nani: నాని - శర్వానంద్ ల 'దాగుడుమూతలు'?


దిల్ రాజు - హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'దువ్వాడ జగన్నాథమ్' మాస్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఈ కాంబినేషన్లో మరో సినిమాకి రంగం సిద్ధమవుతోంది. ఇది మల్టీస్టారర్ మూవీ అని తెలుస్తోంది. తాను అనుకున్న హీరోల పాత్రలకి నాని - శర్వానంద్ సరిగ్గా సరిపోతారని దిల్ రాజుకి హరీశ్ శంకర్ చెప్పాడట.

 ఈ ఇద్దరు హీరోలు దిల్ రాజు బ్యానర్లో హిట్స్ కొట్టిన వాళ్లే. అందువలన వాళ్లు తప్పకుండా అంగీకరించే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లిద్దరినీ ఒప్పించే పనిలోనే దిల్ రాజు వున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి 'దాగుడుమూతలు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం నాని .. శర్వానంద్ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.     

  • Loading...

More Telugu News