Neha Gupta: అమెరికాలో... కన్నబిడ్డను చంపి కట్టుకథ అల్లిన భారత సంతతి వైద్యురాలు

- ఫ్లోరిడాలో స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయిందని నాటకం
- పోస్ట్మార్టంలో ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిర్ధారణ
- భర్తతో కస్టడీ గొడవలే హత్యకు కారణమని అనుమానం
- ఒక్లహామాలో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
- తొందరపడి అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్న లాయర్
వృత్తిరీత్యా వైద్యురాలు, ప్రాణాలు కాపాడాల్సిన తల్లే తన కన్న కూతురి పాలిట యమదూతగా మారింది. నాలుగేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన భారత సంతతి వైద్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే, ఒక్లహామాకు చెందిన చిన్నపిల్లల వైద్యురాలు నేహా గుప్తా (36), తన నాలుగేళ్ల కుమార్తె ఆర్య తలాఠీతో కలిసి ఫ్లోరిడాలోని ఎల్ పోర్టల్కు విహారయాత్రకు వెళ్లింది. జూన్ 27న తెల్లవారుజామున 3:30 గంటలకు, అద్దెకు తీసుకున్న ఇంట్లోని స్విమ్మింగ్ పూల్లో తన కుమార్తె పడిపోయి చనిపోయిందని 911కు ఫోన్ చేసి చెప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అప్పటికే కదలకుండా పూల్లో ఉన్న చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
అయితే, పోస్ట్మార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. చిన్నారి ఊపిరితిత్తుల్లో కానీ, కడుపులో కానీ నీరు లేదని, నోటిపై గాయాలు ఉన్నాయని తేలింది. ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాతే మృతదేహాన్ని నీటిలో పడేశారని మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నేహా గుప్తాకు, ఆమె మాజీ భర్త సౌరభ్ తలాఠీకి మధ్య పిల్లల సంరక్షణ హక్కుల (కస్టడీ) కోసం తీవ్రమైన న్యాయపోరాటం జరుగుతున్నట్లు తెలిసింది. కుమార్తె సంరక్షణను పూర్తిగా తనకే అప్పగించాలన్న నేహా అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా, భర్తకు ఆమె 79,000 డాలర్లు చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దీంతో, ఫ్లోరిడా నుంచి తన సొంత రాష్ట్రమైన ఒక్లహామాకు పారిపోయిన నేహాను, మయామీ పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను నేహా తరఫు న్యాయవాది రిచర్డ్ కూపర్ ఖండించారు. పోలీసులు ఒత్తిడికి గురై తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని, పూర్తిస్థాయి విచారణలో నిజానిజాలు బయటపడతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం నిందితురాలిని మయామీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, ఒక్లహామాకు చెందిన చిన్నపిల్లల వైద్యురాలు నేహా గుప్తా (36), తన నాలుగేళ్ల కుమార్తె ఆర్య తలాఠీతో కలిసి ఫ్లోరిడాలోని ఎల్ పోర్టల్కు విహారయాత్రకు వెళ్లింది. జూన్ 27న తెల్లవారుజామున 3:30 గంటలకు, అద్దెకు తీసుకున్న ఇంట్లోని స్విమ్మింగ్ పూల్లో తన కుమార్తె పడిపోయి చనిపోయిందని 911కు ఫోన్ చేసి చెప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అప్పటికే కదలకుండా పూల్లో ఉన్న చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
అయితే, పోస్ట్మార్టం నివేదికలో అసలు నిజం బయటపడింది. చిన్నారి ఊపిరితిత్తుల్లో కానీ, కడుపులో కానీ నీరు లేదని, నోటిపై గాయాలు ఉన్నాయని తేలింది. ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాతే మృతదేహాన్ని నీటిలో పడేశారని మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నేహా గుప్తాకు, ఆమె మాజీ భర్త సౌరభ్ తలాఠీకి మధ్య పిల్లల సంరక్షణ హక్కుల (కస్టడీ) కోసం తీవ్రమైన న్యాయపోరాటం జరుగుతున్నట్లు తెలిసింది. కుమార్తె సంరక్షణను పూర్తిగా తనకే అప్పగించాలన్న నేహా అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా, భర్తకు ఆమె 79,000 డాలర్లు చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దీంతో, ఫ్లోరిడా నుంచి తన సొంత రాష్ట్రమైన ఒక్లహామాకు పారిపోయిన నేహాను, మయామీ పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. అయితే, ఈ ఆరోపణలను నేహా తరఫు న్యాయవాది రిచర్డ్ కూపర్ ఖండించారు. పోలీసులు ఒత్తిడికి గురై తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని, పూర్తిస్థాయి విచారణలో నిజానిజాలు బయటపడతాయని ఆయన అన్నారు. ప్రస్తుతం నిందితురాలిని మయామీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.