధిత టెక్నాలజీలలో భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ జాతీయ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఒక రోజు పాటు జరిగే ఈ సదస్సులో క్వాంటం హార్డ్వేర్తో పాటు ఇతర కీలక అంశాలపై నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి.
ఐబీఎం, టీసీఎస్, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, నీతి ఆయోగ్ అధికారులు, వివిధ ఐఐటీల ప్రొఫెసర్లు, నిపుణులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ప్లీనరీ సెషన్లలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం వ్యాలీ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి, "అమరావతి డిక్లరేషన్"ను అధికారికంగా విడుదల చేయనున్నారు. దీంతో పాటు క్వాంటం స్టార్టప్, క్వాంటం డిక్లరేషన్ పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరిస్తారు.
2026 జనవరికి అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం, ప్రఖ్యాత సంస్థలైన ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీలు అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో భాగంగా, ఐబీఎం సంస్థ దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను అమరావతిలో నెలకొల్పనుంది. రెండు 156 క్యూబిట్ క్వాంటం సిస్టంలను ఐబీఎం ఇక్కడ ఇన్స్టాల్ చేయనుంది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎల్ అండ్ టీ సంస్థ సమకూర్చనుంది. టీసీఎస్ సంస్థ క్వాంటం కంప్యూటింగ్ సేవలతో పాటు హైబ్రిడ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ను అందించనుంది. వైద్యారోగ్యం, ఆర్థిక, ఉత్పత్తి రంగాలతో పాటు అనేక ఇతర రంగాలకు ఈ క్వాంటం వ్యాలీ సేవలందించనుంది.
ఈ ప్రాజెక్టుపై ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ, "అమరావతిలో 2026 జనవరి నాటికి భారతదేశపు మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా విద్య, వైద్యారోగ్యం, ఫార్మా, అగ్రిటెక్, మెడ్టెక్ సంస్థలు ఈ వ్యాలీ సేవలను వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో లక్షల మంది ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. స్టార్టప్లతో పాటు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏపీ యువతకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నైపుణ్య శిక్షణ కూడా అందిస్తాం. క్వాంటం టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కేవలం అపోహ మాత్రమే. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ సెంటర్ పనిచేస్తుంది. క్వాంటం కంప్యూటింగ్ ఉత్పాదకతను పెంచి తద్వారా సంపద, సమృద్ధిని సాధించేందుకు దోహదపడుతుంది" అని తెలిపారు.
క్వాంటం విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందంజ
క్వాంటం టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న అన్నారు. సమీప భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీ ఊహించని వేగంతో జనజీవితంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
"క్వాంటం కంప్యూటింగ్ అత్యంత వేగంగా, కచ్చితత్వంతో కూడిన ఫలితాలను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు అత్యంత సురక్షితమైన క్వాంటం క్రిప్టోగ్రఫీ వైపు మళ్లుతున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రక్షణ రంగం, వైద్యారోగ్యం, విద్య వంటి అనేక రంగాల్లో క్వాంటం వినియోగం పెరుగుతోంది. నెలలు, సంవత్సరాలు పట్టే పరిశోధనా సమయం క్వాంటం టెక్నాలజీతో నిమిషాలు, గంటల్లోకి తగ్గిపోతుంది. రాష్ట్రంలోని యువత ఐటీ రంగంలో నిష్ణాతులు కాబట్టి, ఈ విప్లవాన్ని అందిపుచ్చుకుని నాయకత్వం వహించగల సత్తా ఏపీకి ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏపీ కీలక స్థానానికి చేరుతుంది. క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై దేశమంతా ఇప్పుడు ఏపీ వైపు, అమరావతి వైపు చూస్తోంది" అని ప్రద్యుమ్న వివరించారు.
దేశానికి దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ
విజయవాడలో జరిగిన కర్టైన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న క్వాంటం టెక్ నిపుణులు ఈ టెక్నాలజీ విద్య, వైద్యం, రక్షణ, ఫార్మా, ఉత్పాదక రంగాలకు అపార ప్రయోజనాలను చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. టీసీఎస్ సలహాదారు, నేషనల్ క్వాంటం మిషన్ సభ్యుడు ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్వాంటం కంప్యూటింగ్పై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఔషధాల ఆవిష్కరణ, ఈవీ బ్యాటరీలు, బిన్ ప్యాకింగ్, కార్గో డెలివరీ, రూట్ ఆప్టిమైజేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్ వంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని ఆయన సూచించారు. స్టాక్ మార్కెట్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కూడా ఇది విస్తృత సేవలు అందిస్తోందని, నేషనల్ క్వాంటం మిషన్లో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటవుతోందని, ఇది దేశానికి ఒక దిక్సూచిగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఐబీఎం డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్వాంటం కంప్యూటింగ్ వినియోగం, పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ తరుణంలో అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటు కీలక పరిణామమని అన్నారు. 2029 నాటికి "స్టార్లింగ్" అనే భారీస్థాయి క్వాంటం కంప్యూటింగ్ సిస్టమ్ను ఐబీఎం రూపొందిస్తోందని, దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఎల్టీఐ మైండ్ట్రీ లీడ్ విజయరావు మాట్లాడుతూ లాజిస్టిక్స్, సప్లై చైన్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్కేర్, రోబోటిక్స్ వంటి రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. రిస్క్ అనాలిసిస్, క్లైమేట్ చేంజ్, క్రిప్టోగ్రఫీ ఆప్టిమైజేషన్ వంటి అంశాలకు ఈ టెక్నాలజీ విస్తరిస్తోందని తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీ సెంటర్లో ఐబీఎం, టీసీఎస్ సంస్థలతో కలిసి ఎల్టీఐ మైండ్ట్రీ కూడా భాగస్వామ్యం వహిస్తుందని ఆయన వెల్లడించారు.
2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీని పూర్తిస్థాయిలో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా క్వాంటం కంప్యూటింగ్, సంబంధిత టెక్నాలజీలలో భాగస్వాములందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ జాతీయ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఒక రోజు పాటు జరిగే ఈ సదస్సులో క్వాంటం హార్డ్వేర్తో పాటు ఇతర కీలక అంశాలపై నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి.
ఐబీఎం, టీసీఎస్, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు, నీతి ఆయోగ్ అధికారులు, వివిధ ఐఐటీల ప్రొఫెసర్లు, నిపుణులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ప్లీనరీ సెషన్లలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటం వ్యాలీ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి, "అమరావతి డిక్లరేషన్"ను అధికారికంగా విడుదల చేయనున్నారు. దీంతో పాటు క్వాంటం స్టార్టప్, క్వాంటం డిక్లరేషన్ పుస్తకాన్ని కూడా సీఎం ఆవిష్కరిస్తారు.
2026 జనవరికి అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం, ప్రఖ్యాత సంస్థలైన ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీలు అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో భాగంగా, ఐబీఎం సంస్థ దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను అమరావతిలో నెలకొల్పనుంది. రెండు 156 క్యూబిట్ క్వాంటం సిస్టంలను ఐబీఎం ఇక్కడ ఇన్స్టాల్ చేయనుంది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎల్ అండ్ టీ సంస్థ సమకూర్చనుంది. టీసీఎస్ సంస్థ క్వాంటం కంప్యూటింగ్ సేవలతో పాటు హైబ్రిడ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ను అందించనుంది. వైద్యారోగ్యం, ఆర్థిక, ఉత్పత్తి రంగాలతో పాటు అనేక ఇతర రంగాలకు ఈ క్వాంటం వ్యాలీ సేవలందించనుంది.
ఈ ప్రాజెక్టుపై ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ, "అమరావతిలో 2026 జనవరి నాటికి భారతదేశపు మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా విద్య, వైద్యారోగ్యం, ఫార్మా, అగ్రిటెక్, మెడ్టెక్ సంస్థలు ఈ వ్యాలీ సేవలను వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో లక్షల మంది ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. స్టార్టప్లతో పాటు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏపీ యువతకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నైపుణ్య శిక్షణ కూడా అందిస్తాం. క్వాంటం టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కేవలం అపోహ మాత్రమే. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ సెంటర్ పనిచేస్తుంది. క్వాంటం కంప్యూటింగ్ ఉత్పాదకతను పెంచి తద్వారా సంపద, సమృద్ధిని సాధించేందుకు దోహదపడుతుంది" అని తెలిపారు.
క్వాంటం విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందంజ
క్వాంటం టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునే తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న అన్నారు. సమీప భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీ ఊహించని వేగంతో జనజీవితంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
"క్వాంటం కంప్యూటింగ్ అత్యంత వేగంగా, కచ్చితత్వంతో కూడిన ఫలితాలను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు అత్యంత సురక్షితమైన క్వాంటం క్రిప్టోగ్రఫీ వైపు మళ్లుతున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రక్షణ రంగం, వైద్యారోగ్యం, విద్య వంటి అనేక రంగాల్లో క్వాంటం వినియోగం పెరుగుతోంది. నెలలు, సంవత్సరాలు పట్టే పరిశోధనా సమయం క్వాంటం టెక్నాలజీతో నిమిషాలు, గంటల్లోకి తగ్గిపోతుంది. రాష్ట్రంలోని యువత ఐటీ రంగంలో నిష్ణాతులు కాబట్టి, ఈ విప్లవాన్ని అందిపుచ్చుకుని నాయకత్వం వహించగల సత్తా ఏపీకి ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏపీ కీలక స్థానానికి చేరుతుంది. క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై దేశమంతా ఇప్పుడు ఏపీ వైపు, అమరావతి వైపు చూస్తోంది" అని ప్రద్యుమ్న వివరించారు.
దేశానికి దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ
విజయవాడలో జరిగిన కర్టైన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న క్వాంటం టెక్ నిపుణులు ఈ టెక్నాలజీ విద్య, వైద్యం, రక్షణ, ఫార్మా, ఉత్పాదక రంగాలకు అపార ప్రయోజనాలను చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. టీసీఎస్ సలహాదారు, నేషనల్ క్వాంటం మిషన్ సభ్యుడు ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్వాంటం కంప్యూటింగ్పై పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఔషధాల ఆవిష్కరణ, ఈవీ బ్యాటరీలు, బిన్ ప్యాకింగ్, కార్గో డెలివరీ, రూట్ ఆప్టిమైజేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్ వంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని ఆయన సూచించారు. స్టాక్ మార్కెట్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కూడా ఇది విస్తృత సేవలు అందిస్తోందని, నేషనల్ క్వాంటం మిషన్లో భాగంగా అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటవుతోందని, ఇది దేశానికి ఒక దిక్సూచిగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఐబీఎం డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్వాంటం కంప్యూటింగ్ వినియోగం, పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ తరుణంలో అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటు కీలక పరిణామమని అన్నారు. 2029 నాటికి "స్టార్లింగ్" అనే భారీస్థాయి క్వాంటం కంప్యూటింగ్ సిస్టమ్ను ఐబీఎం రూపొందిస్తోందని, దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఎల్టీఐ మైండ్ట్రీ లీడ్ విజయరావు మాట్లాడుతూ లాజిస్టిక్స్, సప్లై చైన్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్కేర్, రోబోటిక్స్ వంటి రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. రిస్క్ అనాలిసిస్, క్లైమేట్ చేంజ్, క్రిప్టోగ్రఫీ ఆప్టిమైజేషన్ వంటి అంశాలకు ఈ టెక్నాలజీ విస్తరిస్తోందని తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీ సెంటర్లో ఐబీఎం, టీసీఎస్ సంస్థలతో కలిసి ఎల్టీఐ మైండ్ట్రీ కూడా భాగస్వామ్యం వహిస్తుందని ఆయన వెల్లడించారు.