mvr chowdary: జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న విజయవాడ టీడీపీ నేత ఎంవీఆర్ చౌదరి!

  • టీడీపీలో సరైన గుర్తింపు లేదనే భావనతోనే పార్టీ మారాలనే నిర్ణయం
  • ఈ నెల 29న వైసీపీ తీర్థం
  • విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మారనున్న రాజకీయ సమీకరణాలు

విజయవాడ టీడీపీలో కీలక నేత అయిన ఎంవీర్ చౌదరి (మండవ వెంకట్రామ్ చౌదరి) ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈనెల 29న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. వందలాది మంది కార్యకర్తలతో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏళ్ల తరబడి టీడీపీకి సేవలందించినా, సరైన గుర్తింపు లభించలేదనే ఆవేదనతోనే ఆయన పార్టీ మారుతున్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంవీఆర్ చౌదరికి మంచి పట్టు ఉంది. ఆయన పార్టీ మారితే టీడీపీకి తలనొప్పులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆయన భార్య అనురాధ కృష్ణా జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉన్నారు. భార్యాభర్తలిద్దరికీ పదవులు కట్టబెట్టి, తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతోనే, ఎంవీఆర్ చౌదరి టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు.


  • Loading...

More Telugu News