INS Tabar: అరేబియా సముద్రంలో ఆయిల్ ట్యాంకర్కు మంటలు.. 14 మంది భారతీయులను కాపాడిన నేవీ

- సహాయం కోసం ఆపద సంకేతాలు జారీ చేసిన ట్యాంకర్
- వెంటనే స్పందించి రంగంలోకి దిగిన ఐఎన్ఎస్ తబార్ యుద్ధనౌక
- హెలికాప్టర్, బోట్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చిన నేవీ
- పెను ప్రమాదం నుంచి సిబ్బందిని సురక్షితంగా కాపాడిన నౌకాదళం
అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారత నౌకాదళం తక్షణమే స్పందించి పెను ప్రమాదాన్ని నివారించింది. నౌకలో చిక్కుకున్న 14 మంది భారతీయ సిబ్బందిని రక్షించేందుకు ఐఎన్ఎస్ తబార్ యుద్ధనౌక సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించింది.
పలావు దేశానికి చెందిన ‘ఎం.టి. యి చెంగ్ 6’ అనే ఆయిల్ ట్యాంకర్ 14 మంది భారతీయ సిబ్బందితో గుజరాత్లోని కాండ్లా ఓడరేవు నుంచి ఒమన్లోని షినాస్కు బయల్దేరింది. మార్గమధ్యంలో ఆదివారం ట్యాంకర్ ఇంజిన్ రూములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నౌకలోని విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో నిస్సహాయ స్థితిలో సముద్రంలో చిక్కుకుపోయింది. వెంటనే, నౌక సిబ్బంది సహాయం కోసం ఆపద సంకేతాలను (డిస్ట్రెస్ కాల్) పంపారు.
ఈ సమాచారం అందిన వెంటనే సమీపంలో గస్తీ కాస్తున్న భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ తబార్ స్టెల్త్ యుద్ధనౌక హుటాహుటిన రంగంలోకి దిగింది. తమ వద్ద ఉన్న అగ్నిమాపక బృందాన్ని, ప్రత్యేక పరికరాలను ఒక బోటు, హెలికాప్టర్ సహాయంతో ప్రమాదానికి గురైన ట్యాంకర్ వద్దకు తరలించింది.
నౌకాదళానికి చెందిన 13 మంది సిబ్బంది, ట్యాంకర్లోని ఐదుగురు సిబ్బందితో కలిసి సమన్వయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. వారి సమష్టి కృషితో మంటలు అదుపులోకి వచ్చాయి. భారత నౌకాదళం సరైన సమయంలో స్పందించడంతో సిబ్బంది ప్రాణాలకు ముప్పు తప్పింది.
పలావు దేశానికి చెందిన ‘ఎం.టి. యి చెంగ్ 6’ అనే ఆయిల్ ట్యాంకర్ 14 మంది భారతీయ సిబ్బందితో గుజరాత్లోని కాండ్లా ఓడరేవు నుంచి ఒమన్లోని షినాస్కు బయల్దేరింది. మార్గమధ్యంలో ఆదివారం ట్యాంకర్ ఇంజిన్ రూములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో నౌకలోని విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో నిస్సహాయ స్థితిలో సముద్రంలో చిక్కుకుపోయింది. వెంటనే, నౌక సిబ్బంది సహాయం కోసం ఆపద సంకేతాలను (డిస్ట్రెస్ కాల్) పంపారు.
ఈ సమాచారం అందిన వెంటనే సమీపంలో గస్తీ కాస్తున్న భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ తబార్ స్టెల్త్ యుద్ధనౌక హుటాహుటిన రంగంలోకి దిగింది. తమ వద్ద ఉన్న అగ్నిమాపక బృందాన్ని, ప్రత్యేక పరికరాలను ఒక బోటు, హెలికాప్టర్ సహాయంతో ప్రమాదానికి గురైన ట్యాంకర్ వద్దకు తరలించింది.
నౌకాదళానికి చెందిన 13 మంది సిబ్బంది, ట్యాంకర్లోని ఐదుగురు సిబ్బందితో కలిసి సమన్వయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. వారి సమష్టి కృషితో మంటలు అదుపులోకి వచ్చాయి. భారత నౌకాదళం సరైన సమయంలో స్పందించడంతో సిబ్బంది ప్రాణాలకు ముప్పు తప్పింది.