suicide: క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో త‌న‌కు త‌క్కువ వేతన ఉద్యోగం ఇచ్చార‌ని.. ఎన్ఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మ‌హ‌త్య!

  • పాట్నా ఎన్ఐటీలో ప్రాంగ‌ణ నియామ‌కాలు
  • త‌క్కువ వేత‌నం వ‌చ్చే ఉద్యోగానికి ఎంపికైన క‌రీంన‌గ‌ర్ విద్యార్థి
  • కుంగుబాటుకు గురైన విద్యార్థి పెంట‌ప‌త్రి సురేంద్ర
  • హాస్ట‌ల్ గ‌దిలో ఉరి వేసుకున్న వైనం

పాట్నా ఎన్‌ఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. తాజాగా ఆ క్యాంప‌స్‌లో ఉద్యోగ నియామ‌కాల కోసం ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించారు. ప్రాంగ‌ణ నియామ‌కాల్లో తెలుగు విద్యార్థి పెంట‌ప‌త్రి సురేంద్రకు ఉద్యోగం వ‌చ్చింది. అయితే, ఆ విద్యార్థి చ‌దువుకు త‌గ్గ‌ట్లు, ఆశించిన‌ ఉద్యోగం రాలేదు. త‌న‌కు త‌క్కువ వేత‌నం వ‌చ్చే ఉద్యోగాన్ని ఇచ్చార‌ని ఆ విద్యార్థి కుంగిపోయాడు. డిప్రెష‌న్‌లో ఉన్న ఆ విద్యార్థి త‌మ‌ వ‌స‌తి గృహం గ‌దిలో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి సొంత ఊరు క‌రీంన‌గ‌ర్ అని పోలీసులు తెలిపారు.  

  • Loading...

More Telugu News