Sandeepan Bhumre: డ్రైవర్కు రూ. 150 కోట్ల విలువైన భూమి దానం.. శివసేన ఎంపీ చుట్టూ వివాదం

- హైదరాబాద్ నిజాం దివాన్ల వారసుల నుంచి కానుకగా 3 ఎకరాల స్థలం
- బహుమతి దస్తావేజుపై అనుమానంతో న్యాయవాది ఫిర్యాదు
- భూ బదిలీపై ఆర్థిక నేరాల విభాగం ప్రాథమిక విచారణ
- నిజాం వారసులతో పాటు సంబంధిత వ్యక్తులకు పోలీసుల సమన్లు
శివసేన ఎంపీ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తికి దాదాపు రూ. 150 కోట్ల విలువైన భూమి బహుమతిగా రావడం మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నిజాం కాలంలో దివాన్లుగా పనిచేసిన సాలార్ జంగ్ కుటుంబ వారసులు ఈ భారీ కానుకను ఇవ్వడం, దీనిపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఛత్రపతి శంభాజీ నగర్ (గతంలో ఔరంగాబాద్) పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ ప్రారంభించింది.
శివసేన ఎంపీ సందీపన్ భుమ్రే, ఆయన కుమారుడు, పైఠాన్ ఎమ్మెల్యే విలాస్ భుమ్రే వద్ద గత 13 ఏళ్లుగా జావేద్ రసూల్ షేక్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఛత్రపతి శంభాజీ నగర్లోని అత్యంత విలువైన 3 ఎకరాల భూమిని జావేద్ షేక్ పేరిట బదిలీ చేశారు. ఈ భూమిని సాలార్ జంగ్ కుటుంబానికి చెందిన మీర్ మహమూద్ అలీ మజార్ అలీ ఖాన్ మరో ఐదుగురు వారసులు కలిసి 'హిబానామా' (బహుమతి దస్తావేజు) ద్వారా షేక్కు అప్పగించారు. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించి షేక్ను యజమానిగా పేర్కొంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
ఈ భూ బదిలీపై అడ్వకేట్ ముజాహిద్ ఖాన్ అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాలార్ జంగ్ వారసులు ఈ భూమి కోసం చాలాకాలం న్యాయపోరాటం చేసి, 2022లో తమకు అనుకూలంగా తీర్పు పొందారని ఆయన గుర్తుచేశారు. "ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేసి గెలుచుకున్న భూమిని, ఎలాంటి రక్త సంబంధం లేని షేక్కు సాలార్ జంగ్ కుటుంబం ఎందుకు బహుమతిగా ఇస్తుంది?" అని ఆయన తన ఫిర్యాదులో ప్రశ్నించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈవోడబ్ల్యూ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ విషయంపై పోలీసులు తనను సంప్రదించినట్లు ఎమ్మెల్యే విలాస్ భుమ్రే అంగీకరించారు. "షేక్ మా కుటుంబంతో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని పోలీసులు ఫోన్ చేసి అడిగారు" అని తెలిపారు. రాజకుటుంబం నుంచి భూమి బదిలీ గురించి ప్రశ్నించగా "దాని గురించి నాకు పూర్తి వివరాలు తెలియవు" అని ఆయన బదులిచ్చారు. మరోవైపు, సాలార్ జంగ్ కుటుంబ సభ్యులతో తనకు మంచి పరిచయం ఉండటం వల్లే వారు భూమిని బహుమతిగా ఇచ్చారని షేక్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.
ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని ఛత్రపతి శంభాజీ నగర్ సీనియర్ పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. హిబానామాపై సంతకాలు చేసిన సాలార్ జంగ్ కుటుంబ సభ్యులతో సహా సంబంధిత పార్టీలకు సమన్లు జారీ చేసినట్లు వారు తెలిపారు. భూ బదిలీ పత్రాలను, డ్రైవర్కు, రాజకుటుంబ వారసులకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
శివసేన ఎంపీ సందీపన్ భుమ్రే, ఆయన కుమారుడు, పైఠాన్ ఎమ్మెల్యే విలాస్ భుమ్రే వద్ద గత 13 ఏళ్లుగా జావేద్ రసూల్ షేక్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఛత్రపతి శంభాజీ నగర్లోని అత్యంత విలువైన 3 ఎకరాల భూమిని జావేద్ షేక్ పేరిట బదిలీ చేశారు. ఈ భూమిని సాలార్ జంగ్ కుటుంబానికి చెందిన మీర్ మహమూద్ అలీ మజార్ అలీ ఖాన్ మరో ఐదుగురు వారసులు కలిసి 'హిబానామా' (బహుమతి దస్తావేజు) ద్వారా షేక్కు అప్పగించారు. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించి షేక్ను యజమానిగా పేర్కొంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.
ఈ భూ బదిలీపై అడ్వకేట్ ముజాహిద్ ఖాన్ అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాలార్ జంగ్ వారసులు ఈ భూమి కోసం చాలాకాలం న్యాయపోరాటం చేసి, 2022లో తమకు అనుకూలంగా తీర్పు పొందారని ఆయన గుర్తుచేశారు. "ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేసి గెలుచుకున్న భూమిని, ఎలాంటి రక్త సంబంధం లేని షేక్కు సాలార్ జంగ్ కుటుంబం ఎందుకు బహుమతిగా ఇస్తుంది?" అని ఆయన తన ఫిర్యాదులో ప్రశ్నించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈవోడబ్ల్యూ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ విషయంపై పోలీసులు తనను సంప్రదించినట్లు ఎమ్మెల్యే విలాస్ భుమ్రే అంగీకరించారు. "షేక్ మా కుటుంబంతో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని పోలీసులు ఫోన్ చేసి అడిగారు" అని తెలిపారు. రాజకుటుంబం నుంచి భూమి బదిలీ గురించి ప్రశ్నించగా "దాని గురించి నాకు పూర్తి వివరాలు తెలియవు" అని ఆయన బదులిచ్చారు. మరోవైపు, సాలార్ జంగ్ కుటుంబ సభ్యులతో తనకు మంచి పరిచయం ఉండటం వల్లే వారు భూమిని బహుమతిగా ఇచ్చారని షేక్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం.
ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని ఛత్రపతి శంభాజీ నగర్ సీనియర్ పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. హిబానామాపై సంతకాలు చేసిన సాలార్ జంగ్ కుటుంబ సభ్యులతో సహా సంబంధిత పార్టీలకు సమన్లు జారీ చేసినట్లు వారు తెలిపారు. భూ బదిలీ పత్రాలను, డ్రైవర్కు, రాజకుటుంబ వారసులకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.