Madhya Pradesh: ఆసుపత్రిలో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగా యువతి గొంతు కోసి చంపిన ఉన్మాది!

- మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య
- అందరూ చూస్తుండగానే 19 ఏళ్ల విద్యార్థిని గొంతు కోసిన ఉన్మాది
- దాడిని అడ్డుకోకుండా చూస్తూ ఉండిపోయిన ఆసుపత్రి సిబ్బంది, జనం
- హత్య తర్వాత పారిపోయిన నిందితుడు అభిషేక్ కోష్టి
- భయంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయిన రోగులు
వైద్యం అందించి ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రే ఓ యువతి పాలిట మృత్యుశాలగా మారింది. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఓ ఉన్మాది 19 ఏళ్ల యువతిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు అక్కడే ఉన్నా.. ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... నర్సింగ్పూర్కు చెందిన 19 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఈ నెల 27న ఆసుపత్రికి వచ్చింది. ప్రసూతి వార్డులో ఉన్న స్నేహితురాలి బంధువును చూసేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయలుదేరింది. అయితే, ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న అభిషేక్ కోష్టి అనే యువకుడు అప్పటికే ఆసుపత్రి వద్ద ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. వార్డు నంబర్ 22 బయట ఆమెతో కొద్దిసేపు మాట్లాడిన అభిషేక్, ఒక్కసారిగా యువతిపై దాడికి దిగాడు.
సోమవారం వెలుగులోకి వచ్చిన మొబైల్ వీడియో ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. నల్ల చొక్కా ధరించిన అభిషేక్, యువతిని చెంపపై కొట్టి కిందపడేశాడు. ఆమె ఛాతీపై కూర్చుని, తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోసేశాడు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ ఘోరం జరుగుతున్నా అక్కడున్న వైద్యులు, నర్సులు, వార్డు బాయ్లు, ఇతర ప్రజలు నిలువరించే ప్రయత్నం చేయకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. తీవ్ర రక్తస్రావంతో విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
భద్రతా వైఫల్యం.. భయంతో రోగులు పరార్
దాడి జరిగిన సమయంలో ట్రామా సెంటర్ బయట ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. లోపల వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. అయినా ఎవరూ స్పందించలేదు. హత్య చేసిన తర్వాత నిందితుడు అభిషేక్ తన గొంతు కోసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బయటకు వచ్చి, పార్క్ చేసి ఉన్న బైక్పై పరారయ్యాడు.
ఈ ఘటనతో ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ట్రామా వార్డులో చికిత్స పొందుతున్న 11 మంది రోగులలో ఎనిమిది మంది అదే రోజు డిశ్చార్జ్ తీసుకుని వెళ్లిపోగా, మిగిలిన వారు మరుసటి రోజు ఉదయం ఆసుపత్రిని ఖాళీ చేశారు.
మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. వారు వచ్చేసరికి కూడా సంధ్య మృతదేహం ఘటనా స్థలంలోనే పడి ఉంది. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఉన్నతాధికారులు కలుగజేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాత్రి 10:30 గంటలకు ఆందోళన విరమించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... నర్సింగ్పూర్కు చెందిన 19 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఈ నెల 27న ఆసుపత్రికి వచ్చింది. ప్రసూతి వార్డులో ఉన్న స్నేహితురాలి బంధువును చూసేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయలుదేరింది. అయితే, ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న అభిషేక్ కోష్టి అనే యువకుడు అప్పటికే ఆసుపత్రి వద్ద ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. వార్డు నంబర్ 22 బయట ఆమెతో కొద్దిసేపు మాట్లాడిన అభిషేక్, ఒక్కసారిగా యువతిపై దాడికి దిగాడు.
సోమవారం వెలుగులోకి వచ్చిన మొబైల్ వీడియో ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. నల్ల చొక్కా ధరించిన అభిషేక్, యువతిని చెంపపై కొట్టి కిందపడేశాడు. ఆమె ఛాతీపై కూర్చుని, తనతో తెచ్చుకున్న కత్తితో గొంతు కోసేశాడు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ ఘోరం జరుగుతున్నా అక్కడున్న వైద్యులు, నర్సులు, వార్డు బాయ్లు, ఇతర ప్రజలు నిలువరించే ప్రయత్నం చేయకుండా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. తీవ్ర రక్తస్రావంతో విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
భద్రతా వైఫల్యం.. భయంతో రోగులు పరార్
దాడి జరిగిన సమయంలో ట్రామా సెంటర్ బయట ఇద్దరు సెక్యూరిటీ గార్డులు విధుల్లో ఉన్నారు. లోపల వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. అయినా ఎవరూ స్పందించలేదు. హత్య చేసిన తర్వాత నిందితుడు అభిషేక్ తన గొంతు కోసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా బయటకు వచ్చి, పార్క్ చేసి ఉన్న బైక్పై పరారయ్యాడు.
ఈ ఘటనతో ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ట్రామా వార్డులో చికిత్స పొందుతున్న 11 మంది రోగులలో ఎనిమిది మంది అదే రోజు డిశ్చార్జ్ తీసుకుని వెళ్లిపోగా, మిగిలిన వారు మరుసటి రోజు ఉదయం ఆసుపత్రిని ఖాళీ చేశారు.
మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. వారు వచ్చేసరికి కూడా సంధ్య మృతదేహం ఘటనా స్థలంలోనే పడి ఉంది. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఉన్నతాధికారులు కలుగజేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాత్రి 10:30 గంటలకు ఆందోళన విరమించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.