Karnataka Crime: హత్యలు చేసి శవాలు నాకిచ్చారు.. వ్యక్తి వాంగ్మూలంతో కర్ణాటకలో కలకలం!

- కర్ణాటకలో సంచలనం రేపుతున్న ఓ వ్యక్తి వాంగ్మూలం
- పలు హత్యల తర్వాత మృతదేహాలను పారేసింది తానేనని వెల్లడి
- ప్రాణాలు తీస్తామని బెదిరించడంతోనే ఈ పని చేశానని ఒప్పుకోలు
- చట్టపరమైన రక్షణ కల్పిస్తే అన్ని నిజాలు బయటపెడతానని అభ్యర్థన
- వ్యక్తిపై కేసు నమోదు చేసి, గుర్తింపును గోప్యంగా ఉంచిన పోలీసులు
కర్ణాటకలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు చేసిన హత్యలకు సంబంధించిన మృతదేహాలను తానే స్వయంగా పారేశానంటూ ఓ వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రాణభయంతోనే తాను ఈ నేరంలో భాగమయ్యానని, ఇప్పుడు అపరాధ భావనతో కుమిలిపోతున్నానని వాపోయాడు.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురువారం స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. తనను కొందరు తీవ్రంగా బెదిరించారని, వారు చేసిన హత్యల తర్వాత మృతదేహాలను వదిలించుకునే పనిని తనకు అప్పగించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి ఆదేశాలను పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో భయంతో ఆ పని చేశానని తెలిపాడు.
అయితే, చేసిన తప్పునకు ఇప్పుడు తన మనసు క్షోభిస్తోందని, ఆ హత్యలు చేసిన వారి పూర్తి వివరాలు, మృతదేహాలను ఎక్కడెక్కడ పడేశానో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని అతను పోలీసులకు వివరించాడు. అయితే, అందుకు తనకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరాడు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, అతని అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నారు. కోర్టు నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత, శుక్రవారం ఆ వ్యక్తిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 211(ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు. నేరానికి సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అందించడంలో విఫలమైనందుకు ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదు చేసిన వ్యక్తి అభ్యర్థన మేరకు అతని గుర్తింపును, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
వివరాల్లోకి వెళితే.. దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురువారం స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. తనను కొందరు తీవ్రంగా బెదిరించారని, వారు చేసిన హత్యల తర్వాత మృతదేహాలను వదిలించుకునే పనిని తనకు అప్పగించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి ఆదేశాలను పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో భయంతో ఆ పని చేశానని తెలిపాడు.
అయితే, చేసిన తప్పునకు ఇప్పుడు తన మనసు క్షోభిస్తోందని, ఆ హత్యలు చేసిన వారి పూర్తి వివరాలు, మృతదేహాలను ఎక్కడెక్కడ పడేశానో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని అతను పోలీసులకు వివరించాడు. అయితే, అందుకు తనకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరాడు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, అతని అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నారు. కోర్టు నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత, శుక్రవారం ఆ వ్యక్తిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 211(ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు. నేరానికి సంబంధించిన సమాచారాన్ని సకాలంలో అందించడంలో విఫలమైనందుకు ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చట్టపరమైన దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదు చేసిన వ్యక్తి అభ్యర్థన మేరకు అతని గుర్తింపును, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.