Manojit Mishra: కోల్కతా గ్యాంగ్రేప్: ప్రధాన నిందితుడు ఓ సైకో.. ఏళ్లుగా అమ్మాయిలకు నరకం!

- కోల్కతా లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
- ప్రధాన నిందితుడు మనోజిత్కు నేరచరిత్ర.. గతంలోనే పలు ఫిర్యాదులు
- ఫిర్యాదులను పట్టించుకోకుండా నిందితుడిని కాపాడిన కాలేజీ!
- నలుగురు నిందితుల అరెస్ట్.. జులై 1 వరకు పోలీస్ కస్టడీ
- సీసీటీవీ ఫుటేజ్, హాకీ స్టిక్ స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం
పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్న కోల్కతా లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడి వికృత ప్రవర్తన గురించి కాలేజీ యాజమాన్యానికి తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తోటి విద్యార్థులు, జూనియర్లు ఆరోపిస్తున్నారు.
ఏళ్లుగా అరాచకం.. పట్టించుకోని యాజమాన్యం
సౌత్ కలకత్తా లా కాలేజీలో చదువుతున్న 24 ఏళ్ల యువతిపై జూన్ 25న అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి అనుచరులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారిని జులై 1 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. మనోజిత్ మిశ్రాకు నేర చరిత్ర ఉందని, విద్యార్థినులను వేధించడంలో అతడు ముందుండేవాడని తెలుస్తోంది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపడం, మహిళలతో ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో తీసి షేర్ చేయడం, విద్యార్థినులను బాడీ షేమింగ్ చేయడం వంటివి అతనికి అలవాటని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి.
అతడిపై గతంలో లైంగిక వేధింపులు, దాడులు, బెదిరింపులకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చినా కాలేజీ యాజమాన్యం వాటిని పెడచెవిన పెట్టిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. "అతను, అతని అనుచరులు అమ్మాయిల పాలిట ఉగ్రవాదుల్లా ఉండేవారు. ఈ విషయం అధికారులకు తెలిసినా అతడిని కాపాడారు. లైంగిక వేధింపులపై టీచర్-ఇన్-ఛార్జ్కు అధికారికంగా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది" అని ఓ థర్డ్ ఇయర్ విద్యార్థిని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు వివరించింది. యూనియన్ సభ్యులకు ఏదైనా చేసే లైసెన్స్ ఉండేదని, భయంతో తాము మౌనంగా ఉండాల్సి వచ్చేదని మరో జూనియర్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది.
కీలక ఆధారాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం
ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బాధితురాలి ఆరోపణలకు బలం చేకూర్చేలా సీసీటీవీ ఫుటేజ్ లభించిందని, దానిని పరిశీలిస్తున్నామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. నిందితులు, సెక్యూరిటీ గార్డు, బాధితురాలి కదలికలు ఫుటేజ్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయని చెప్పారు.
ఘటనా స్థలంలో మూడు చోట్ల పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. స్టూడెంట్స్ యూనియన్ రూమ్, వాష్రూమ్, గార్డు రూమ్లలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని అధికారి పేర్కొన్నారు. అక్కడ లభించిన వెంట్రుకలు, గుర్తు తెలియని ద్రవాలు ఉన్న కొన్ని బాటిళ్లు, ఒక హాకీ స్టిక్ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు.
రాజకీయ దుమారం.. బీజేపీ నేతల అరెస్ట్
పది నెలల క్రితం జరిగిన ఆర్జీకర్ ఆసుపత్రి అత్యాచారం, హత్య ఘటన మరవకముందే ఈ అఘాయిత్యం జరగడంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనకు నిరసనగా కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు లా కాలేజీ వైపు నిరసన ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించాయి. అయితే, పోలీసులు వారిని గరియాహత్ క్రాసింగ్ వద్ద అడ్డుకుని, మజుందార్తో పాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోల్కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ అయిన లాల్బజార్కు తరలించినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఏళ్లుగా అరాచకం.. పట్టించుకోని యాజమాన్యం
సౌత్ కలకత్తా లా కాలేజీలో చదువుతున్న 24 ఏళ్ల యువతిపై జూన్ 25న అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి అనుచరులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారిని జులై 1 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. మనోజిత్ మిశ్రాకు నేర చరిత్ర ఉందని, విద్యార్థినులను వేధించడంలో అతడు ముందుండేవాడని తెలుస్తోంది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపడం, మహిళలతో ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో తీసి షేర్ చేయడం, విద్యార్థినులను బాడీ షేమింగ్ చేయడం వంటివి అతనికి అలవాటని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి.
అతడిపై గతంలో లైంగిక వేధింపులు, దాడులు, బెదిరింపులకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చినా కాలేజీ యాజమాన్యం వాటిని పెడచెవిన పెట్టిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. "అతను, అతని అనుచరులు అమ్మాయిల పాలిట ఉగ్రవాదుల్లా ఉండేవారు. ఈ విషయం అధికారులకు తెలిసినా అతడిని కాపాడారు. లైంగిక వేధింపులపై టీచర్-ఇన్-ఛార్జ్కు అధికారికంగా ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది" అని ఓ థర్డ్ ఇయర్ విద్యార్థిని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు వివరించింది. యూనియన్ సభ్యులకు ఏదైనా చేసే లైసెన్స్ ఉండేదని, భయంతో తాము మౌనంగా ఉండాల్సి వచ్చేదని మరో జూనియర్ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది.
కీలక ఆధారాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం
ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బాధితురాలి ఆరోపణలకు బలం చేకూర్చేలా సీసీటీవీ ఫుటేజ్ లభించిందని, దానిని పరిశీలిస్తున్నామని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. నిందితులు, సెక్యూరిటీ గార్డు, బాధితురాలి కదలికలు ఫుటేజ్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయని చెప్పారు.
ఘటనా స్థలంలో మూడు చోట్ల పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. స్టూడెంట్స్ యూనియన్ రూమ్, వాష్రూమ్, గార్డు రూమ్లలో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని అధికారి పేర్కొన్నారు. అక్కడ లభించిన వెంట్రుకలు, గుర్తు తెలియని ద్రవాలు ఉన్న కొన్ని బాటిళ్లు, ఒక హాకీ స్టిక్ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు.
రాజకీయ దుమారం.. బీజేపీ నేతల అరెస్ట్
పది నెలల క్రితం జరిగిన ఆర్జీకర్ ఆసుపత్రి అత్యాచారం, హత్య ఘటన మరవకముందే ఈ అఘాయిత్యం జరగడంతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనకు నిరసనగా కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు లా కాలేజీ వైపు నిరసన ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించాయి. అయితే, పోలీసులు వారిని గరియాహత్ క్రాసింగ్ వద్ద అడ్డుకుని, మజుందార్తో పాటు పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోల్కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ అయిన లాల్బజార్కు తరలించినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.