maheshbabu: మహేశ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు!

  • 'భరత్ అను నేను' షూటింగులో బిజీగా మహేశ్ 
  • కథానాయికగా కైరా అద్వాని 
  • ఈ సినిమాపైనే మహేశ్ ఫ్యాన్స్ ఆశలు 
  • ఏప్రిల్ 27వ తేదీన విడుదల ఖరారు

ప్రస్తుతం మహేశ్ బాబు .. కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ మధ్య 'స్పైడర్' ప్రమోషన్స్ కోసం బ్రేక్ తీసుకున్న మహేశ్ బాబు .. మళ్లీ 'భరత్ అను నేను'పై దృష్టి పెట్టాడు.

 డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాను, వచ్చే ఏడాది ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేసే అవకాశం వున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా అదే డేట్ ను దర్శక నిర్మాతలు ఫిక్స్ చేశారు. కైరా అద్వాని ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. 'స్పైడర్' ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో, మహేశ్ తో పాటు ఆయన అభిమానులంతా నిరాశ చెందారు. 'భరత్ అను నేను' భారీ విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు. వాళ్ల అంచనాలను కొరటాల అందుకుంటాడేమో చూడాలి.       

  • Loading...

More Telugu News