Ambati Rambabu: పవన్కు సోయి లేదు.. బాబు స్క్రిప్ట్ చదువుతున్నారు: అంబటి రాంబాబు ఫైర్

- డిప్యూటీ సీఎం పవన్కు రాష్ట్రంపై సోయి లేదు
- చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే పవన్ చదువుతున్నారు
- రాష్ట్రంలో దాడులు చేస్తోంది టీడీపీ గూండాలే
- వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు
- రాజకీయాలు నేర్చుకోవాలని పవన్కు హితవు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు రాష్ట్రంలో ఏం జరుగుతుందో సోయి లేదని, ఆయన ముందుగా రాజకీయాలు నేర్చుకోవాలని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. పవన్ కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదువుతున్నారని, సొంత అవగాహనతో మాట్లాడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టకుండా పవన్ తన షూటింగ్లు, స్పెషల్ ఫ్లైట్లతో బిజీగా ఉన్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని అంబటి ఆరోపించారు. పొన్నూరు, వినుకొండ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న దాడులకు తెలుగుదేశం పార్టీ గూండాలే కారణమని, ఈ వాస్తవాన్ని పవన్ కల్యాణ్ గ్రహించడం లేదని అన్నారు. చంద్రబాబుకు సన్నిహితులైన కొందరు రిటైర్డ్, ప్రస్తుత పోలీస్ అధికారుల బృందం.. వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని, నేరస్థులను కాపాడుతోందని ఆయన ఆరోపించారు. ఈ దాడులన్నింటికీ సంబంధించిన జాబితా తన వద్ద ఉందని తెలిపారు.
ఎన్నికల్లో తమకు 11 సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ, 40 శాతం ఓటింగ్ సాధించామని అంబటి గుర్తుచేశారు. ఈ విషయాన్ని విస్మరించి తమను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ ఒంటరిగా నిలబడితే రెండుచోట్లా ఓడిపోయిన చరిత్ర ఆయనకుందని, ఇప్పుడు టీడీపీ, బీజేపీలతో కలవడం వల్లే గెలిచారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పవన్ తీరును ఉద్దేశిస్తూ ఆయన ఒక కథ చెప్పారు.
"అదో స్వామి చెప్పినట్టు మా ఊర్లో ఒకడు ఉండేవాడు. 'ఎంతుందిరా పొలం?' అంటే '350 ఎకరాలండి' అనేవాడు. 'నీకేనా?' అని అడిగితే, 'నాకును, చల్లపల్లి జమీందారు గారికి కలిపి. ఆయనకి 349 ఎకరాలు, నాకు ఒక ఎకరం' అని చెప్పేవాడు. నీ వ్యవహారం కూడా అట్టాగే ఉంది. నువ్వు సింగిల్గా నిలబడితే ఓడిపోయావు, ఇప్పుడు చంద్రబాబు, మోదీ గారితో కలిస్తే నీకు 21 సీట్లు వచ్చాయి. దానిలో నీ మహత్యం ఏముందో మాకు తెలియదు. మీకున్నది ఆ ఒక్క ఎకరమే, అది కూడా ఉందో లేదో. దయచేసి పవన్ కల్యాణ్ గారు రాజకీయాలు నేర్చుకోండి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి" అంటూ అంబటి ఘాటుగా విమర్శించారు.
కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని అంబటి అన్నారు. ప్రజలు జగన్ పాలనను గుర్తుచేసుకుంటూ, కూటమికి ఓటు వేసి తప్పు చేశామని బాధపడుతున్నారని చెప్పారు. ప్రజల్లోకి జగన్ వస్తే తట్టుకోలేమనే భయంతోనే ప్రభుత్వం ఆయన పర్యటనలకు అనుమతులు నిరాకరిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని అంబటి ఆరోపించారు. పొన్నూరు, వినుకొండ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న దాడులకు తెలుగుదేశం పార్టీ గూండాలే కారణమని, ఈ వాస్తవాన్ని పవన్ కల్యాణ్ గ్రహించడం లేదని అన్నారు. చంద్రబాబుకు సన్నిహితులైన కొందరు రిటైర్డ్, ప్రస్తుత పోలీస్ అధికారుల బృందం.. వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోందని, నేరస్థులను కాపాడుతోందని ఆయన ఆరోపించారు. ఈ దాడులన్నింటికీ సంబంధించిన జాబితా తన వద్ద ఉందని తెలిపారు.
ఎన్నికల్లో తమకు 11 సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ, 40 శాతం ఓటింగ్ సాధించామని అంబటి గుర్తుచేశారు. ఈ విషయాన్ని విస్మరించి తమను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ ఒంటరిగా నిలబడితే రెండుచోట్లా ఓడిపోయిన చరిత్ర ఆయనకుందని, ఇప్పుడు టీడీపీ, బీజేపీలతో కలవడం వల్లే గెలిచారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పవన్ తీరును ఉద్దేశిస్తూ ఆయన ఒక కథ చెప్పారు.
"అదో స్వామి చెప్పినట్టు మా ఊర్లో ఒకడు ఉండేవాడు. 'ఎంతుందిరా పొలం?' అంటే '350 ఎకరాలండి' అనేవాడు. 'నీకేనా?' అని అడిగితే, 'నాకును, చల్లపల్లి జమీందారు గారికి కలిపి. ఆయనకి 349 ఎకరాలు, నాకు ఒక ఎకరం' అని చెప్పేవాడు. నీ వ్యవహారం కూడా అట్టాగే ఉంది. నువ్వు సింగిల్గా నిలబడితే ఓడిపోయావు, ఇప్పుడు చంద్రబాబు, మోదీ గారితో కలిస్తే నీకు 21 సీట్లు వచ్చాయి. దానిలో నీ మహత్యం ఏముందో మాకు తెలియదు. మీకున్నది ఆ ఒక్క ఎకరమే, అది కూడా ఉందో లేదో. దయచేసి పవన్ కల్యాణ్ గారు రాజకీయాలు నేర్చుకోండి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి" అంటూ అంబటి ఘాటుగా విమర్శించారు.
కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందని అంబటి అన్నారు. ప్రజలు జగన్ పాలనను గుర్తుచేసుకుంటూ, కూటమికి ఓటు వేసి తప్పు చేశామని బాధపడుతున్నారని చెప్పారు. ప్రజల్లోకి జగన్ వస్తే తట్టుకోలేమనే భయంతోనే ప్రభుత్వం ఆయన పర్యటనలకు అనుమతులు నిరాకరిస్తోందని విమర్శించారు.