Ravindra Jadeja: జడేజా డ్రామా అద్భుతం... ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం తీవ్ర అసహనం!

- ఎడ్జ్ బాస్టన్ లో టీమిండియా-ఇంగ్లండ్ రెండో టెస్టు
- జడేజాపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ విమర్శలు
- బ్యాటింగ్ చేస్తూ కావాలనే సమయం వృథా చేశాడని ఆరోపణ
- స్పిన్కు అనుకూలంగా పిచ్ను దెబ్బతీశాడని ఘాటు వ్యాఖ్యలు
- జడేజా చేసింది పెద్ద డ్రామా అని, తాను కూడా అలాగే చేసేవాడినని ఎద్దేవా
- అంపైర్లు చూస్తూ ఉండిపోయారంటూ అసహనం వ్యక్తం చేసిన లాయిడ్
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తుండటంతో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై సంచలన ఆరోపణలు చేశాడు. జడేజా ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని, ఉద్దేశపూర్వకంగా సమయాన్ని వృథా చేయడమే కాకుండా పిచ్ను పాడుచేశాడని విమర్శించాడు.
రెండో రోజు ఆటలో జడేజా పదేపదే బ్రేకులు తీసుకోవడంపై లాయిడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. "ఆట మొదలైన 15 నిమిషాలకే జడేజా డ్రింక్స్, మాత్రల కోసం ఆటను ఆపాడు. మరో 40 నిమిషాలకు మళ్లీ బ్రేక్ తీసుకున్నాడు. ఈ సమయంలో అంపైర్లు నిస్సహాయంగా నిలబడిపోయారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలి" అని అన్నాడు.
అంతేకాకుండా, జడేజా తన బౌలింగ్కు అనుకూలంగా పిచ్ను దెబ్బతీశాడని లాయిడ్ ఆరోపించాడు. "జడేజా ఉదయం చేసిన డ్రామా అద్భుతంగా ఉంది. అతను ప్రతీ బంతి తర్వాత పిచ్ను బ్యాట్తో కొట్టడం, కాలితో రుద్దడం గమనించాను. ఇది చాలా డ్రై పిచ్. క్రమంగా ఇది స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వెల్డన్ రవి.. నేను నీ స్థానంలో ఉన్నా అలాగే చేసేవాడిని" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భారత్ భారీ స్కోరు (587) సాధించి, ఇంగ్లండ్ను ఆరంభంలోనే దెబ్బతీయడంతోనే లాయిడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రెండో రోజు ఆటలో జడేజా పదేపదే బ్రేకులు తీసుకోవడంపై లాయిడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. "ఆట మొదలైన 15 నిమిషాలకే జడేజా డ్రింక్స్, మాత్రల కోసం ఆటను ఆపాడు. మరో 40 నిమిషాలకు మళ్లీ బ్రేక్ తీసుకున్నాడు. ఈ సమయంలో అంపైర్లు నిస్సహాయంగా నిలబడిపోయారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలి" అని అన్నాడు.
అంతేకాకుండా, జడేజా తన బౌలింగ్కు అనుకూలంగా పిచ్ను దెబ్బతీశాడని లాయిడ్ ఆరోపించాడు. "జడేజా ఉదయం చేసిన డ్రామా అద్భుతంగా ఉంది. అతను ప్రతీ బంతి తర్వాత పిచ్ను బ్యాట్తో కొట్టడం, కాలితో రుద్దడం గమనించాను. ఇది చాలా డ్రై పిచ్. క్రమంగా ఇది స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వెల్డన్ రవి.. నేను నీ స్థానంలో ఉన్నా అలాగే చేసేవాడిని" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భారత్ భారీ స్కోరు (587) సాధించి, ఇంగ్లండ్ను ఆరంభంలోనే దెబ్బతీయడంతోనే లాయిడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.