Tirumala Laddu: కల్తీ నెయ్యి కేసు.. 'దృశ్యం' సినిమాను తలపించేలా స్కెచ్ వేశారని కోర్టుకు తెలిపిన సిట్

- ఖాళీ లారీలు తిప్పి నెయ్యి సరఫరా చేసినట్లు నమ్మించే ప్రయత్నం
- రూ. 146 కోట్లకు పైగా విలువైన నకిలీ ఇన్వాయిస్ల సృష్టి
- భోలేబాబా డెయిరీ నుంచి హవాలా మార్గంలో డబ్బు వెనక్కి
- సాక్ష్యాలు దొరక్కుండా సెల్ఫోన్ను ధ్వంసం చేసిన నిందితుడు
- ‘దృశ్యం’ సినిమాను మించిన స్కెచ్ వేశారన్న సిట్
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు ఆశిష్ అగర్వాల్కు (ఏ15) మరోసారి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను నెల్లూరు ఏసీబీ కోర్టు శుక్రవారం రెండోసారి కొట్టివేసింది. కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పకడ్బందీ వాదనలు వినిపించడంతో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
ఖాళీ లారీలతో నాటకం.. నకిలీ ఇన్వాయిస్లతో మోసం
సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ కోర్టు ముందు బలమైన వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లకు ఆశిష్ అగర్వాల్ అత్యంత సన్నిహితుడని తెలిపారు. అసలు నెయ్యి సరఫరా చేయకుండానే సరఫరా చేసినట్లు నమ్మించడానికి ఆశిష్ పక్కా ప్రణాళికతో వ్యవహరించారని వివరించారు. రాజస్థాన్లోని బీకానేర్, ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని రూర్కీకి ఖాళీ లారీలను తిప్పుతూ తన కంపెనీల నుంచి నెయ్యి రవాణా అయినట్లు రికార్డులు సృష్టించారని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం ‘దృశ్యం’ సినిమాను తలపించేలా ఉందని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.
అంతేకాకుండా తనకు చెందిన అగర్వాల్ ట్రేడింగ్ కంపెనీ, సుప్రీం, సుప్రీం ఇంక్, అగర్వాల్ అండ్ అగర్వాల్ సన్స్ వంటి పలు సంస్థల పేరుతో ఏకంగా రూ. 146 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లను ఆశిష్ సృష్టించారని సిట్ ఆరోపించింది. ఈ నకిలీ ఇన్వాయిస్లను అడ్డం పెట్టుకుని తాము నిజంగానే నెయ్యి కొనుగోలు చేశామని భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు అధికారులను తప్పుదోవ పట్టించారని వాదించారు. ఏడాదికి రెండుసార్లు జరిగే ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ నకిలీ పత్రాలనే ఉపయోగించుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
హవాలా మార్గంలో డబ్బు వెనక్కి
ఈ మోసపూరిత వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు కూడా పక్కా ప్లాన్తో జరిగినట్లు సిట్ వెల్లడించింది. నకిలీ ఇన్వాయిస్లలో పేర్కొన్న కంపెనీలకు భోలేబాబా డెయిరీ నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బు పంపారని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని హవాలా మార్గంలో తిరిగి ప్రధాన సూత్రధారులకే చేర్చారని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో సహకరించినందుకు ఆశిష్ అగర్వాల్కు 2 నుంచి 3 శాతం కమీషన్ ముట్టిందని ప్రాసిక్యూటర్ వివరించారు.
తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, విజయవాడ, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలకు సరఫరా అవుతున్నది కల్తీ నెయ్యి అని తెలిసినప్పటికీ ఆశిష్ ఈ కుట్రలో పూర్తిగా సహకరించారని సిట్ ఆరోపించింది. కుట్ర బయటపడకుండా ఉండేందుకు తన సెల్ఫోన్ను కూడా ధ్వంసం చేశాడని పేర్కొంది. ఇలాంటి కీలక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిట్ తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఆశిష్ అగర్వాల్ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న ఈ పిటిషన్పై వాదనలు ముగియగా, శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.
ఖాళీ లారీలతో నాటకం.. నకిలీ ఇన్వాయిస్లతో మోసం
సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ కోర్టు ముందు బలమైన వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లకు ఆశిష్ అగర్వాల్ అత్యంత సన్నిహితుడని తెలిపారు. అసలు నెయ్యి సరఫరా చేయకుండానే సరఫరా చేసినట్లు నమ్మించడానికి ఆశిష్ పక్కా ప్రణాళికతో వ్యవహరించారని వివరించారు. రాజస్థాన్లోని బీకానేర్, ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని రూర్కీకి ఖాళీ లారీలను తిప్పుతూ తన కంపెనీల నుంచి నెయ్యి రవాణా అయినట్లు రికార్డులు సృష్టించారని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం ‘దృశ్యం’ సినిమాను తలపించేలా ఉందని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.
అంతేకాకుండా తనకు చెందిన అగర్వాల్ ట్రేడింగ్ కంపెనీ, సుప్రీం, సుప్రీం ఇంక్, అగర్వాల్ అండ్ అగర్వాల్ సన్స్ వంటి పలు సంస్థల పేరుతో ఏకంగా రూ. 146 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్లను ఆశిష్ సృష్టించారని సిట్ ఆరోపించింది. ఈ నకిలీ ఇన్వాయిస్లను అడ్డం పెట్టుకుని తాము నిజంగానే నెయ్యి కొనుగోలు చేశామని భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు అధికారులను తప్పుదోవ పట్టించారని వాదించారు. ఏడాదికి రెండుసార్లు జరిగే ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ నకిలీ పత్రాలనే ఉపయోగించుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
హవాలా మార్గంలో డబ్బు వెనక్కి
ఈ మోసపూరిత వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు కూడా పక్కా ప్లాన్తో జరిగినట్లు సిట్ వెల్లడించింది. నకిలీ ఇన్వాయిస్లలో పేర్కొన్న కంపెనీలకు భోలేబాబా డెయిరీ నుంచి ఆన్లైన్ ద్వారా డబ్బు పంపారని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని హవాలా మార్గంలో తిరిగి ప్రధాన సూత్రధారులకే చేర్చారని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియలో సహకరించినందుకు ఆశిష్ అగర్వాల్కు 2 నుంచి 3 శాతం కమీషన్ ముట్టిందని ప్రాసిక్యూటర్ వివరించారు.
తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, విజయవాడ, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలకు సరఫరా అవుతున్నది కల్తీ నెయ్యి అని తెలిసినప్పటికీ ఆశిష్ ఈ కుట్రలో పూర్తిగా సహకరించారని సిట్ ఆరోపించింది. కుట్ర బయటపడకుండా ఉండేందుకు తన సెల్ఫోన్ను కూడా ధ్వంసం చేశాడని పేర్కొంది. ఇలాంటి కీలక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిట్ తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఆశిష్ అగర్వాల్ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న ఈ పిటిషన్పై వాదనలు ముగియగా, శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.